చిరుధాన్యాల ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం
పుష్కలంగా పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న చిరుధాన్యాలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
చిరుధాన్యాల ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న మంత్రి కమలాకర్
కరీంనగర్ మంకమ్మతోట, న్యూస్టుడే: పుష్కలంగా పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాలున్న చిరుధాన్యాలను ప్రతి రోజు ఆహారంలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోషణ పఖ్వాడ పక్షోత్సవాల్లో భాగంగా మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఆవరణలో చిరుధాన్యాల మేళా నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. మన పూర్వీకులు తృణధాన్యాలను ఎక్కువగా తీసుకోవడం మూలంగానే రక్తపోటు, మధుమేహంలాంటి దీర్ఘకాలిక వ్యాధులు లేకుండా ఎక్కువ రోజులు జీవించారన్నారు. ఈ సందర్భంగా పలు స్టాళ్లను పరిశీలించిన ఆయన, తృణ ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఉట్నూర్ ఐటీడీఏ బృందం, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, అంగన్వాడీ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. జడ్పీ సీఈవో ప్రియాంక, డీడబ్ల్యూవో సబిత తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి
కరీంనగర్ కలెక్టరేట్ : పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో అభివృద్ధి కనిపిస్తోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాలకు చెందిన 11 మండలాల్లోని 27 గ్రామ పంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి పురస్కారాలను ప్రదానం చేశారు. కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, జడ్పీ ఛైర్పర్సన్ విజయ, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సుడా ఛైర్మన్ జీవీ.రామకృష్ణారావు, అదనపు పాలనాధికార్లు గరిమ అగ్రవాల్, శ్యాంప్రసాద్లాల్, శిక్షణ కలెక్టర్ లెనిన్ వత్సల్, డీపీవో వీరబుచ్చయ్య, డీఆర్డీవో ఎల్.శ్రీలత, జిల్లా వైద్యాధికారి జువేరియా, జిల్లా సంక్షేమాధికారి సబిత పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్