ఎన్నికల్లో మద్యం కిక్కు!
శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. మద్యం ప్రియులకు కిక్కు ఇవ్వగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు సాగాయి.
మూడు నెలల్లో రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు
న్యూస్టుడే, ఎల్లారెడ్డిపేట : శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. మద్యం ప్రియులకు కిక్కు ఇవ్వగా ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు రూ. వంద కోట్లకు పైగా విక్రయాలు సాగాయి. గడిచిన రెండేళ్లలో వచ్చిన మొత్తం ఆదాయంలో సింహభాగం ఈ మూడు నెలల్లోనే వచ్చింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం గొలుసు దుకాణాలను మూసివేసినప్పటికీ మద్యానికి గిరాకీ మరింత పెరగడం కొసమెరుపు. జిల్లాలో సెప్టెంబరు నుంచి నవంబరు 30 వరకు రూ. 100.82 కోట్ల విలువైన మద్యాన్ని అమ్మడం ఎన్నికల పండగలో మద్యం ప్రియులకు ఇచ్చిన కిక్కు ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది.
కట్టడి చేసినా...
జిల్లాలో 48 మద్యం దుకాణాలు, 8 బార్లను నిర్వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే మద్యం అమ్మకాలపై ఎక్సైజ్శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా గ్రామాల్లోని బెల్టుషాపులను మూసివేయడంతోపాటు నిర్వాహకులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. అంతేకాకుండా మద్యం అక్రమంగా తరలించకుండా వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. అక్రమంగా మద్యం సీసాలను తరలించేవారిపై కూడా కేసులు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దుకాణాల్లో మాత్రమే నిబంధనల మేరకు మద్యం కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఒక వ్యక్తి ఆరు మద్యం బాటిళ్లు (లిక్కర్), 12 బీర్లను మాత్రమే వెంట తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఎన్నికల్లో మద్యం రవాణాను అధికారులు కట్టడి చేసినప్పటికీ అమ్మకాలు భారీగా పెరిగాయి. జిల్లాలో 2021 డిసెంబరు 1 నుంచి 2023 నవంబరు 30 వరకు 8,99,130 మద్యం పెట్టెలు, 19,10,668 బీరు పెట్టెలను విక్రయించగా రూ.1,002.53 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో ఈ ఏడాది సెప్టెంబరు నుంచి నవంబరు వరకు మూడు నెలల వ్యవధిలోనే రూ.100.82 కోట్ల అమ్మకాలు జరగడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం