మెరుగైన భద్రతా చర్యలు ముఖ్యం
దిల్లీలోని బేబీకేర్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు భవనాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు చిన్నారులు మృతిచెందారు.
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
నూతన భవనంలో రక్తశుద్ధి కేంద్రం పక్కన భద్రపరిచిన ఆక్సిజన్ సిలిండర్లు
దిల్లీలోని బేబీకేర్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో రెండు భవనాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు చిన్నారులు మృతిచెందారు. మరికొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు భద్రపరచడం, అగ్నిప్రమాద నియంత్రణ చర్యలు తీసుకోవడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలో నిర్మించిన ప్రైవేటు ఆసుపత్రుల్లో మినహా గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ఆసుపత్రుల్లో అగ్నిప్రమాద నివారణకు ఏర్పాట్లు నామమాత్రమే. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా 15 అడుగులకంటే ఎత్తులో ఉండే భవనాలకు అగ్నిమాపక కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 15 అడుగుల లోపు ఎత్తు కలిగిన భవనాలకు అగ్నిమాపక కేంద్రం అనుమతి అవసరం లేకపోయినా నివారణకు తగు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దిల్లీలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన మొదలుపెట్టారు. చాలాచోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అగ్నిప్రమాద నియంత్రణకు చర్యలు లేకపోవడం గమనార్హం. గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో పాత భవనంలోని కొన్ని వార్డుల్లో మాత్రమే ప్రమాద నియంత్రణ చర్యలు ఉండగా కొన్నిచోట్ల లేవు. సార్వజనిక ఆసుపత్రిగా స్థాయి పెరగగానే ఆసుపత్రిలో అగ్నిమాపక నివారణ చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆధునికీకరించిన విభాగాల్లో మాత్రం ఆయా చర్యలు కనిపించడం లేదు. ప్రధానంగా పిల్లల ఐ.సి.యు.లోనే అగ్నిప్రమాద నివారణకు ఏర్పాట్లు లేవు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఇటీవల నిర్మించిన 85 పడకల సామర్థ్యం గల భవనంలో అగ్నిప్రమాద నివారణ చర్యలు చేపట్టలేదు. ప్రమాదం జరిగినప్పుడు ఏవైపునుంచి బయటకు వెళ్లాలనే కనీస సూచికలు సైతం ఏర్పాటు చేయలేదు.
సిలిండర్ల నిల్వలపై నిర్లక్ష్యం
జిల్లాలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లను భద్రపరుస్తున్న తీరు ఆందోళనలకు తావిస్తోంది. చాలా వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో వార్డులు, ఆపరేషన్ థియేటర్లలోనే ఓ పక్కన సిలిండర్లను ఉంచుతున్నారు. ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో సిలిండర్లను భద్రపరచడంలో ప్రమాణాలను పాటించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయకముందు పాత భవనంలో మెట్ల కింద వార్డులకు అతి సమీపంలో ఆక్సిజన్ సిలిండర్లను ఉంచి అక్కడి నుంచి పైపులైను ద్వారా వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేస్తుండేవారు. ప్లాంటు ఏర్పాటు తర్వాత నేరుగా ప్లాంటు నుంచి వార్డులకు పైపులైను ద్వారా సరఫరా చేస్తున్నారు. 85 పడకల సామర్థ్యంతో నిర్మించిన నూతన భవనం ఆక్సిజన్ ప్లాంటుకు దూరంగా ఉండడంతో పైపులైను ద్వారా సరఫరా చేసే పరిస్థితులు లేవు. సిలిండర్ల ద్వారా ఐ.సి.యు.తో పాటు వివిధ వార్డులకు ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేశారు. ఇందుకు అవసరమైన సిలిండర్లను రక్తశుద్ధి కేంద్రం పక్కనే భద్రపరిచి అక్కడి నుంచి పైపులైను ద్వారా వార్డులకు సరఫరా చేస్తున్నారు. దురదృష్టవశాత్తూ ఏదైనా ఘటన జరిగితే పరిస్థితి ఏమిటన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. నూతన భవనంలోకి ఆక్సిజన్ సరఫరా చేసేలా పైపులైను ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. దీని కోసం ప్రత్యేక నిధులు విడుదల చేస్తే తప్ప నిర్మాణం జరిగే అవకాశం లేదు. దీనికంటే ప్రత్యేకంగా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు ఉత్తమమని సంబంధిత ఉన్నతాధికారులు సూచించడంతో దానినే ఏర్పాటు చేయాలంటూ ఆసుపత్రి వర్గాలు ఉన్నతాధికారులకు నివేదించాయి.
లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు కోసం నివేదించాం
కొవిడ్ సమయంలో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన పి.ఎస్.సి. ఆక్సిజన్ ప్లాంటు కంటే అవసరమైన ఒత్తిడితో పాటు తక్కువ వ్యయంతో ఉత్పత్తి జరిగేలా లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి నివేదించాం. పి.ఎస్.సి. ప్లాంటు నిర్వహణ వ్యయం ఎక్కువ కావడం, ఆక్సిజన్ ప్లాంటు నుంచి పైపులైను నిర్మాణానికి నిధులు ఎక్కువ అవసరం కానున్న నేపథ్యంలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు ఉత్తమమని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ హిమబిందుసింగ్, ప్రిన్సిపల్, ప్రభుత్వ వైద్య కళాశాల, గోదావరిఖని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం