logo

ఎన్నికల సిబ్బందికి అభినందన

ఎలాంటి వివాదం తలెత్తకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు. ఎన్టీపీసీలో గురువారం సాయంత్రం రామగుండం ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

Published : 08 Dec 2023 04:44 IST

ఎన్నికల సిబ్బందితో కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌, అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

గోదావరిఖని, న్యూస్‌టుడే: ఎలాంటి వివాదం తలెత్తకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారని జిల్లా కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ అన్నారు. ఎన్టీపీసీలో గురువారం సాయంత్రం రామగుండం ఎన్నికల అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వివాదాలకు తావులేకుండా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించిన అధికారులు, సిబ్బందిని ప్రశంసించారు. అదనపు కలెక్టర్‌, ఎన్నికల అధికారి అరుణశ్రీతో పాటు సహాయ ఎన్నికల అధికారులు కుమారస్వామి, జ్యోతి, నోడల్‌ అధికారి నాగేశ్వర్‌, మీడియా బాధ్యురాలు రజనితో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని