ఆలయ భూముల చిక్కుముడి వీడేనా?
మంత్రి ఆదేశాలతో అధికారుల కసరత్తున్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం, జగితాల విద్యానగర్దేవాదాయ శాఖకు చెందిన భూములు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మంత్రి ఆదేశాలతో అధికారుల కసరత్తు
న్యూస్టుడే, కరీంనగర్ సాంస్కృతికం, జగితాల విద్యానగర్
దేవాదాయ శాఖకు చెందిన భూములు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అన్యాక్రాంతమై భూములను స్వాధీనం చేసుకునేందుకు దేవాదాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాల విభజనతో భూములను గుర్తించడంలో సమస్యలు వస్తున్నట్లు వారు తెలిపారు. ప్రస్తుతం వీటిని గుర్తించే పనిలో పడ్డారు. ఇటీవల రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రెండ్రోజులు అధికారులతో ఆలయ భూములు, రెవెన్యూ, ఆదాయ, వ్యయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని చోట్ల వివాదాస్పద భూములపై ట్రిబ్యూనల్, హైకోర్టులలో కేసులు నడుస్తున్నాయి.
ధరణిలో సగమే నమోదు
ధరణి పోర్టల్ రాకముందు ఆలయ భూములు.. మిగులు భూములుగా రికార్డుల్లో ఉండేవి. కొని ఆక్రమణదారులు, అర్చకులు, సంరక్షకులు, కౌలుదారులు పేరు మీద కొనసాగుతున్నాయి. ధరణి రావడంతో గత ప్రభుత్వం సైన్ బోర్డులు ఏర్పాటు చేయించింది. సమస్యాత్మకంగా ఉన్న వాటిల్లో, అధికారులు అందుబాటులో లేకపోవడంతోనో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. ఆలయ భూములన్నీంటికి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని సమీక్షలో మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆక్రమణదారులు, స్వాధీనం చేసుకున్న వారిలో ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లాలో దేవాదాయ శాఖ భూములు 3634.65 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 1932.46 ఎకరాలు ఆలయాల పేరు మీద ధరణిలో నమోదు చేశారు. ఇంకా 1702.19 ఎకరాలు నమోదు కావాల్సి ఉంది. 423 ఆలయాల్లో.. 55 ఆలయాలకు చెందిన 572.29 భూమికి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయి. ఇంకా 368 ఆలయాలకు చెందిన 3062.36 భూమికి పుస్తకాలు జారీ చేయాల్సి ఉంది.
సాంకేతిక కారణాలే సమస్య..
ఆలయాల పేరు మీద ఉన్న భూమికి పట్టాదారు పాసు పుస్తకం ఎవరి పేరు మీద జారీ చేయాలన్నదే సమస్యగా మారింది. ధరణి పోర్టల్ నిబంధనల ప్రకారం ఆధార్ ఉంటేనే పాసు పుస్తకం ఇవ్వడం కుదురుతుంది. ఒక వేళ కస్టోడియన్గా దేవాదాయ అధికారుల పేరుతో పాసుపుస్తకాలు ఇవ్వాలంటే నిబంధనల మేరకు కుదరదు. అయితే ఆలయాలన్నింటికి పాన్ కార్డు ఉంది. ఇది ఆయా ఆలయ బ్యాంకు ఖాతాలతో అనుసంధానమై ఉంటుంది. ఈ అంశాన్ని ఉన్నతాధికారులు పరిశీలించాలని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా పాలనాధికారులకు బాధ్యతలు అప్పగించి భూములకు కస్టోడియన్గా వాళ్ల పేరు మీద పాసుపుస్తకం జారీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశం కూడా అధికారులు చర్చిస్తున్నారు. ఏది ఏమైనా సాంకేతిక సమస్యలు అధిగమిస్తేనే ఆలయ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసే అవకాశముంది.
విధివిధానాల తర్వాతే..
ఆలయ భూములకు పట్టాదారు పుస్తకాలు జారీ అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సాంకేతిక సమస్యలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది చర్చిస్తోంది. దీనిపై విధివిధానాలు వచ్చిన తర్వాత అన్ని భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసే అవకాశముంది.
ఆకునూరి చంద్రశేఖర్, అసిస్టెంట్ కమిషనర్, ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!