యువ కార్మికులే నిర్ణయాత్మకం
సింగరేణి ఎన్నికల్లో ఈసారి యువ కార్మికులే కీలకం కానున్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఓట్లు ప్రాధాన్యత చాటుకోనున్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,832 మంది కార్మికులున్నారు. ఇందులో 16 వేల మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఉన్నారు.
న్యూస్టుడే, గోదావరిఖని : సింగరేణి ఎన్నికల్లో ఈసారి యువ కార్మికులే కీలకం కానున్నారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల సంఖ్య తగ్గిపోవడంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఓట్లు ప్రాధాన్యత చాటుకోనున్నాయి. సింగరేణి ఎన్నికల్లో మొత్తం 39,832 మంది కార్మికులున్నారు. ఇందులో 16 వేల మంది వరకు కొత్తగా ఉద్యోగాల్లో చేరిన యువత ఉన్నారు. అంటే 45 శాతం మంది యువ కార్మికులే ఉండటంతో వారి ఓట్లు పొందేందుకు కార్మిక సంఘాలు కసరత్తు చేస్తున్నాయి. గతంలో సీనియర్ కార్మికులు ఎక్కువగా ఉండటంతో సంఘాల పనితీరు.. యూనియన్ విధానాలను చూసి ఓటు వేసే వారు. ఏ సంఘాన్ని గెలిపించుకోవాలో నిర్ణయించే వారు. ఈసారి కొత్త కార్మికుల సంఖ్య పెరిగింది. ఐదేళ్లలో వారసత్వ ఉద్యోగాలతో పాటు కొత్త నియామకాలు చేపట్టడంతో సింగరేణిలో 16 వేల మంది కొత్తగా చేరారు. వారికి ఈ ఎన్నికలు మొదటిసారి. గతంలో కార్మిక సంఘాలకు ఓటు వేసిన అనుభవం లేదు. ఆరేళ్ల తర్వాత వస్తున్న ఎన్నికల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు ఎటు మొగ్గు చూపుతారో వారికే విజయవకాశాలుంటాయి. ఒక్కో డివిజన్లో 500 నుంచి 1000 వరకు కొత్త ఉద్యోగులు పనిచేస్తున్నారు.
16 వేల మంది వారే...
ఈ ఎన్నికల్లో కొత్తగా 16 వేల మంది యువ ఉద్యోగులున్నారు. వారసత్వం ద్వారా 15 వేల వరకు ఉద్యోగాల్లో చేరారు. వీరితో పాటు క్లరికల్, ఐటీఐ, డిప్లొమా ద్వారా కొత్త ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఫోర్మెన్, జేఎంఓ, వెల్డర్లను ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. ఉన్న తక్కువ మంది ఉద్యోగుల్లో కొత్తగా వచ్చిన వారి సంఖ్య సగం వరకు ఉండటంతో వారే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నారు. మొత్తం 11 డివిజన్లతో పాటు కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు ఓటు వేస్తారు. డివిజన్ స్థాయి ప్రాతినిథ్య సంఘంగా కూడా వారి ఓటుపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో అయితే ప్రతి కార్మికుడు ఏదో ఒక సంఘానికి సభ్యత్వం చేసి ఉండేవారు. కొత్తగా వచ్చిన ఉద్యోగులకు యూనియన్ నాయకత్వంతో సంబంధాలు అంతంత మాత్రమే. దీంతో పక్కాగా ఏ సంఘానికీ ఓట్లు పడతాయన్న నమ్మకం లేదు. ఎన్నికల సమయంలో యువ కార్మికులు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో ఆ సంఘానికి గెలిచే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
సమస్యల పరిష్కారానికి హామీలు
కార్మిక సంఘాలు కూడా నిర్ణయాత్మక శక్తి కావడంతో యువ కార్మికులను తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కొత్తగా చేరిన వారికున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు హామీలు ఇస్తున్నారు. యువ కార్మికులతో సమావేశాలు నిర్వహించి తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. దీంతో పాటు వారసత్వంగా ఉద్యోగాల్లో చేరిన యువ ఉద్యోగుల తండ్రులు ఎవరన్నది ఆరా తీస్తూ వారి ద్వారా తమకు ఓటు వేసే విధంగా పాత తరం కార్మికులను రంగంలోకి దింపుతున్నారు. గతంలో సీనియర్ కార్మికుడు పనిచేసే సమయంలో ఏ సంఘానికి అనుకూలంగా ఉన్నాడో అతని వారసుడిని కూడా అదే సంఘం నాయకులు తమవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దాని కోసం సీనియర్ కార్మికులను సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సాగుకు బాసట.. స్వావలంబన బాట
[ 26-07-2024]
సాగుకు ప్రాధాన్యం ఇస్తూ.. సంక్షేమంపై దృష్టి పెడుతూ సాగిన రాష్ట్ర పద్దులో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు మాత్రం లేవు.. -
పాఠశాలల్లో చరవాణుల వినియోగానికి తెరపడేనా..!
[ 26-07-2024]
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు పనివేళల్లో చరవాణులు వాడుతూ బోధన చేయడం లేదని పలువురు జిల్లా ఉన్నతాధికారులు వారి సందర్శన సమయంలో గుర్తించారు. -
ఊతమిస్తే కదా.. పతకాల ఊసు
[ 26-07-2024]
రెండు వందలకుపైగా దేశాలు 11వేల మంది క్రీడాకారులు పాల్గొంటున్న అతిపెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ శుక్రవారం ప్రారంభం కాబోతోంది. ఇందులో మన దేశ క్రీడాకారులు ఎన్ని పతకాలు సాధిస్తారో త్వరలోనే తేలనుంది. -
వంతు వచ్చేవరకు..ఉగ్గబట్టుకోవాల్సిందే..!
[ 26-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గత ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టగా ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతోంది. నిధుల కొరతతో చాలా పాఠశాలల్లో అభివృద్ధి పనులు నిలిచి పోయాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 26-07-2024]
చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కొడుకు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
[ 26-07-2024]
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
ముసుగేసిన వ్యాపారాలు
[ 26-07-2024]
ఆషాఢానికి తోడు నాలుగు రోజులుగా పడుతున్న వర్షం కారణంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. -
జనన ధ్రువపత్రాలకు అగచాట్లు
[ 26-07-2024]
పురపాలక కార్యాలయంలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ నెల రోజులుగా నిలిచిపోవడంతో దరఖాస్తులు పేరుకుపోయాయి. -
ఎంపిక సరే.. ప్రోత్సాహకమేదీ?
[ 26-07-2024]
నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నిధులతోపాటు నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్స్(ఎన్క్వాస్) ద్వారా ఎంపిక చేసిన ఆసుపత్రులకు కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి