భగీరథ వచ్చినా.. అదే భారం
మిషన్ భగీరథ వచ్చినా పురపాలికలు, పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో 20-30 శాతం వీటికే చెల్లిస్తున్నారు.
పంచాయతీలు, పురపాలికల్లో పాత పథకాల కొనసాగింపు
జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.65 లక్షల విద్యుత్తు బిల్లులు
హన్మాజీపేటలోని నీటిని సరఫరా చేసే బోరుబావి
‘‘వేములవాడ మండలం హన్మాజీపేట పంచాయతీలో ఎత్తున ఉన్న 30 గృహాలకు భగీరథ నీరు అందడం లేదు. పంచాయతీలోని మూడు అశ్వసామర్థ్యం ఉన్న బోరు మోటారు ద్వారా ఈ కాలనీకి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు భగీరథ నీరు అందని సమయంలో మరో బోరును ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటికీ నెలకు రూ.9 వేల వరకు విద్యుత్తు బిల్లు చెల్లిస్తున్నారు. ఈ గ్రామం భగీరథ ప్రధాన గ్రిడ్ అగ్రహారానికి 15 కిలోమీటర్లలోపు ఉంటుంది. దీన్ని బట్టి ఇక జిల్లాలోని శివారు గ్రామాలు, కాలనీల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు’’
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: మిషన్ భగీరథ వచ్చినా పురపాలికలు, పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో 20-30 శాతం వీటికే చెల్లిస్తున్నారు. అవికూడా నాలుగు నెలలుగా రావడం లేదు. ప్రజలకు ఇంటింటా శుద్ధజలం సరఫరా చేయడానికి మిషన్ భగీరథ పథకంలో నల్లాలు అమర్చారు. వేములవాడ మండలం అగ్రహారంలో మూడు నియోజకవర్గాలకు (సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి) ప్రధాన గ్రిడ్ శుద్ధికేంద్రాన్ని నిర్మించారు. దీనికి రూ.1,085 కోట్లు కేటాయించారు. రెండు పురపాలికలు (సిరిసిల్ల, వేములవాడ)లకు ప్రత్యేకంగా అర్బన్ భగీరథలో రూ.60.76 కోట్లు కేటాయించారు. 2019లోనే ప్రధాన గ్రిడ్ పనులు పూర్తయ్యాయి. అగ్రహారంలోని 120 ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్ల) సామర్థ్యం ఉన్నా.. ప్రస్తుతం రోజుకు గరిష్ఠంగా 90 ఎంఎల్డీలు మాత్రమే సరఫరా జరుగుతోంది. జనాభా పెరిగినకొద్ది నీటి విడుదల సామర్థ్యం పెంచుకునేలా ముందే ప్రణాళిక చేశారు. భగీరథ ఇంట్రావిలేజ్లో మూడేళ్లుగా దశలవారీగా గ్రామాలు, పట్టణాలకు నీటిని సరఫరా జరుగుతోంది. అయితే నిరంతరాయ సరఫరాలో తలెత్తుతున్న లోపాల కారణంగా పంచాయతీలు, పురపాలికలు యథావిధిగా స్థానిక బోరుబావులపైనే ఆధారపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నీటి పథకాల విద్యుత్తు బిల్లు నెలకు రూ.60 లక్షల సెస్కు చెల్లించాలి. వీటిలో ప్రతినెలా కొద్దిమొత్తంలో చెల్లించినప్పటికీ సెస్కు రూ.175 కోట్ల బకాయి ఉంది.
రెండింటికీ ఖర్చు
జిల్లాలో భగీరథ పనులు శతశాతం పూర్తయినట్లు ఉన్నతాధికారుల సమీక్షలో.. జిల్లా పరిషత్తు.. మండలాలవారీగా జరుగుతున్న సమావేశాల్లోనూ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం ‘పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నల్లాలు బిగించలేదు. నిరంతరాయంగా సరఫరా కావడంలేదంటు’న్నారు. అందుకోసమే స్థానిక పథకాలను వాడుతున్నామని చెబుతున్నారు. వాస్తవానికి భగీరథ పనులు పూర్తయిన గ్రామాల్లో బోరుబావులకు విద్యుత్తు కనెక్షన్లను క్రమంగా తొలగించాలి. అత్యవసరానికి ఒకట్రెండు మాత్రమే ఉంచాలి కానీ.. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఎప్పటిలాగే నడుస్తున్నాయి. వీటిని తొలగించేందుకు అధికారులు.. ప్రజాప్రతినిధులు సాహసించడం లేదు. భగీరథ నీరు స్వచ్ఛమైనదని ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ విఫలమవుతున్నారు. ఇప్పటికీ తాగడానికి స్థానికంగా ఉన్న నీటి కేంద్రంలోని నీటిని కొనుగోలు చేస్తూ.. భగీరథ శుద్ధజలాన్ని ఇతర అవసరాలకు వాడుకోవడం గమనార్హం. ఫలితంగా పంచాయతీల్లోని బోరుబావులకు ఇటు భగీరథ ఫథకం నిర్వహణకు ప్రభుత్వానికి ఖర్చు తప్పడం లేదు.
‘‘వేములవాడలో అర్బన్ భగీరథ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బాలనగర్, సంతోష్నగర్ ప్రాంతాలకు బోరుబావుల ద్వారా సరఫరా జరుగుతోంది. ఇటు విలీన గ్రామమైన తిప్పాపూర్లోనూ బోరుబావుల నుంచే సరఫరా. వీటికి ప్రతినెలా పురపాలక సంఘం రూ.6 లక్షల విద్యుత్తు బిల్లులు చెల్లిస్తోంది. వాస్తవానికి అర్బన్ భగీరథ పనులు గతేడాది మేలోనే పూర్తికావాల్సి ఉంది.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి