logo

Sridhar Babu: పీవీ రికార్డును అధిగమించిన శ్రీధర్‌బాబు

మంథని నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ప్రధానమంత్రి పీవీ  నరసింహారావు రికార్డును మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌బాబు అధిగమించారు.

Updated : 04 Dec 2023 08:05 IST

న్యూస్‌టుడే, మంథని: మంథని నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ ప్రధానమంత్రి పీవీ  నరసింహారావు రికార్డును మంథని కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌బాబు(Sridhar Babu) అధిగమించారు. మంథని నుంచి 1957, 1962, 1967, 1972 ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు పీవీ నర్సింహారావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇదే మంథని నియోజకవర్గం నుంచి 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది పీవీ రికార్డును బద్దలు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌జిల్లాలో శ్రీధర్‌బాబు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై(telangana election results) చరిత్ర సృష్టించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని