సైబర్ కేటుగాళ్లు
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. సాంకేతికతతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి.
అవగాహన కల్పిస్తున్నా తగ్గని కేసులు
న్యూస్టుడే, జగిత్యాల, జగిత్యాల గ్రామీణం
సాంకేతికత పెరుగుతున్న కొద్దీ మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. సాంకేతికతతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయి. అత్యాశకు పోయి చాలా మంది ఖాతాలోని డబ్బులు పోగొట్టుకొంటున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులోపడి మోసానికి గురవుతున్నారు. ఇటీవల జిల్లాలో నమోదైన సైబర్ కేసులపై కథనం..
జిల్లాలో ఈ మధ్య కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలోని కోరుట్లకు చెందిన శంకరయ్యను బెదిరించి రూ.4.23 కోట్లు కాజేశారు. ఇందులో పోలీసులు కొందరిని గుర్తించి పట్టుకుని జైలుకు పంపారు. ఇంకా కొంత మందిని అరెస్టు చేయాల్సి ఉంది. జిల్లా ఈ ఏడాది భారీగా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం 546 సైబర్ కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇందులో యూపీఐ ద్వారా నగదు దోచుకున్నవి 288 కేసులు నమోదు కాగా డెబిట్, క్రెడిట్ కార్డు పేరుతో దోచుకున్నవి 66, ఇంటర్ నెట్ బ్యాంకింగ్ పేరుతో మోసపోయినవి 62 కేసులు ఉండగా, ఫోన్ కాల్ ఆధారంగా మోస పోయినవి 36, బ్యాంకు డిపాజిట్లు తదితర 12, ఈ వ్యాలెట్ పేరతో 10, ఇతర 12 కేసులు నమోదైనట్లు పోలీసు గణంకాల ద్వారా తెలుస్తోంది.
గతంలో బ్యాంకులో దాచుకున్న సొమ్ము భద్రంగా ఉండేది. ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ వచ్చిన తర్వాత బ్యాంకు అధికారులకు సంబంధం లేకుండానే క్షణాల్లో ఇతరులకు డబ్బులు పంపించే వెసులుబాటు లభించింది. ఇదే సాంకేతికతను అడ్డం పెట్టుకుని అనేక విధానాల్లో సైబర్ నేరగాళ్లు సొమ్మును దోచుకుంటున్నారు. తక్షణం పోలీసులకు సమాచారం ఇచ్చిన కేసుల్లో మాత్రమే సొమ్ము తిరిగి ఇప్పిస్తున్నారు. ఆలస్యమైతే నేరగాళ్లు ఖాతానే మూసి వేసి ఆధారాలు లేకుండా చేస్తున్నారు.
- సైబర్ నేరాలకు: 1930కు సమాచారం ఇవ్వాలి
- జిల్లాలో ఈ ఏడాది నమోదైన సైబర్ కేసులు: 546
ఓటీపీ వివరాలు చెప్పవద్దు..
బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికి చెప్పకూడదు. ఒక వేళ మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930కు ఫోన్ చేసి చెప్పాలి. సైబర్ మోసాలపై జిల్లాలో ఇప్పటికే అవగాహన కల్పించాం. చాలా మంది అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి సొమ్ము పోగొట్టుకుంటున్నారు. ఇతరులకు బ్యాంకు ఓటీపీ వివరాలు చెప్పవద్దు.
రఘు చందర్, డీఎస్పీ, జగిత్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.