logo

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై హుజూరాబాద్‌ మండలం రంగాపూర్‌ ప్రధాన కూడలి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 09 Feb 2023 05:24 IST

మరొకరికి తీవ్ర గాయాలు

రాజయ్య

హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే:    హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై హుజూరాబాద్‌ మండలం రంగాపూర్‌ ప్రధాన కూడలి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం హనుమకొండ జిల్ల్లా కమలాపూర్‌ మండలం వంగపల్లికి చెందిన కొలిపాక రాజయ్య(50) రంగాపూర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో కాలినడకన రహదారి దాటుతుండగా హుజూరాబాద్‌కు చెందిన పైవర్తి కనుకయ్య ద్విచక్రవాహనంపై జమ్మికుంట నుంచి హుజూరాబాద్‌ వైపునకు వస్తూ రాజయ్యను ఢీకొట్టాడు. అతడు అక్కడికక్కడే మృతి చెందగా, కనుకయ్య తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది పైలట్‌ రమేష్‌, ఈఎంటీ బద్రీ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని హుజూరాబాద్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఏఎస్‌ఐ రాంమూర్తి, హెడ్‌కానిస్టేబుల్‌ బాల్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు రాజయ్య హన్మకొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండేవాడు. అతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గాయపడిన కనుకయ్య చరవాణి టవర్‌ సాంకేతిక నిపుణుడిగా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని