కంకర వేశారు.. తారు మరిచారు
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు మూడేళ్లు అవుతున్నా పూర్తి చేయడం లేదు.
ప్రమాదాలకు నిలయంగా రహదారి
న్యూస్టుడే, కోనరావుపేట
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తారు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. పనులు దక్కించుకున్న గుత్తేదారు మూడేళ్లు అవుతున్నా పూర్తి చేయడం లేదు. కొంత మేరకు కంకర పోసి వదిలేశారు. మరికొంత భాగం తవ్వి వదిలేశారు. దీంతో స్థానికులకు రవాణా కష్టాలు పెరిగి ఇబ్బంది పడుతున్నారు.
కోనరావుపేట మండలం ధర్మారం, వేములవాడ అర్బన్ మండలం చంద్రగిరి మధ్య 6.52 కిలో మీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.2.66 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు దక్కించుకున్న గుత్తేదారు 2021 నవంబర్లో ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 18 నెలల్లో పనులు పూర్తి చేయాల్సి ఉంది. రెండేళ్లు గడిచినప్పటికీ గుత్తేదారు నిర్లక్ష్యం వీడటం లేదు. చంద్రగిరి నుంచి రామన్నపేట వరకు సుమారు మూడు కిలో మీటర్ల మేర గుత్తేదారు ఏడాది క్రితం కంకర వేశారు. రామన్నపేట నుంచి నాగారం వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టి తవ్వి పోశారు. నాగారం-ధర్మారం వరకు అసలు పనులే చేపట్టలేదు. దీంతో వాహనదారులు కంకర, మట్టి రోడ్డుపై వెళ్లడం కష్టంగా మారింది. తారు రోడ్డు నిర్మాణంతో సౌకర్యంగా మారుతుందని ఆశించిన జనాలకు మరిన్ని కష్టాలు తెచ్చి పెట్టాయి. పనులు పూర్తి చేసేలా చొరవ చూపాలని అధికారులు, పాలకులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తారు రోడ్డు పూర్తికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
వాహనాలు బోల్తా
- న్యాలకొండ భూంరెడ్డి, రైతు, రామన్నపేట
ఏడాది క్రితం గుత్తేదారు కంకర వేసి వదిలేశారు. పాదచారులు సైతం నడవటానికి వీలు లేకుండా పోయింది. నిత్యం వందల సంఖ్యలో రైతులు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ మార్గంలో ఇప్పటికే మూడు పర్యాయాలు కారు, ద్విచక్ర వాహనదారులు బోల్తా పడగా పలువురికి గాయాలయ్యాయి. రైతులు, వాహనదారుల కష్టాలు, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గుత్తేదారు తారు వేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
త్వరలోనే పనులు చేపట్టేలా చర్యలు
- మనోహర్, ఏఈ, పీఆర్, కోనరావుపేట
ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నాగారం వరకే తారు రోడ్డు నిర్మాణానికి సరిపోతున్నాయి. నాగారం-ధర్మారం గ్రామాల మధ్య మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించాం. కంకర వేసిన రోడ్డుపై తారు వేయాలని గుత్తేదారుకు ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. బిల్లులు, ఇసుక సమస్యతో తారు నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగింది. తారు రోడ్డు పూర్తయితే ఆయా గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం