రిజర్వాయర్ నిర్మించి... కాలువలు విస్మరించి
జలాశయం నిండా నీరున్నా ఆయకట్టుకు అందని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కర్షకుల కళ్లెదుటే నీరు వృథాగా పోతున్నా ఏమీ చేయలేదని పరిస్థితి ఏర్పడింది.
నీరున్నా దక్కని ఫలితం
న్యూస్టుడే, రుద్రంగి
నాగారం రిజర్వాయర్
జలాశయం నిండా నీరున్నా ఆయకట్టుకు అందని పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి ఈ సమస్య కొనసాగుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కర్షకుల కళ్లెదుటే నీరు వృథాగా పోతున్నా ఏమీ చేయలేదని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రంలో ఎగువన ఉన్న నాగారం చెరువు సామర్థ్యం పెంచడం ద్వారా ఆయకట్టు ప్రాంతం సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దానిని రిజర్వాయర్గా మార్పు చేశారు. ఇది జరిగి దశాబ్దం దాటింది. రిజర్వాయర్ దిగువన ఆయకట్టుకు సాగునీరు అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో సుమారు 2 వేల ఎకరాలకు పైగా భూములకు సాగునీరు అందడం లేదు. దీంతో జలాశయం ఉన్నా ప్రయోజనం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జలాశయంలో నీరు పూర్తి స్థాయిలో నిల్వ ఉన్నా దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేదు. దీంతో ఏటా వందల సంఖ్యలో నూతనంగా బావులు, బోరుబావులు తవ్వుతూ అధిక పెట్టుబడులను రైతులు వెచ్చించాల్సి వస్తోంది. కాలువల నిర్మాణానికి భూసేకరణ, నిర్మాణ పనులను పూర్తి చేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు రిజర్వాయర్కు ఇరువైపులా ఏర్పాటు చేసిన తూముల ద్వారా నీటిని దిగువన ఉన్న మత్తడి నీరు వెళ్లే మార్గం నుంచి అయినా విడుదల చేస్తే సమీపంలోని కనీసం 200 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం చేకూరేది. కానీ తూములను ఎత్తైన ప్రాంతంలో నిర్మించడంతో రిజర్వాయర్లో నీరున్నా ఆయకట్టుకు అందించలేని దుస్థితి నెలకొంది.
కుడి వైపు తూము లీకేజీతో...
రిజర్వాయర్కు కుడి, ఎడమ వైపు రెండు తూములను ఏర్పాటు చేశారు. గతేడాది వర్షాకాలంలో కుడి వైపు ఉన్న తూము లీకేజీకి గురికావడంతో రిజర్వాయర్లోని నీరు వృథాగా దిగువకు వెళ్లిపోయింది. దీంతో కొద్ది రోజుల్లోనే నీటి మట్టం తగ్గిపోయింది. ఈ తూముకు మరమ్మతులు చేస్తే కనీసం ఈ వర్షాకాలంలో అయినా నీరు వృథా కాకుండా ఉంటుంది.
మోటార్ల ఏర్పాటుతో...
మండల కేంద్రంలోని రైతులు వానాకాలం, యాసంగి సీజన్ల్లో ఎక్కువగా వరి పండిస్తారు. ఆ తర్వాత మొక్కజొన్న, పసుపు, కూరగాయల సాగుకు ప్రాధాన్యం ఇస్తారు. వరి పండించే రైతులు అధికంగా బావులు, బోరుబావులపై ఆధారపడి సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రిజర్వాయర్లోని నీరు పంటలకు అందించే డిస్ట్రిబ్యూటరీ కాలువలు లేకపోవడంతో రైతులే సొంతంగా వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ 500 మీటర్ల దూరం నుంచి 1.5 కి.మీ.ల దూరం వరకు పైప్లైన్ వేసుకుని మోటార్ల ద్వారా నీటిని పంటలకు మళ్లించుకుంటున్నారు.
దశాబ్దం అయినా...
నాగారం రిజర్వాయర్ దిగువన డిస్ట్రిబ్యూటరీ కాలువలు నిర్మిస్తే ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుంది. ఇప్పటికే రిజర్వాయర్ నిర్మించి దశాబ్దం అవుతుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే కాలువ నిర్మాణానికి చర్యలు చేపట్టాలి.
ఉప్పులూటి గణేశ్, రైతు, రుద్రంగి
త్వరలో నిర్మాణానికి చర్యలు
ఎల్లంపల్లి ప్యాకేజీ-2లో భాగంగా నాగారం రిజర్వాయర్ కింద ఉన్న ఆయకట్టుకు సాగునీటి కాలువల ఏర్పాటు పనులను అతి త్వరలో చేపడతాం. అలాగే కుడివైపు తూము నుంచి లీకేజీ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.
సంతుప్రకాశ్, ఈఈ, ఎల్లంపల్లి ప్రాజెక్ట్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత