ప్రాణాలు మింగేస్తున్న కోల్బెల్టు రహదారి
కొత్తగా నిర్మించిన కోల్బెల్టు రహదారిపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. గనులకు వెళ్లే కార్మికులతో పాటు మంథనికి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో వాహనాల రద్దీ పెరిగింది.
వరుస ప్రమాదాలతో భయాందోళనలు
న్యూస్టుడే, గోదావరిఖని
జీడీకే ఒకటో గనినుంచి మంథనికి వెళ్లే రహదారి
- గత ఏడాది నవంబరు నెలలో జీడీకే-11 గనిలో రెండో షిఫ్టు విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికుడు సంపత్ లారీ టైరు కింద పడి దుర్మరణం చెందాడు. రహదారిపై వెళ్తున్న అతనిపై లారీ పైనుంచి బొగ్గు పెళ్ల మీద పడటంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి లారీ వెనుక టైరు కింద పడ్డాడు. అతని తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
- ఈ ఏడాది మార్చి 21న గోదావరిఖని నుంచి మంథనికి వెళ్తున్న యువకుడు మంద కిరణ్ ఇదే రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. వెనుక కూర్చున్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గోదావరిఖనికి ద్విచక్ర వాహనంపై వచ్చిన వీరు రాత్రి సమయంలో తిరిగి మంథని వెళ్తుండగా జీడీకే-2 గని సమీపంలో రహదారిపై ప్రమాదం జరిగింది. చీకట్లో ఆగిఉన్న లారీ కనిపించకపోవడంతో దానికి ఢీకొని మృతి చెందాడు.
కొత్తగా నిర్మించిన కోల్బెల్టు రహదారిపై వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. గనులకు వెళ్లే కార్మికులతో పాటు మంథనికి వెళ్లే ప్రధాన రహదారి ఇదే కావడంతో వాహనాల రద్దీ పెరిగింది. పరిసర గ్రామాలను అనుసంధానం చేస్తూ నిర్మించడంతో గ్రామస్థుల రాకపోకలు అధికమయ్యాయి. రహదారి నిర్మాణంలో కనీస ప్రమాణాలు పాటించకపోవడతో ఎక్కువగా ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన నిలిపిన లారీలు కనిపించక ద్విచక్ర వాహనదారులు వాటికి ఢీకొని దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నలుగురు మృత్యువాత పడ్డారు. సింగరేణిలో కొత్తగా ఓసీపీ-5 ఏర్పాటు చేయడంతో ఈ రహదారిని కొత్తగా నిర్మించారు. జీడీకే-1, 2, 2-ఎ గనుల సమీపంతో పాటు జీడీకే-11 గనులకు ఇదేమార్గం ద్వారా వెళ్లాలి. వీటితో పాటు మంథనికి వెళ్లేందుకు ప్రధాన రహదారి ఇదే. జనగామ, సుందళ్ల, ముస్త్యాల, గడ్డంపల్లి గ్రామాలను కలుపుతూ నిర్మించిన కొత్త రహదారి నిర్మాణంలో సరైన ప్రమాణాలు పాటించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులు ఈ రహదారిపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది.
తెరచుకోని 11వ గని పాత రహదారి
కార్మికులకు అందుబాటులో ఉండే జీడీకే-11 గని పాత రహదారిని తెరవాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా సింగరేణి యాజమాన్యం పట్టించుకోవడం లేదు. గోదావరిఖని పట్టణం నుంచి కేవలం అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడీకే-11 గనికి ప్రస్తుతం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీని వల్ల 15 కిలోమీటర్ల దూరాభారం పెరిగింది. ఎలాంటి వాహనాల రద్దీ లేకుండా కేవలం కార్మికులు మాత్రం వెళ్లే రహదారిని ప్రారంభించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. జీడీకే-11 గని కార్మికుడు సంపత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గనికి చెందిన కార్మికులు ఆందోళన చేపట్టారు. లారీలను కదలనివ్వకుండా అడ్డుకున్నారు. గతంలో ఉన్న పాత రహదారిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులు పాత రహదారిని కొనసాగించారు. తాజాగా మళ్లీ దానిని మూసివేశారు. వర్షాలు కురియడంతో రహదారి బురదమయంగా మారిందని, దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయని కారణంగా పేర్కొంటూ అప్పట్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో ఈ గనిలో పనిచేసే 1200 మంది కార్మికులు, ఉద్యోగులు మళ్లీ 15 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళుతున్నారు.
లారీ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం
రహదారి ప్రమాదాలను నివారించేందుకు లారీ డ్రైవర్లకు గతంలో అవగాహన కల్పించాం. మళ్లీ సింగరేణి అధికారులతో కలిసి బొగ్గు రవాణా కాంట్రాక్టర్లు, లారీ డ్రైవర్లతో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. లారీలను రోడ్డు పక్కన పార్కింగ్ చేసే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలి. పార్కింగ్ లైట్లు వేయాలి. లారీ డ్రైవర్లకు ఈ విషయాన్ని చెప్పాం. కోల్బెల్టు రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకుంటాం.
రమేశ్, ఏసీపీ, గోదావరిఖని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు