భగీరథ వచ్చినా.. అదే భారం
మిషన్ భగీరథ వచ్చినా పురపాలికలు, పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో 20-30 శాతం వీటికే చెల్లిస్తున్నారు.
పంచాయతీలు, పురపాలికల్లో పాత పథకాల కొనసాగింపు
జిల్లా వ్యాప్తంగా నెలకు రూ.65 లక్షల విద్యుత్తు బిల్లులు
హన్మాజీపేటలోని నీటిని సరఫరా చేసే బోరుబావి
‘‘వేములవాడ మండలం హన్మాజీపేట పంచాయతీలో ఎత్తున ఉన్న 30 గృహాలకు భగీరథ నీరు అందడం లేదు. పంచాయతీలోని మూడు అశ్వసామర్థ్యం ఉన్న బోరు మోటారు ద్వారా ఈ కాలనీకి నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో పాటు భగీరథ నీరు అందని సమయంలో మరో బోరును ఉపయోగిస్తున్నారు. ఈ రెండింటికీ నెలకు రూ.9 వేల వరకు విద్యుత్తు బిల్లు చెల్లిస్తున్నారు. ఈ గ్రామం భగీరథ ప్రధాన గ్రిడ్ అగ్రహారానికి 15 కిలోమీటర్లలోపు ఉంటుంది. దీన్ని బట్టి ఇక జిల్లాలోని శివారు గ్రామాలు, కాలనీల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు’’
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: మిషన్ భగీరథ వచ్చినా పురపాలికలు, పంచాయతీలకు విద్యుత్తు బిల్లుల భారం తప్పడం లేదు. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధుల్లో 20-30 శాతం వీటికే చెల్లిస్తున్నారు. అవికూడా నాలుగు నెలలుగా రావడం లేదు. ప్రజలకు ఇంటింటా శుద్ధజలం సరఫరా చేయడానికి మిషన్ భగీరథ పథకంలో నల్లాలు అమర్చారు. వేములవాడ మండలం అగ్రహారంలో మూడు నియోజకవర్గాలకు (సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి) ప్రధాన గ్రిడ్ శుద్ధికేంద్రాన్ని నిర్మించారు. దీనికి రూ.1,085 కోట్లు కేటాయించారు. రెండు పురపాలికలు (సిరిసిల్ల, వేములవాడ)లకు ప్రత్యేకంగా అర్బన్ భగీరథలో రూ.60.76 కోట్లు కేటాయించారు. 2019లోనే ప్రధాన గ్రిడ్ పనులు పూర్తయ్యాయి. అగ్రహారంలోని 120 ఎంఎల్డీ (రోజుకు మిలియన్ లీటర్ల) సామర్థ్యం ఉన్నా.. ప్రస్తుతం రోజుకు గరిష్ఠంగా 90 ఎంఎల్డీలు మాత్రమే సరఫరా జరుగుతోంది. జనాభా పెరిగినకొద్ది నీటి విడుదల సామర్థ్యం పెంచుకునేలా ముందే ప్రణాళిక చేశారు. భగీరథ ఇంట్రావిలేజ్లో మూడేళ్లుగా దశలవారీగా గ్రామాలు, పట్టణాలకు నీటిని సరఫరా జరుగుతోంది. అయితే నిరంతరాయ సరఫరాలో తలెత్తుతున్న లోపాల కారణంగా పంచాయతీలు, పురపాలికలు యథావిధిగా స్థానిక బోరుబావులపైనే ఆధారపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నీటి పథకాల విద్యుత్తు బిల్లు నెలకు రూ.60 లక్షల సెస్కు చెల్లించాలి. వీటిలో ప్రతినెలా కొద్దిమొత్తంలో చెల్లించినప్పటికీ సెస్కు రూ.175 కోట్ల బకాయి ఉంది.
రెండింటికీ ఖర్చు
జిల్లాలో భగీరథ పనులు శతశాతం పూర్తయినట్లు ఉన్నతాధికారుల సమీక్షలో.. జిల్లా పరిషత్తు.. మండలాలవారీగా జరుగుతున్న సమావేశాల్లోనూ చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు మాత్రం ‘పనులు అసంపూర్తిగా ఉన్నాయి. నల్లాలు బిగించలేదు. నిరంతరాయంగా సరఫరా కావడంలేదంటు’న్నారు. అందుకోసమే స్థానిక పథకాలను వాడుతున్నామని చెబుతున్నారు. వాస్తవానికి భగీరథ పనులు పూర్తయిన గ్రామాల్లో బోరుబావులకు విద్యుత్తు కనెక్షన్లను క్రమంగా తొలగించాలి. అత్యవసరానికి ఒకట్రెండు మాత్రమే ఉంచాలి కానీ.. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఎప్పటిలాగే నడుస్తున్నాయి. వీటిని తొలగించేందుకు అధికారులు.. ప్రజాప్రతినిధులు సాహసించడం లేదు. భగీరథ నీరు స్వచ్ఛమైనదని ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ విఫలమవుతున్నారు. ఇప్పటికీ తాగడానికి స్థానికంగా ఉన్న నీటి కేంద్రంలోని నీటిని కొనుగోలు చేస్తూ.. భగీరథ శుద్ధజలాన్ని ఇతర అవసరాలకు వాడుకోవడం గమనార్హం. ఫలితంగా పంచాయతీల్లోని బోరుబావులకు ఇటు భగీరథ ఫథకం నిర్వహణకు ప్రభుత్వానికి ఖర్చు తప్పడం లేదు.
‘‘వేములవాడలో అర్బన్ భగీరథ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. బాలనగర్, సంతోష్నగర్ ప్రాంతాలకు బోరుబావుల ద్వారా సరఫరా జరుగుతోంది. ఇటు విలీన గ్రామమైన తిప్పాపూర్లోనూ బోరుబావుల నుంచే సరఫరా. వీటికి ప్రతినెలా పురపాలక సంఘం రూ.6 లక్షల విద్యుత్తు బిల్లులు చెల్లిస్తోంది. వాస్తవానికి అర్బన్ భగీరథ పనులు గతేడాది మేలోనే పూర్తికావాల్సి ఉంది.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా