నిరీక్షణ ముగిసింది.. సంతోషం విరిసింది
ఒకటా.. రెండా.. 18 ఏళ్లుగా నిరీక్షణ. కడుపు నిండా తిని.. కంటి నిండా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలైందో. దుబాయ్ అనే మాట వినిపిస్తే చాలు రామలక్ష్మణుల్లాంటి తమ కుమారులను తలచుకుని రోదించేవారు.
18 ఏళ్ల తర్వాత దుబాయి జైలు నుంచి విముక్తి
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల, న్యూస్టుడే, సిరిసిల్ల గ్రామీణం
ఒకటా.. రెండా.. 18 ఏళ్లుగా నిరీక్షణ. కడుపు నిండా తిని.. కంటి నిండా నిద్రపోయి ఎన్ని సంవత్సరాలైందో. దుబాయ్ అనే మాట వినిపిస్తే చాలు రామలక్ష్మణుల్లాంటి తమ కుమారులను తలచుకుని రోదించేవారు. ఎడారి దేశాన జీవితకాలం బయటకు రాలేనంత శిక్ష పడిందని కుమిలిపోయేవారు. ఎన్నో ఏళ్ల నిట్టూర్పులో ఎక్కడో చిన్న ఆశ. తమ వారు ఎన్నటికైనా క్షేమంగా బయటకు వస్తారని నమ్మకం. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ వారికి మాటిచ్చారు. ఫలితంగా చాలా ఏళ్ల ప్రయత్నాల తర్వాత దుబాయ్ జైలు నుంచి విముక్తి లభించింది. ఎట్టకేలకు విమానాశ్రయంలో కొడుకులను చూడగానే ఆ వృద్ధుల కళ్లు చెమర్చాయి. కుటుంబ సభ్యులను చూసుకొని వలసజీవులు భావోద్వేగానికి గురయ్యారు.
వాచ్మెన్ హత్య కేసులో దుబాయ్ జైలులో 18 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న ఇద్దరికి ఎట్టకేలకు విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పురపాలక సంఘం పరిధిలోని పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, శివరాత్రి రవిలు బుధవారం ఇంటికి చేరుకున్నారు. అన్నదమ్ములైన వీరు కోనరావుపేటకు చెందిన దుండుగుల లక్ష్మణ్, చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి, జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన హన్మంతులతో కలిసి 2004లో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లారు. 2005లో అక్కడ వీరు పని చేస్తున్న దగ్గర నేపాల్కు చెందిన వాచ్మెన్ దిల్ప్రసాద్రాయ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఈ అయిదుగురికి 25 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఈ విషయం తొలుత 2011లో ‘ఈనాడు’ కథనం ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన అప్పటి మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. జైల్లో ఉన్న వారిని రాష్ట్రానికి రప్పించే ఏర్పాట్లు చేశారు. కేటీఆర్ స్వయంగా నేపాల్ వెళ్లి వాచ్మెన్ కుటుంబ సభ్యులకు రూ.15 లక్షల నగదు అందజేశారు. హతుడు దిల్ప్రసాద్రాయ్ భార్య నుంచి క్షమాభిక్ష పత్రంలో సంతకం తీసుకుని న్యాయవాదుల ద్వారా దుబాయ్ న్యాయస్థానానికి పంపారు. ఆ తర్వాత అక్కడి ప్రభుత్వం మారడం, అంతకు ముందున్న నిబంధనలు మరింత కఠినతరం కావడంతో జాప్యం జరుగుతూ వచ్చింది. తర్వాత నిందితుల అనారోగ్య కారణాలను చూపుతూ చేసిన ప్రయత్నం ఫలించింది. అందులో భాగంగా 2023 సెప్టెంబరు 21న కోనరావుపేట మండలానికి చెందిన దుండగుల లక్ష్మణ్ విడుదలై ఇంటికి చేరారు. జగిత్యాల జిల్లా మానాలకు చెందిన హన్మంతు ఆదివారం రాగా, బుధవారం పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవిలు ఇంటికొచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులను కలుసుకున్నాక ‘ఈనాడు’ కథనం ద్వారా తమకు సహకారం లభించిందని పేర్కొన్నారు. 2011 నుంచి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కృషి ఫలితంగానే విముక్తి కలిగిందని, ఆయన సొంత ఖర్చులతో విమాన టికెట్లు ఏర్పాటు చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మరోసారి గల్ఫ్ దేశాలకు వెళ్లమని కార్మికులు చెప్పారు. ఇదే విషయాన్ని కేటీఆర్ తన ‘ఎక్స్’ ఖాతాలో ప్రస్తావించి, విడుదలైన కార్మికులు మాట్లాడిన వీడియోలను పోస్టు చేశారు. చందుర్తికి చెందిన నాంపల్లి వెంకటి రాష్ట్రానికి వచ్చేందుకు వీసాలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీరితో కలిసి రాలేకపోయారు. వెంకటి వచ్చే నెలలో రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
నేతల పరామర్శ
స్వగ్రామానికి వచ్చిన శివరాత్రి మల్లేశం, రవిలను భారాస జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మండల అధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, నాయకులు వెంకట రమణారావు, అగ్గి రాములు, రమేశ్రావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, నాయకులు వైద్య శివప్రసాద్, గ్రామస్థులు పరామర్శించారు. యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట