అడ్డంకులు అధిగమిస్తేనే ఆరోగ్య పరిరక్షణ
ఏటా వ్యాధులు ముసురుతున్నాయి. రోగాల బారిన పడి ఒళ్లు హూనమవుతోంది. సకాలంలో ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికిపోతున్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్య శాఖ ప్రణాళిక
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
ఏటా వ్యాధులు ముసురుతున్నాయి. రోగాల బారిన పడి ఒళ్లు హూనమవుతోంది. సకాలంలో ప్రభుత్వ వైద్యం అందకపోవడంతో పేదలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా చితికిపోతున్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడంతో డెంగీ, మలేరియా కోరలు చాచుతున్నాయి. ఈ క్రమంలో వానాకాలం వ్యాధులపై అప్రమత్తంగా ఉండేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గతంలో ఎదురైన అనుభవాలను అధిగమించేందుకు పలు శాఖల సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టనుంది. గ్రామస్థాయి నుంచి జిల్లా వరకు ర్యాపిడ్ యాక్షన్ బృందాలను నియమించేందుకు సిద్ధమవుతోంది.
ఇవిగో సమస్యలు..
- ప్రతి సీజన్లో విష జ్వరాలతో ఊళ్లకుఊళ్లు మంచం పడుతున్నాయి.
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యానికి సరిపడా మందులు లేవు.
- రక్త, మూత్ర పరీక్షల పరికరాలు మూలనపడటంతో ప్రైవేటులో రూ.500 వెచ్చిస్తున్నారు.
- సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు జ్వరాలతో డెంగీ, చికెన్గున్యా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
- పల్లె, పట్టణాల్లో పారిశుద్ధ్యం లోపిస్తోంది. దోమల నియంత్రణ నామమాత్రంగా ఉంది.
- స్థానికంగా వైద్యం లేక కరీంనగర్, హన్మకొండ, హైదరాబాద్ నగరాల్లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు.
సమన్వయం ఫలించేనా?
జిల్లాలో 266 పంచాయతీలు, రామగుండం నగరపాలకసంస్థ, మంథని, పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపాలిటీల్లో సుమారు 8 లక్షలపైనా జనాభా ఉంది. జిల్లా ఆసుపత్రి, రామగుండం సార్వజనిక ఆసుపత్రి, మంథని, సుల్తానాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 18 ప్రాథమిక, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. జిల్లాలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రెవెన్యూ శాఖల సమన్వయంతో వైద్యఆరోగ్య శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. గ్రామస్థాయిలో ఏఎన్ఎం, ఆశాకార్యకర్త, మండలంలో వైద్యాధికారి, హెల్త్ అసిస్టెంట్, ఇతర సిబ్బంది, జిల్లా స్థాయిలో ప్రత్యేక అధికారులతో ర్యాపిడ్ బృందాలను నియమిస్తుంది. ఎక్కడ జ్వరాలు సోకిన వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స చేయనున్నారు. పరిసరాల పరిశుభ్రత, దోమలు నిల్వ లేకుండా మురుగునీరు తొలగింపుపై అవగాహన కల్పించనున్నారు.
వ్యాధుల నియంత్రణకు ప్రణాళిక
జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై ప్రణాళిక సిద్ధం చేశాం. గత అనుభవాలను అధిగమించేలా సన్నద్ధమవుతున్నాం. ప్రభుత్వ వైద్యశాలల్లో మందులు, సిబ్బంది కొరత లేదు. పరీక్ష పరికరాల సమస్య లేదు. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.
ప్రమోద్కుమార్, జిల్లా వైద్యాధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల