ధాన్యం సేకరణపై తుపాను ప్రభావం
తుపాను ప్రభావం జిల్లాలో ధాన్యం సేకరణపై పడింది. గత రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోతాయని అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పారు.
తూకాలు నిలిచి ఆందోళనలో అన్నదాతలు
వర్షం భయంతో ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు
న్యూస్టుడే, వేములవాడ : తుపాను ప్రభావం జిల్లాలో ధాన్యం సేకరణపై పడింది. గత రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. విక్రయానికి కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోతాయని అన్నదాతలు టార్పాలిన్ కవర్లు కప్పారు. దీంతో ధాన్యంలో తేమ శాతం మరింత పెరిగి తూకాలు కాక రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి రావడంతో కర్షకులు ఆందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో నెలన్నర రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ చేపడుతున్నారు. కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో తుపాను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చినుకులు పడటంతో చాలా కేంద్రాల్లో ధాన్యం కుప్పలపై రైతులు టార్పాలిన్ కవర్లు కప్పి తూకాల కోసం ఎదురుచూస్తున్నారు. నిబంధనల ప్రకారం తేమ శాతం వస్తే గానీ ధాన్యం తూకాలు అయ్యే పరిస్థితి లేదు. జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యంలో 253 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ 248 కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించారు. క్వింటాల్కు ‘ఏ’ గ్రేడ్కు రూ.2,203, ‘బి’ గ్రేడ్కు రూ.2,183ల మద్దతు ధర చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు 1,70,240 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. చాలా కేంద్రాల్లో కొనుగోళ్లు చివరి దశలో ఉన్నాయి. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావడంతో 98 కేంద్రాలను అధికారులు మూసివేశారు. ధాన్యం విక్రయించిన రైతుల్లో ఇప్పటి వరకు 20,774 మంది రైతులకు రూ.268.16 కోట్ల మేర రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు.
అకాల వర్షంతో...
వారం రోజులుగా ఆకాశంలో మబ్బులు పట్టడంతోపాటు రెండు రోజులుగా చినుకులు పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొద్ది రోజులు గడిస్తే తూకం అవుతుందని ఆశతో ఉన్న రైతుల్లో తుపాను తీవ్ర నిరాశకు గురిచేసింది. అకాల వర్షంతో ధాన్యం కుప్పల్లో తేమ శాతం పెరిగిపోయి కాంటాలు కావడంలో జాప్యం నెలకొంది. కొందరు రైతులు వ్యాపారులకు ధాన్యాన్ని తక్కువ ధరకు విక్రయించుకుంటున్నారు. చాలా కేంద్రాల్లో అయిదు నుంచి పది శాతం తూకాలు కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ధాన్యం కుప్పలు పూర్తయితే కేంద్రాలను మూసివేయనున్నారు. తుపాను ప్రభావం లేకుంటే ధాన్యం తూకాలు సజావుగా సాగి చాలా వరకు కొనుగోలు కేంద్రాలను మూసివేసేవారని నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్రాల్లో తూకాలు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అవసరం మేరకు లారీలను సిద్ధంగా ఉంచి తూకాలు అయిన బస్తాలను ఎప్పటికప్పుడు కేటాయించిన రైస్ మిల్లులకు తరలించారు. వర్షం ముగిసిన వెంటనే తూకాలు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల