ఇద్దరికి అమాత్యయోగం
అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సీనియర్ నేతలకే అవకాశం
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం
పొన్నం ప్రభాకర్
ఈనాడు, కరీంనగర్, పెద్దపల్లి : అందరూ అనుకున్నట్లే.. ఉమ్మడి జిల్లాకు చెందిన నేతలిద్దరికి మంత్రి పదవులు లభించాయి. మంథని శాసనసభ్యుడిగా గెలిచిన దుద్దిళ్ల శ్రీధర్బాబుతో పాటు హుస్నాబాద్లో విజేతగా నిలిచిన పొన్నం ప్రభాకర్లు గురువారం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు సీనియర్ నాయకులు కావడంతో అనుభవం దృష్ట్యా మొదటి విడతలోనే మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీధర్బాబు ఇప్పటికే అయిదుసార్లు మంథని నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతోపాటు మంత్రిగా పనిచేశారు. పొన్నం ప్రభాకర్కు గతంలో కరీంనగర్ ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండగా తొలిసారి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శ్రీధర్బాబు 2009లో మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరవాత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా సేవలు అందించారు. రోశయ్య కేబినెట్లోనూ కొనసాగిన ఆయనకు కిరణ్కుమార్రెడ్డి మంత్రివర్గంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా శాసనసభ వ్యవహారాలు, న్యాయమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.
కార్యకర్తల సంబరాలు
ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో హుస్నాబాద్ కలుపుకొని 13 నియోజకవర్గాలుండగా ఇందులో 8 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మరో అయిదుచోట్ల భారాస అభ్యర్థులు గెలుపొందారు. పాత కరీంనగర్ జిల్లాలో శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతోపాటు మరొకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం సాగినప్పటికీ ఇద్దరికే అమాత్య యోగం దక్కింది. మున్ముందు విస్తరణలో మరొకరికి అవకాశం దక్కుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొన్నం నివాసం కరీంనగర్లో ఉండటంతో ఆయన ఇక్కడికి తరచూ రాకపోకల్ని సాగించే అవకాశం ఉండగా.. మంత్రి శ్రీధర్బాబు గతంలో మాదిరిగానే ఈసారి కూడా కరీంనగర్లోనే నివాసం ఉండే అవకాశమున్నట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
గతంలో మన జిల్లా మంత్రులు వీరు...
- ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 21 మంది మంత్రి పదవుల్ని అందుకున్నారు. ఈసారి కొత్తగా పొన్నం ప్రభాకర్ ఈ జాబితాలో చేరడంతో మొత్తంగా 22 మందికి అమాత్య యోగం లభించింది. వీరేకాకుండా గతంలో జి.నారాయణరావు, దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్లుగా పనిచేశారు.
- పెద్దపల్లి ఎంపీగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన జి.వెంకటస్వామి కార్మిక, పౌరసరఫరాల శాఖా మంత్రిగా పని చేశారు.
1. పీవీ నరసింహారావు : న్యాయ, ఆరోగ్య, శాసనసభ వ్యవహారాలు, విద్యాశాఖ
2. కెవి. నారాయణరెడ్డి : ప్రణాళిక, న్యాయశాఖ
3. జె.చొక్కారావు : రవాణా, భూగర్భజలాలు, వ్యవసాయం, పరిశ్రమలు, పౌరసరఫరాలు
4. వర్దినేని వెంకటేశ్వర్రావు : భూగర్భజలాలు, లఘు పరిశ్రమలు, కార్మిక, న్యాయ, రెవెన్యూశాఖలు
5. టి. జీవన్రెడ్డి : ఎక్సైజ్ ఆబ్కారీ, పంచాయత్రాజ్ శాఖ
6. మాతంగి నర్సయ్య : షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ
7. రాజేశంగౌడ్ : న్యాయశాఖ
8. పాటిరాజం : నీటిపారుదల, ఉన్నత విద్యాశాఖ
9. సి.ఆనందరావు : న్యాయశాఖ
10. ఎన్.రాంకిషన్రావు : అటవీశాఖ
11. ఎం. దామోదర్రెడ్డి : మైనింగ్శాఖ, సాంకేతిక విద్య
12. ఎల్.రమణ : చేనేత , జౌళి శాఖ
13. సుద్దాల దేవయ్య : సహకార శాఖ
14. ఇనుగాల పెద్దిరెడ్డి : కార్మిక, ఉపాధి, పర్యాటకం, చక్కెరశాఖలు
15. ఎం. సత్యనారాయణరావు : దేవాదాయ, క్రీడలు, సినిమాటోగ్రఫీ
16. కెప్టెన్ లక్ష్మీకాంతరావు : బీసీ సంక్షేమశాఖ
17. దుద్దిళ్ల శ్రీధర్బాబు : ఉన్నత విద్య, న్యాయ, ఎన్నారై వ్యవహారాలు, పౌరసరఫరాలు వినయోగదారుల వ్యవహారాలు, శాసనసభ వ్యవహారాలు శాఖలు
18. ఈటల రాజేందర్ : ఆర్థిక, ప్రణాళిక, పౌరసరఫరాలు, తూనికలు, కొలతలు, వినియోగదారుల వ్యవహారాలు, వైద్యఆరోగ్యశాఖలు
19. కె.తారకరామారావు : పురపాలిక, ఐటీ, పరిశ్రమల శాఖలు
20. కొప్పుల ఈశ్వర్ : ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలు
21. గంగుల కమలాకర్ : బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖలు
దుద్దిళ్ల శ్రీధర్బాబు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం