ఇద్దరికి అమాత్యయోగం
అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సీనియర్ నేతలకే అవకాశం
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
పొన్నం ప్రభాకర్
ఈనాడు, కరీంనగర్, పెద్దపల్లి : అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో అనుభవం దృష్ట్యా మొదటి విడతలోనే మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీధర్బాబు ఇప్పటికే అయిదుసార్లు మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు మంత్రిగా పనిచేశారు. పొన్నం ప్రభాకర్కు గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండగా తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీధర్బాబు 2009లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరవాత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు అందించారు. రోశయ్య కేబినెట్లోనూ కొనసాగిన ఆయనకు కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా శాసనసభ వ్యవహారాలు, న్యాయమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
కార్యకర్తల సంబరాలు
ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో హుస్నాబాద్ కలుపుకొని 13 నియోజకవర్గాలుండగా ఇందులో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మరో అయిదుచోట్ల భారాస అభ్యర్థులు గెలుపొందారు. పాత కరీంనగర్ జిల్లాలో శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతోపాటు మరొకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం సాగినప్పటికీ ఇద్దరికే అమాత్య యోగం దక్కింది. మున్ముందు విస్తరణలో మరొకరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొన్నం నివాసం కరీంనగర్లో ఉండటంతో ఆయన ఇక్కడికి తరచూ రాకపోకల్ని సాగించే అవకాశం ఉండగా.. మంత్రి శ్రీధర్బాబు గతంలో మాదిరిగానే ఈసారి కూడా కరీంనగర్లోనే నివాసం ఉండే అవకాశమున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గతంలో మన జిల్లా మంత్రులు వీరు...
- ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 21 మంది మంత్రి పదవుల్ని అందుకున్నారు. ఈసారి కొత్తగా పొన్నం ప్రభాకర్ ఈ జాబితాలో చేరడంతో మొత్తంగా 22 మందికి అమాత్య యోగం లభించింది. వీరేకాకుండా గతంలో జి.నారాయణరావు, దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్లుగా పనిచేశారు.
- పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన జి.వెంకటస్వామి కార్మిక, పౌరసరఫరాల శాఖా మంత్రిగా పని చేశారు.
1. పీవీ నరసింహారావు : న్యాయ, ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, విద్యాశాఖ
2. కెవి. నారాయణరెడ్డి : ప్రణాళిక, న్యాయశాఖ
3. జె.చొక్కారావు : రవాణా, భూగర్భజలాలు, వ్యవసాయం, పరిశ్రమలు, పౌరసరఫరాలు
4. వర్దినేని వెంకటేశ్వర్రావు : భూగర్భజలాలు, లఘు పరిశ్రమలు, కార్మిక, న్యాయ, రెవెన్యూశాఖలు
5. టి. జీవన్రెడ్డి : ఎక్సైజ్ ఆబ్కారీ, పంచాయత్రాజ్ శాఖ
6. మాతంగి నర్సయ్య : షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ
7. రాజేశంగౌడ్ : న్యాయశాఖ
8. పాటిరాజం : నీటిపారుదల, ఉన్నత విద్యాశాఖ
9. సి.ఆనందరావు : న్యాయశాఖ
10. ఎన్.రాంకిషన్రావు : అటవీశాఖ
11. ఎం. దామోదర్రెడ్డి : మైనింగ్శాఖ, సాంకేతిక విద్య
12. ఎల్.రమణ : చేనేత , జౌళి శాఖ
13. సుద్దాల దేవయ్య : సహకార శాఖ
14. ఇనుగాల పెద్దిరెడ్డి : కార్మిక, ఉపాధి, పర్యాటకం, చక్కెరశాఖలు
15. ఎం. సత్యనారాయణరావు : దేవాదాయ, క్రీడలు, సినిమాటోగ్రఫీ
16. కెప్టెన్ లక్ష్మీకాంతరావు : బీసీ సంక్షేమశాఖ
17. దుద్దిళ్ల శ్రీధర్బాబు : ఉన్నత విద్య, న్యాయ, ఎన్నారై వ్యవహారాలు, పౌరసరఫరాలు వినయోగదారుల వ్యవహారాలు, శాసనసభ వ్యవహారాలు శాఖలు
18. ఈటల రాజేందర్ : ఆర్థిక, ప్రణాళిక, పౌరసరఫరాలు, తూనికలు, కొలతలు, వినియోగదారుల వ్యవహారాలు, వైద్యఆరోగ్యశాఖలు
19. కె.తారకరామారావు : పురపాలిక, ఐటీ, పరిశ్రమల శాఖలు
20. కొప్పుల ఈశ్వర్ : ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలు
21. గంగుల కమలాకర్ : బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖలు
దుద్దిళ్ల శ్రీధర్బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయ్యో రైతన్నా..
[ 08-05-2024]
జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి పలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. శ్రమ ఫలితం చేతికందే ముందు ధాన్యం తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
వ్యూహాలకు పదును!
[ 08-05-2024]
లోక్సభ పోరు చివరి అంకానికి చేరుతోంది. ఓటరు తీర్పు వెల్లడించే సమయం ముంచుకొస్తుండటంతో అభ్యర్థులు ప్రచార వేగం పెంచుతున్నారు. ‘సమయం లేదు మిత్రమా’..అంటూ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. -
ఇందూరు.. హోరాహోరీ పోరు
[ 08-05-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో హోరాహోరీ పోరు జరుగుతోంది. మొత్తం 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల అభ్యర్థుల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. -
‘చివరి ఎన్నిక.. ఆశీర్వదించండి’
[ 08-05-2024]
‘వయసు మీరింది. మళ్లీ ఓట్లు చూస్తానో.. చూడనో.. ఎన్నికల్లో పోటీకి ఇదే చివరి అవకాశం. ఆపదలో ఉన్నా ఓటుతో ఆశీర్వదించి ఎంపీగా గెలిపించండి’ అని నిజామాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ప్రజలను కోరారు. -
హుషారుగా వచ్చి.. ఉసురుమంటూ!
[ 08-05-2024]
కరీంనగర్లో మంగళవారం నిర్వహించాల్సిన సభ గాలివాన బీభత్సంతో రద్దు అయింది. సభాస్థలి వద్ద పరిస్థితి చిన్నాభిన్నమైంది. గాలులకు సభావేదిక వద్ద వేసిన టెంట్లు కుప్పకూలాయి. -
‘రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విమానాశ్రయం ఆలస్యం’
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే జక్రాన్పల్లిలో విమానాశ్రయం ఏర్పాటు ఆలస్యం అయిందని, ప్రతిపాదిత భూమిని అప్పగిస్తే ఏడాదిలో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయిస్తానని భాజపా ఎంపీ అభ్యర్థి అర్వింద్ పేర్కొన్నారు. -
పట్టణవాసులు కదలాలి
[ 08-05-2024]
పల్లెలతో పోలిస్తే అక్షరాస్యత శాతం అధికంగా ఉన్నా పట్టణవాసులు మాత్రం ఎన్నికల పోలింగ్పై ఆసక్తి చూపడం లేదు. జగిత్యాల జిల్లా అయిదు పురపాలక సంఘాలతో ప్రత్యేకతను చాటుతుండగా ఈ ఒరవడి ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కనిపిస్తేనే స్పష్టమైన ఫలితం -
పట్టణాల్లో నిర్లక్ష్యం.. పల్లెల్లో ఆదర్శం
[ 08-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రాంతంలో అందరికీ సౌకర్యంగా ఉండేలా ఓటింగ్ రోజున సెలవు ప్రకటించినా ఆశించిన మేరకు ఓటింగ్శాతం నమోదు కావడం లేదు. -
కాంగ్రెస్ గెలుపు జిల్లాకు అవసరం
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్రావు గెలిస్తే.. జిల్లా మరింత అభివృద్ధిని సాధించేందుకు అవకాశముంటుందని, భాజపా, భారాస అభ్యర్థుల గెలుపుతో ప్రయోజనం ఏమీ ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదు
[ 08-05-2024]
కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదని, ఆ పార్టీ దళితులకు అన్యాయం చేస్తోందని భాజపా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ పేర్కొన్నారు. -
పనితీరు బేరీజు వేయండి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తున్నారని భాజపా జతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
అభివృద్ధి కోరుకుంటే భారాసకు ఓటేయండి
[ 08-05-2024]
అన్ని వర్గాల ప్రజలు, రైతులపట్ల కాంగ్రెస్ అనాలోచితంగా వ్యవహరిస్తోందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. -
ఆధ్యాత్మిక వారధి.. అవకాశాల పెన్నిధి
[ 08-05-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అంటేనే ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు నెలవు. వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్నను ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు. అందుకే ఏ గ్రామానికి వెళ్లినా అంజన్న, రాజన్న పేర్లు సాధారణంగా వినిపిస్తుంటాయి. -
అతివల ఆదరణ దక్కేదెవరికో!
[ 08-05-2024]
సార్వత్రిక సమరంలో పోలింగ్ సమయం సమీపిస్తుండటంతో అభ్యర్థులు గెలుపు వ్యూహాలు ముమ్మరం చేశారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకుండా విజయమే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. -
ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు యువకుల దుర్మరణం
[ 08-05-2024]
ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లి బోల్తాపడడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేటలో మంగళవారం చోటుచేసుకుంది. -
రూ.9.42 లక్షల నగదు పట్టివేత
[ 08-05-2024]
జగిత్యాల పట్టణం మోచిబజార్లో ఎస్సై మన్మదరావు ఆధ్వర్యంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టగా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామానికి కె.శిరీష ఎలాంటి ఆధారం లేకుండా తీసుకెళ్తున్న రూ.4.84 లక్షలను పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
చెలరేగిన హెడ్, అభిషేక్.. హైదరాబాద్ అద్భుత విజయం
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
పెళ్లి చేసుకో.. జీవితం బాగుంటుంది: వరలక్ష్మీ శరత్కుమార్ ఫన్నీ వీడియో
-
పులివెందుల సీఐపై ఎన్నికల సంఘానికి దస్తగిరి ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM