మనం ఎంత భద్రం!
వచ్చేది వానాకాలం.. తుపాన్ల కారణంగా బలమైన గాలులు వీస్తాయి. వారం రోజుల కిందట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద చెట్టు కూలడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి.
న్యూస్టుడే, కరీంనగర్ కలెక్టరేట్
వచ్చేది వానాకాలం.. తుపాన్ల కారణంగా బలమైన గాలులు వీస్తాయి. వారం రోజుల కిందట సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద చెట్టు కూలడంతో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆ ఘటన మరవకముందే ఆదివారం గాలివాన బీభత్సానికి రాష్ట్ర వ్యాప్తంగా స్తంభాలు, చెట్లు, హోర్డింగ్లు కూలడంతో 13 మంది దుర్మరణం చెందారు. ఆ ఘటనలను చూసి.. ఎంతోమంది అయ్యో అని ఆవేదన వ్యక్తం చేశారు. మన కరీంనగర్ జిల్లాలోనూ కూలడానికి సిద్ధంగా చెట్లు, స్తంభాలు, బోర్డులు ఉన్నాయి. ఈ ఘటనలను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తం కాకుంటే మన వద్ద కూడా ఇలాంటివి చోటు చేసుకునే అవకాశముంది. అధికారులు మేల్కొని పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటిని తొలగిస్తే ప్రమాదాలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ విషయంపై ‘న్యూస్టుడే’ జిల్లా పంచాయతీ అధికారి ఎ.రవీందర్ను వివరణ కోరగా.. ప్రమాదకర ఇళ్లు, చెట్లు, విద్యుత్తు స్తంభాలు, హోర్డింగ్లను మూడు రోజుల్లోగా గుర్తించాలని క్షేత్రస్థాయి అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అవసరమైన చోట వాటిని తొలగించాలని సూచించామని తెలిపారు.
రహదారిపై ఒరిగిన చెట్టు
రామడుగు మండలం వెదిర అనుబంధ గ్రామం వెంకటగిరి రైల్వే గేటు సమీపంలో చింతచెట్టు రోడ్డు వైపు ఒరిగింది. రెండేళ్ల కింద చెట్టు అడుగు భాగంలో పిడుగుపడి క్రమంగా రోడ్డు వైపు ఒరుగుతోంది. నిత్యం వందలాది వాహనాలు వెళ్లే దారిలో చెట్టు ఎప్పుడు పడిపోతుందోనని భయంగా జనం వెళ్తున్నారు.
న్యూస్టుడే,రామడుగు
ఎండిన వృక్షం
శంకరపట్నం మండలం మొలంగూర్ అడ్డరోడ్డు నుంచి వీణవంక, జమ్మికుంట వెళ్లే దారిలో ఓ విత్తన కంపెనీ ముందు ఎండిన చెట్టుతో ప్రమాదం పొంచి ఉంది. నిత్యం ఈ రోడ్డుపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లారీలు నిలుపుతుంటారు.
న్యూస్టుడే, శంకరపట్నం
గాలులు వీస్తే..
మానకొండూర్ చెరువు కట్ట కింద రహదారి వెంబడి ఓ చెట్టు ఎండిపోయి కూలడానికి సిద్ధంగా ఉంది. బలమైన గాలులు వేస్తే విరిగే ప్రమాదం ఉంది. జాతీయ రహదారి కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
న్యూస్టుడే, మానకొండూర్
శిథిలావస్థలో హోర్డింగ్
చొప్పదండి శివారులోని గుమ్లాపూర్ అడ్డరోడ్డు సమీపంలో ఉన్న ఓ హోర్డింగ్ కొంతభాగం విరిగి ప్రమాదకరంగా తయారైంది. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
న్యూస్టుడే, చొప్పదండి
ఆధారం లేని పాఠశాల బోర్డు..
కరీంనగర్ రూరల్ మండలం దుర్శేడు ప్రాథమిక ఉన్నత పాఠశాల ముందు ఉన్న నామఫలకమిది. కింద స్తంభాలకు ఎలాంటి ఆధారం లేదు. ప్రహరీ ఆధారంగా బోర్డు నిలిపారు. గాలి దుమారం వస్తే.. ఎగిరి మీద పడే ప్రమాదముంది.
న్యూస్టుడే, కరీంనగర్ గ్రామీణం
ప్రమాదకరంగా..
చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ గ్రామశివారులో రాష్ట్ర రహదారికి ఆనుకుని పలు చెట్లు ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్నాయి. నెల కిందట కొన్ని చెట్లను నరికివేసినా వీటిని మాత్రం అలాగే వదిలేశారు. అవి ఎప్పుడు విరిగి రహదారిపై పడుతాయోనని వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు.
న్యూస్టుడే, చొప్పదండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం