భూ దందాలకు అధికారుల దన్ను!
కరీంనగర్ భూ కబ్జాల వ్యవహారంలో ఒక్కొక్కరి చిట్టా వెలుగులోకి వస్తోంది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారి బండారం బయటపడుతోంది. ముఖ్యంగా వందల సంఖ్యలో భూ బాధితులకు జరిగిన అన్యాయంలో కొందరు అధికారుల పాత్రా స్పష్టమవుతోంది.
విచారణలో వెల్లడవుతున్న అక్రమాలు
ఈనాడు, కరీంనగర్
కరీంనగర్ భూ కబ్జాల వ్యవహారంలో ఒక్కొక్కరి చిట్టా వెలుగులోకి వస్తోంది.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారి బండారం బయటపడుతోంది. ముఖ్యంగా వందల సంఖ్యలో భూ బాధితులకు జరిగిన అన్యాయంలో కొందరు అధికారుల పాత్రా స్పష్టమవుతోంది.. కబ్జాదారులతో చేతులు కలిపి అక్రమాలకు దన్నుగా నిలిచిన వైనం పోలీసుల దృష్టికి వస్తోంది.. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, రిజిస్ట్రేషన్ శాఖల్లో గతంలో పనిచేసిన కొందరి సహకారంతో అక్రమార్కులు విలువైన భూములను ఇష్టానుసారం కబ్జా చేశారు.. భూ మాఫియాకు వివిధ స్థాయిల్లోని అధికారులు సహకారం అందించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు.. కాసుల కక్కుర్తిలో అందినకాడికి దండుకున్నది కొందరైతే.. స్థిరాస్తి వ్యాపారులు, దళారులకు సహకరించేందుకు రికార్డులను తారుమారు చేసి ఆస్తులను కూడగట్టుకుంది ఇంకొందరు. న్యాయం కోసం ఠాణా మెట్లెక్కిన వారిపై జులుం చూపించింది మరికొందరు. బాధ్యతాయుతమైన హోదాల్లో ఉండి అక్రమాల పీచమణచాల్సినవారే.. దందారాయుళ్ల పంచన చేరి బాధితులకు అన్యాయం చేశారు.. ప్రస్తుతం పోలీసులు పక్కాగా విచారణ చేస్తూ కేసులు నమోదు చేస్తుండటంతో అటు కబ్జారాయుళ్లతోపాటు ఇటు వారికి సహకరించిన అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇక్కడిక్కడే పోస్టింగ్లు..
కరీంనగర్తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏళ్ల తరబడి పని చేసిన అనుభవాన్ని కొందరు అధికారులు తమ స్వార్థం కోసం.. అక్రమార్కుల మేలు కోసం ఉపయోగించారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఇలా పని చేసినవారు అక్రమార్కులకు వంత పాడటంలో ముందున్నారు. ధరణి పోర్టల్ రాకముందు పహాణీలు మాన్యువల్గా ఇచ్చే సమయంలో కరీంనగర్తోపాటు పక్కనే ఉన్న కొత్తపల్లి, కరీంనగర్ గ్రామీణ మండలాల్లోని భూముల విషయంలో వీఆర్వో మొదలు జిల్లా స్థాయి అధికారుల వరకు రికార్డులు తారుమారు చేశారనే అభియోగాల్ని ఎదుర్కొన్నారు. ఇదే తరహాలో పోలీసు శాఖలోనూ కొందరు బాధితుల పక్షాన నిలవకుండా ఆక్రమణదారులకు మేలు చేశారు. ఒకవేళ బాధితుడు కింది స్థాయి అధికారిపై ఫిర్యాదు చేసినా.. పైస్థాయి సార్లకు కూడా అందులో వాటా ఉండటంతో వారిని వెనకేసుకొచ్చేవారు. విచారణలు, చర్యల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించేవారు. గతంలో పనిచేసి వెళ్లిన వారు కూడా పాత తేదీల్లో రికార్డులు మార్చిన సందర్భాలు ఇటీవల కేసుల్లో బయటపడతుండటం అధికార వ్యవస్థ అక్రమార్కులకు ఏ స్థాయిలో సాయపడిందో అర్థమవుతోంది.
ఎవరెవరని గుర్తిస్తున్న సీపీ!
భూమి పత్రాల ఫోర్జరీ, బెదిరింపు వ్యవహారంలో గతంలో పని చేసిన తహసీల్దార్పై కేసు నమోదు చేసిన సంఘటన సంచలనంగా మారింది. కమిషనరేట్కు ఇప్పటి వరకు 800 మందికి పైగా బాధితులు ఫిర్యాదులను అందించగా ప్రతి కేసును సీపీ అభిషేక్ మహంతి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏసీపీ, సీఐలు విచారణ అనంతరం వాస్తవాల్ని సీపీ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఎక్కువ కేసుల్లో రెవెన్యూ సిబ్బంది వ్యవహారాలు వెలుగులోకి వస్తుండటంతో వారి పేర్లను ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. ఎక్కువ కేసులు నిర్ణీత సమయంలోనే జరగడం.. ఆ సమయంలో రెవెన్యూ, పోలీసు విభాగాల్లో ఉన్న అధికారులు ఏళ్లపాటు కొనసాగడం విచారణలో గుర్తిస్తున్నారు. ఇలాంటి వారి జాబితాను సిద్ధం చేసి వారు చేసిన తప్పిదాలపై ప్రత్యేకంగా నివేదికను సిద్ధం చేస్తున్నారు. ఈ జాబితాలో కరీంనగర్ గ్రామీణ మండలంలో పని చేసిన అయిదారుగురు రెవెన్యూ సిబ్బంది పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు ఓ ఎస్సై తనకున్న పలుకుబడితో భూ పంచాయతీ ఏ ఠాణాకు వెళ్లినా అక్కడున్న పోలీసులను మభ్యపెట్టి బాధితులకు మేలు జరగకుండా దందా చేసేవారికి కొమ్ముకాశారని గుర్తించారు. ఇలా ఈ ఎస్సై మాత్రమే కాకుండా మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల వ్యవహారంపై సీపీ సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. వారిపై శాఖాపరమైన చర్యల్ని తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు