కొత్త వారు రాక.. ఉన్నవాళ్లు చదవలేక
సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించి మూడేళ్లవుతుంది. దీనిలో టెక్స్టైల్ టెక్నాలజీలో రెండేళ్లుగా ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. తొలి ఏడాది ఎంసెట్, ఈసెట్ ద్వారా వచ్చిన 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు రెండేళ్లుగా అగ్రహారం పాలిటెక్నిక్ డిప్లొమా, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు.
టెక్స్టైల్ కోర్సులో సిలబస్ లేక విద్యార్థుల అవస్థలు
సిరిసిల్ల జేఎన్టీయూలో ఇదీ పరిస్థితి
జేఎన్టీయూ కళాశాల
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల : సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించి మూడేళ్లవుతుంది. దీనిలో టెక్స్టైల్ టెక్నాలజీలో రెండేళ్లుగా ఒక్కరూ ప్రవేశాలు పొందలేదు. తొలి ఏడాది ఎంసెట్, ఈసెట్ ద్వారా వచ్చిన 14 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఈ కోర్సుకు రెండేళ్లుగా అగ్రహారం పాలిటెక్నిక్ డిప్లొమా, ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులతో తరగతులు నిర్వహిస్తున్నారు. జేఎన్టీయూలోనే కొత్త కోర్సు కావడం, మూడేళ్లుగా కనీసం సిలబస్ను రూపొందించకపోవడం చూస్తుంటే బోధన ఏ తీరున సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ కోర్సుల ప్రయోగాల కోసం కొండగట్టు జేఎన్టీయూకు పంపుతున్నారు. 2021లో ప్రారంభమైన కళాశాల భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఇటీవల తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో స్థలం కేటాయించింది. ప్రస్తుతం అగ్రహారం డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని జేఎన్టీయూ కళాశాలకు వినియోగిస్తున్నారు.
ఏమిటీ సమస్య?
ప్రపంచ వ్యాప్తంగా రొబోటిక్స్, ఐవోటీ, బ్లాక్చైన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఏఐ తదితర ఎమర్జింగ్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఈక్రమంలో కోర్ బ్రాంచిలైన మెకానికల్, సివిల్ తదితర బ్రాంచిల్లో ప్రవేశాలు తగ్గాయి. ఈ బ్రాంచిలకు క్రమంగా డిమాండ్ తగ్గుతోంది. టెక్స్టైల్ విభాగానిది కూడా అదే పరిస్థితి. జేఎన్టీయూలో మూడేళ్ల క్రితం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ కోర్సుపై శీతకన్ను వేశారు. ప్రవేశాలు పొందే సమయంలో కళాశాల అధ్యాపకులు ఉస్మానియాలోని టెక్స్టైల్ ఇంజినీరింగ్ విభాగంతో ఎంవోయూ చేసుకుని బోధన కొనసాగిస్తామని విద్యార్థులకు చెప్పారు. ఇప్పటికీ మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా ఆ ఊసేలేదు. ఇటు జేఎన్టీయూ కూడా కోర్సుకు సిలబస్ను రూపొందించలేదు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు.
ఉస్మానియా ఇంజినీరింగ్ కళాశాలలోని 2018 సంవత్సరం టెక్స్టైల్ కోర్సు సిలబస్ను ఒప్పంద అధ్యాపకులతో రెండో ఏడాది బోధించారు. కళాశాలలో ఆరు కోర్సులకు గాను రెగ్యులర్ అధ్యాపకులు ముగ్గురు, ఒప్పంద ప్రాతిపదికన నలుగురు, పీరియడ్ లెక్కన బోధించేవారు 26 మంది ఉన్నారు. టెక్స్టైల్ మినహా మిగతా అయిదు కోర్సులు, మూడు సంవత్సరాలకు కలిపి 787 మంది విద్యార్థులున్నారు. క్యాంపస్ సెలక్షన్స్ కోసం పలు కంపెనీల బృందాలు ఈ ఏడాది కళాశాలలను సందర్శించనున్నాయి. ఆయా కంపెనీలు విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుంటాయి. అన్ని కోర్సుల విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంతో కీలకం. ఇక టెక్స్టైల్ కోర్సులోని విద్యార్థులు మూడో సంవత్సరంలోకి వచ్చినా ఇప్పటికీ వీరికి కనీసం ల్యాబ్లు లేవు. స్టడీ టూర్ల ఊసేలేదు. దీనిపై విద్యార్థులు రెండు నెలల క్రితం జేఎన్టీయూ ఉప కులపతికి ఆన్లైన్లో వినతి పత్రం సమర్పించారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.
ఇలా చేస్తే మేలు..
సంప్రదాయ కోర్సులు కనుమరుగవుతున్న వేళ విద్యార్థులకు మంచి ఉపాధి కల్పించే టెక్స్టైల్ కోర్సులను ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఆధునికతకు తగ్గట్టుగా దుస్తుల తయారీలో యువతను ఆకట్టుకోవడంతో పాటు ఈ రంగంలో దీర్ఘకాలం ఆదరణ పొందవచ్చు. దానివల్ల జిల్లాలోని వస్త్ర పరిశ్రమ మరింత విస్తరించడంతోపాటు వృద్ధి చెందుతుంది. ఇవన్నీ జరగాలంటే కళాశాల స్థాయిలోనే విద్యార్థులకు ఈ రంగంపై పూర్తి పట్టు తీసుకురావాలి. అప్పుడే యువత వస్త్ర పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. పాలిటెక్నిక్ కళాశాలలోని డిప్లొమా, జేఎన్టీయూలోని ఇంజినీరింగ్ కోర్సులతో ఈ రంగంలోని అవకాశాల గురించి విద్యార్థులకు తెలియజేయాలి. దానికి అవసరమైన నూతన పాఠ్య ప్రణాళిక, బోధన సిబ్బంది, మౌలిక సదుపాయాలను కల్పించేలా చొరవ చూపాలి. అవసరమైతే టెక్స్టైల్ పార్కు, అపరెల్ పార్కులోని పరిశ్రమలతో సమన్వయం చేసుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తులో సిరిసిల్లలో వస్త్రోత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులకు అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇక్కడ జేఎన్టీయూలో టెక్స్టైల్ కోర్సు ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది.
ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం
కోర్సుల వారీగా విద్యార్థులకు బోధనలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఒప్పంద ప్రాతిపదికన అన్ని కోర్సులకు పూర్తిస్థాయి అధ్యాపకులు ఉన్నారు. కళాశాల భవనం, ల్యాబ్ల నిర్మాణంపై జేఎన్టీయూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
శ్రీనివాస్, ప్రిన్సిపల్, జేఎన్టీయూ, సిరిసిల్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!