అదనపు కట్టడాలకు మదింపు
జిల్లాలోని కరీంనగర్ నగర పాలక సంస్థతోపాటు పురపాలికల్లో ఆస్తి పన్ను పరిధిలోకి రాని అదనపు కట్టడాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.
క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల కొలతలు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
నగరంలో అదనపు కట్టడాలకు కొలతలు తీసుకుంటున్న నగర పాలిక రెవెన్యూ ఉద్యోగులు
జిల్లాలోని కరీంనగర్ నగర పాలక సంస్థతోపాటు పురపాలికల్లో ఆస్తి పన్ను పరిధిలోకి రాని అదనపు కట్టడాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. అయిదారు ఏళ్లుగా ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో నిర్వహించకపోగా, భువన్ సర్వే సమయంలో కొన్ని ఇళ్లను ఆన్లైన్ ద్వారా మదింపు చేశారు. ఏటా పాత ఇళ్లను కూల్చి కొత్తగా నిర్మించుకోవడం, ఉన్న భవనాలపైనే అంతస్తులు నిర్మించుకుంటున్నారు. నివాసిత భవనాలను ఆధునికీకరించి వాణిజ్య భవనాలుగా మార్చుకుంటున్నారు. వీటన్నింటికి పాత ఆస్తిపన్ను మాత్రమే ఉంటుంది. పురపాలికలకు ఆదాయం రాకుండా పోతుండగా, పన్ను మదింపులో తేడాలు ఉంటుండటంతో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అదనపు కట్టడాలకు ఆస్తి పన్ను మదింపు చేయడంతోపాటు ఆన్లైన్లో నమోదు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు.
16 బృందాల ఏర్పాటు
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఏటా వెయ్యి ఇళ్లకు పైగా కొత్తగా నిర్మించుకుంటున్నారు. 70 శాతం పట్టణ ప్రణాళిక ద్వారా అనుమతులు తీసుకుంటుండగా మిగతా 30 శాతం అనధికారిక, అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. అనుమతులు తీసుకున్న వాటికి, అనధికారికంగా ఉన్న వాటికి ఇంటి నంబర్ల కోసం వస్తుండగా వాటికి భవన విస్తీర్ణం మేరకు పన్ను మదింపు చేస్తున్నారు. పాత ఇళ్లు, అదనపు కట్టడాలకు సంబంధించినవి మాత్రం ఆస్తి పన్ను పరిధిలోకి రావడం లేదు. ఇలాంటివి గుర్తించేందుకు నగర వ్యాప్తంగా 16 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ముగ్గురు ఉద్యోగులు ఉంటున్నారు. వీరంతా రెవెన్యూ డివిజన్ల వారీగా సర్వే చేస్తున్నారు. కొలతలు నిర్వహించి ఆస్తి పన్ను మదింపు చేయనున్నారు.
పెరగనున్న ఆదాయం
పాత ఇళ్లకు ఎప్పటిలాగే ఆస్తిపన్ను ఉండనుండగా అదనంగా నిర్మించుకున్న భవనాలు, అంతస్తులు, నివాసితం నుంచి వాణిజ్య అవసరాలకు మార్చుకున్న భవనాలకు తిరిగి కొలతలు నిర్వహిస్తుండటంతో వీటికి సంబంధించిన పన్ను పెరగనుంది. నగర, పురపాలికలకు సైతం ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. నగరంలో ఇలాంటి కట్టడాలు అనేకం ఉండగా వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని కార్పొరేటర్లు పలుమార్లు కౌన్సిల్ సమయాల్లో ప్రస్తావించారు. తద్వారా మరో రెండు కోట్ల ఆదాయం పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. ఇప్పటికే విలీన కాలనీల్లో పన్ను మదింపు పూర్తయ్యింది. భువన్ యాప్లో ఇళ్లను నిక్షిప్తం చేయడంతో కొలతల ఆధారంగా పన్ను చెల్లిస్తున్నారు.
15 రోజుల్లో పూర్తికి ఆదేశించాం
అదనపు కట్టడాల మదింపు అనేది నిరంతర ప్రక్రియ. నగర వ్యాప్తంగా ఒకేసారి సర్వే చేసేందుకు బృందాలు ఏర్పాటు చేశాం. 15 రోజుల్లో పూర్తి చేసేలా ఆదేశించాం. ఇప్పటివరకు 220 అదనపు కట్టడాలు గుర్తించి ఆన్లైన్లో కొలతలు నమోదు చేశాం.
ఆంజనేయులు, ఆర్వో, కరీంనగర్ నగరపాలిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం