పాలక మండలి.. ఇకనైనా ఏర్పడాలి!
దక్షిణ కాశీగా విలసిల్లుతున్న వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ట్రస్టు బోర్డు నియమిస్తే రాజన్న ఆలయ అభివృద్ధి
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
దక్షిణ కాశీగా విలసిల్లుతున్న వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి నియామకానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇటీవల దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల వసతులు, ధూపదీప నైవేద్యాలు అందుతున్న తీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అందులోనే పాలక మండళ్లు లేని ఆలయాల్లో వెంటనే భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే, విప్ ఆది శ్రీనివాస్ రెండు సార్లు, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు చివరిసారిగా రాజన్న ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా 2014 వరకు పని చేశారు. ఆ తరవాత నుంచి ఉత్సవాల సమయంలో మాత్రమే తాత్కాలిక ఆలయ పునరుద్ధరణ కమిటీలు, ఉత్సవ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. 2022 నవంబరులో దేవాదాయశాఖ కమిషనర్ ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనికి స్పందించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డిసెంబరు 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఆసక్తి ఉన్న అర్హులైన వారు ట్రస్టు బోర్డు సభ్యులుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీనికోసం పలువురు ఉత్సాహం చూపించారు. అయితే ఈ ప్రక్రియ అక్కడితోనే నిలిచిపోయింది.
ఈసారి తాత్కాలిక కమిటీతోనే
వేములవాడ ఆలయం పెద్దది కావడంతో కమిటీ ఏర్పాటుకు సమయం పట్టే అవకాశం ఉందని ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. అయితే శివరాత్రి రాబోతున్న తరుణంలో పనుల వేగవంతానికి, జాతర నిర్వహణకు గతంలో మాదిరిగానే తాత్కాలిక కమిటీ ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన ట్రస్టు బోర్డు సభ్యుల నియామకం పూర్తవడం గానీ, లేకుంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయడం గానీ చేయాల్సి ఉంటుంది. వీటీఏడీఏలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ తరవాత కొత్తగా నియమితులయ్యే ట్రస్టు బోర్డు వారే సభ్యులుగా చలామణి అవుతారు. ఈ ప్రక్రియంతా పూర్తవడానికి సమయం పడుతుంది. అంతవరకు వేచిచూడక తప్పదని దేవాదాయశాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో చారిత్రక నేపథ్యమున్న రాజన్న ఆలయానికి కమిటీ ఏర్పాటు చేస్తే భక్తులకు సౌకర్యాల కల్పనలో వేగం పెరిగే అవకాశం ఉంది.
వీటీఏడీఏతో మారిన స్వరూపం
రాజన్న ఆలయ అభివృద్ధికి వీటీఏడీఏ (వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ)ను 2016 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పరిధిలోకి అయిదు గ్రామాలతోపాటు ఉపాలయాలు, నాంపల్లి గుట్టను కూడా చేర్చారు. దీనికోసం ఏటా రూ.వంద కోట్లు కేటాయిస్తూ గత ప్రభుత్వం ప్రణాళికలు, ఆలయ అభివృద్ధి నమూనాలను రూపొందించింది. దీనికి ముఖ్యమంత్రి ఛైర్మన్గా, సీనియర్ ఐఏఎస్ అధికారిని వైస్ ఛైర్మన్గా నియమించారు. ఈ సంస్థ హైదరాబాద్ నుంచి కార్యకలాపాలు కొనసాగించగా గతేడాది ఆగస్టులో వేములవాడకు తరలించారు. దీంతో ఆలయ కమిటీ ఊసేలేకుండా పోయింది. అయితే ఈ కమిటీ అనుకున్నంత మేర పని చేయకపోవడం, గుడికి విడుదల కావాల్సిన నిధులు, చేయాల్సిన పనులు పెండింగ్లో పడిపోయాయి. ఇటీవలే వీటీఏడీఏ ఛైర్మన్ హోదాలో సీఎం రేవంత్రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. ఆలయానికి హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్లు విడుదల చేయించారు. దీంతో పెండింగ్లో ఉన్న బద్ది పోచమ్మ ఆలయ ప్రహరీ, శివార్చన వేదిక నిర్మాణం పనులు జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే