బోయినపల్లి ఎంపీపీపై వీగిన అవిశ్వాసం
బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్పై అవిశాస్వం వీగిపోయింది. మండల పరిషత్తు కార్యాలయంలో అవిశ్వాస ప్రతిపాదన సమావేశాన్ని ఎంపీడీవో జయశీల బుధవారం ఏర్పాటు చేయగా వేములవాడ ఆర్డీవో మధుసూదన్ హాజరయ్యారు.
బోయినపల్లి, న్యూస్టుడే: బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్పై అవిశాస్వం వీగిపోయింది. మండల పరిషత్తు కార్యాలయంలో అవిశ్వాస ప్రతిపాదన సమావేశాన్ని ఎంపీడీవో జయశీల బుధవారం ఏర్పాటు చేయగా వేములవాడ ఆర్డీవో మధుసూదన్ హాజరయ్యారు. సమావేశానికి ఎంపీటీసీ సభ్యులు ఒక్కరూ హాజరు కాకపోవడంతో నిర్ణీత గంట సమయం ముగిసిన అనంతరం అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించారు. భారాసకు చెందిన విలాసాగర్ ఎంపీటీసీ సభ్యుడు వేణుగోపాల్ ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే సొంత పార్టీ సభ్యులు ఈడుగు రాజేశ్వరి (వరదవెల్లి), కొనుకటి నాగయ్య (నర్సింగాపూర్), ఐరెడ్డి గీత (మల్లాపూర్), డబ్బు మమత (కోరెం), కంకణాల వనజ (అనంతపల్లి)తోపాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల శ్రీనివాస్గౌడ్ (తడగొండ) జనవరి 27న వేములవాడ ఆర్డీవోకు అవిశ్వాస ప్రతిపాదనపై వినతి పత్రం అందించారు. ఈ నెల 5న ఆర్డీవో ఎంపీటీసీ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. కాగా బోయినపల్లి, జగ్గారావుపల్లి, స్తంభంపల్లి ఎంపీటీసీ సభ్యులు సంబ బుచ్చమ్మ, కొంకటి శిరీష, అక్కెనపల్లి ఉపేందర్తోపాటు అవిశ్వాస ప్రతిపాదన చేసిన కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యుడు ఉయ్యాల శ్రీనివాస్గౌడ్ ఎంపీపీకి మద్దతు తెలుపుతూ శిబిరానికి తరలి వెళ్లారు. వీరితోపాటు కొదురుపాక ఎంపీటీసీ సభ్యురాలు బాలగోని గౌతమి ఎంపీపీ వర్గం వైపు ఉన్నారు. సొంత పార్టీకి చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాసం ప్రకటించగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుల మద్దతుతో తనపై అవిశ్వాసం నెగ్గకుండా ఎంపీపీ పావులు కదిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్తంభంపల్లి ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరగా జగ్గారావుపల్లి ఎంపీటీసీ సభ్యురాలు భారాసకు రాజీనామా చేశారు. ఎంపీపీపై అవిశ్వాసం వీగిపోయినట్లు ఆర్డీవో ప్రకటించిన అనంతరం బోయినపల్లిలో పలువురు నాయకులు, యువకులు సంబరాలు చేసుకొన్నారు. బస్టాండు ప్రాంతంలో టపాసులు పేల్చి, మిఠాయిలు పంపిణీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే