వాహనదారులకు మెరుగైన సేవలు
‘ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయడం, వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతా. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడంతోపాటు కార్యాలయంలో సమూల మార్పులు చేస్తా’నని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్ పెద్దింటి పురుషోత్తం స్పష్టం చేశారు.
ఉమ్మడి జిల్లా డీటీసీ పురుషోత్తం
న్యూస్టుడే, కరీంనగర్ రవాణా విభాగం
‘ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయడం, వాహనదారులకు మెరుగైన సేవలు అందించడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతా. ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడంతోపాటు కార్యాలయంలో సమూల మార్పులు చేస్తా’నని కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్ పెద్దింటి పురుషోత్తం స్పష్టం చేశారు. 2003 నుంచి 2015 వరకు ఎంవీఐగా షాపూర్, అలంపూర్ చెక్పోస్ట్లలో విధులు నిర్వహించారు. 2015-2018 వరకు మేడ్చల్, సౌత్జోన్ ఆర్టీవోగా, జిల్లా ఉప రవాణా కమిషనర్గా 2019లో వరంగల్కు పని చేశారు. ఇటీవల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డీటీసీగా బాధ్యతలు చేపట్టిన ఆయనతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది.
జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్ నిరుపయోగంగా ఉంది.?
ట్రాక్ను పరిశీలిస్తా. అందుబాటులోకి తేవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎన్ని నిధులు అవసరం అవుతాయో చర్చిస్తాం.
ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు.?
మోటార్ వెహికల్ చట్టం ప్రకారం రహదారి నిబంధనలు పాటించడం తప్పనిసరి. ఆటోలు, ఇతర వాహనాలకు తప్పనిసరిగా ముందు, వెనక భాగంలో రేడియం స్టిక్కర్లను అతికించాలి. ఆర్అండ్బీ శాఖ సైతం రహదారులపై సైన్ బోర్డులు విరివిగా ఏర్పాటు చేయాలి. ప్రతి వాహనదారుడు లైసెన్స్, వాహన పత్రాలు కల్గి ఉండాలి. ఇవి ఉంటేనే ప్రమాదాలు జరిగినప్పుడు పరిహారం సకాలంలో అందుతుంది.
కార్యాలయపరంగా ఎలాంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఏమైనా మార్పులకు అవకాశముందా.?
కార్యాలయంలో ప్రక్షాళన తప్పనిసరిగా ఉంటుంది. వాహనదారుల సేవలు, ధ్రువపత్రాలు సరిగా చూస్తున్నారా లేదా? కౌంటర్లను పరిశీలిస్తాను. అవసరమైన మార్పులు చేస్తాను. ఆర్టీఏ కార్యాలయ నిర్వహణలో ఏవో పాత్ర కీలకంగా ఉంటుంది. అధికారి, సిబ్బంది ఎవరైనా సరే తమకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి.
ప్రశ్న : డీటీసీగా మీ ముందున్న లక్ష్యాలను వివరించండి.
జవాబు : ప్రభుత్వం నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలి. త్వరలోనే జిల్లా రవాణా శాఖ అధికారులు, ఇన్స్పెక్టర్లతో సమావేశం నిర్వహిస్తాం. వాహనదారులు త్రైమాసిక పన్నులు సకాలంలో స్వచ్ఛందంగా చెల్లించాలి. దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తా. పన్ను చెల్లించకుండా రోడ్డుపై తిరిగితే వాహనాన్ని సీజ్ చేయడంతోపాటు 200 శాతం జరిమానా విధిస్తాం.
అనేక వాహనాలు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయి. ఎలాంటి చర్యలు తీసుకుంటారు.?
వాహనాల పూర్తి సమాచారం ఆన్లైన్లో ఉంటుంది. ముందుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనాల జాబితాను తయారు చేస్తాం. ఎన్ని వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ కల్గి ఉన్నాయి, త్రైమాసిక పన్నులు చెల్లించాయో పూర్తి వివరాలతో కూడిన జాబితాను రూపొందిస్తాం. ఫిట్నెస్ చేయించని వాహనాల యజమానులకు నోటీసులు పంపిస్తాం. సామర్థ్య పరీక్షలు నిర్వహించకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తాం.
సమ్మక్క-సారలక్క జాతర నేపథ్యంలో వాహనదారులకు ఇచ్చే సలహాలు ఏమిటి?
వన దేవతల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. పరిమితికి మించి వాహనాల్లో తరలించొద్దు. వాహనాలు కండీషన్గా ఉండటంతోపాటు రేడియం స్టిక్కర్లు అతికించి ఉండాలి. అతివేగం, చరవాణిలో మాట్లాడుతూ వాహనాలు నడపరాదు. రహదారి నిబంధనలు పాటిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల