ఆసరా ఆలస్యం.. పేదల దైన్యం
మలి వయసులో ఆర్థికంగా అండగా ఉండాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. దీంతో పింఛను లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి.
రెండు నెలలుగా తప్పని ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
పింఛను కోసం కలెక్టరేట్ వద్దకు వీల్చైర్లో వచ్చిన దివ్యాంగుడు
మలి వయసులో ఆర్థికంగా అండగా ఉండాల్సిన ‘ఆసరా’ ఆలస్యమవుతోంది. దీంతో పింఛను లబ్ధిదారులకు ఎదురుచూపులే మిగిలాయి. దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతకార్మికులు, నేతకార్మికులు తదితర వర్గాలకు ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పథకం కింద అందిస్తున్న పింఛను సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తోంది. అయితే అక్టోబరు, నవంబర్ నెలలకు సంబంధించిన పింఛను ఇప్పటివరకూ అందకపోవడంతో పేదలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారుల అంచనా ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో పింఛను సొమ్ము జమ అయ్యేందుకు మరో రెండు వారాలకు పైగా సమయం పట్టే అవకాశముంది. ఈ లెక్కన నెలాఖరు వరకు నిరీక్షణ తప్పేలా లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులు గ్రామాల్లో తరచూ తపాలా కార్యాలయాలకు, బ్యాంకు ఏటీఎంల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నారు. మరోవైపు కొత్తగా 57 ఏళ్లు నిండిన వారిని వృద్ధాప్య పింఛనుకు ఎంపిక చేయగా వారికి కూడా రెండు నెలల పింఛను సొమ్ము రావాల్సి ఉంది.
నిత్యావసరాలకు ఇబ్బందులు
నిత్యావసర సరకుల కొనుగోలుకు, వృద్ధులు క్రమం తప్పకుండా తీసుకునే ఔషధాలకు పింఛను సొమ్ము అండగా ఉంటోంది. అయితే ప్రతి నెలా ఇవ్వకపోవడంతో అవసరాలు తీరక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 1,09,976 మందికి ఆసరా పథకం కింద నెలనెలా పింఛన్లు అందిస్తున్నారు. ఇందులో కొత్తగా 25,801 మంది 57 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బోదకాలు, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధిగ్రస్థులు, గీత, బీడీకార్మికులు, ఒంటరి మహిళలకూ పించన్లు అందిస్తున్నారు. ప్రతి నెలా ఆలస్యంగానే వస్తున్నాయి. ఏ నెల పింఛను ఆ నెల రావడం లేదు. ఒక్కోసారి నెలాఖరులోనూ జమ అవుతున్నాయి. రెండు నెలలు కలిపి జిల్లాలో దాదాపు రూ.60 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది.
నిధుల్లేక ఆలస్యం: శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
రాష్ట్ర ఖజానా శాఖ నుంచి ఇంకా నిధులు జమ కాలేదు. త్వరలో పింఛను మొత్తాలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. అర్హులైనవారందరికీ పింఛను డబ్బులు జమ చేయనున్నారు.్చ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే