ఆర్అండ్బీ శాఖలో కలకలం
కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన తీగల వంతెన.. అతిథిగృహం పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లా పాలనాధికారి విచారణకు ఆదేశించడంతో ఆ శాఖ అధికారుల్లో కలకలం రేపుతోంది.
న్యూస్టుడే, కరీంనగర్ పట్టణం
కరీంనగర్ జిల్లా కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన తీగల వంతెన.. అతిథిగృహం పనులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లా పాలనాధికారి విచారణకు ఆదేశించడంతో ఆ శాఖ అధికారుల్లో కలకలం రేపుతోంది. ఇప్పటికే విశ్రాంతి అతిథిగృహం పనులపై విజిలెన్స్ అధికారులు విచారణ జరుపుతుండగా మరో విచారణకు ఆదేశాలు రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో పనులు.. కొత్త ప్రభుత్వంలో విచారణలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని గత ప్రభుత్వ నేతలు నిబంధనలకు నీళ్లు వదిలారంటూ, ప్రస్తుత ప్రభుత్వ నేతలు విచారణలకు ఆదేశించడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద ఈ రెండు పనులపై విచారణ ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
తీగల వంతెనపై ..
తీగల వంతెన ప్రారంభించిన కొత్తల్లోనే తారు దెబ్బతినడం, రోడ్డు గుంతలు పడటంతో గందరగోళానికి గురి చేసింది. రూ.224 కోట్లతో తీగల వంతెన పనులు చేపట్టారు. రూ.181 కోట్లు వంతెనకు, రూ.40 కోట్లు అప్రోచ్ రోడ్లకు ఖర్చు చేశారు. మూడు ఐలాండ్ల నిర్మాణం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా చేపట్టారు. తీగల వంతెన పనులను టాటా గులె మార్క్ సంస్థ పూర్తి చేసి బిల్లులు పొందింది. తపస్వి సంస్థ డిజిటల్ లైటింగ్ పనులు పూర్తి చేసింది. అప్రోచ్ రోడ్ పనులను స్థానిక గుత్తేదారులు నిర్మించారు. ఈ పనులకు రూ.5 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణ చేస్తుండటంతో గుత్తేదారులు, అధికారులు ఎక్కడికి దారి తీస్తుందో అన్న ఆందోళనలో ఉన్నారు. విచారణ కమిటీ ఆదేశాల మేరకు పూర్తి వివరాల రికార్డు కమిటీకి అందజేశారని, పనుల్లో ఎలాంటి అవకతవకలు లేవని ఆర్అండ్బీ శాఖకు చెందిన ఒక అధికారి ‘న్యూస్టుడే’కు తెలిపారు.
అతిథిగృహంపై విజి‘లెన్స్’
రూ.13 కోట్ల వ్యయంతో కరీంనగర్లోని పాత ఆర్అండ్బీ అతిథిగృహం స్థానంలో అధునాతన హంగులతో కొత్త భవనాన్ని నిర్మించారు. గతేడాది జనవరిలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. వాస్తవంగా 2018లో ఈ భవన నిర్మాణానికి రూ.7.25 కోట్లతో పనులు చేపట్టేందుకు సాంకేతిక మంజూరు లభించింది. 2019లో సీఎం హామీ నిధుల కింద రూ.4.25 కోట్లు విడుదలయ్యాయి. పనులు చేపట్టగా నిధులు సరిపోకపోవడంతో మినరల్ సెస్ నిధులు రూ.కోటి విడుదలకు అప్పటి కలెక్టర్ హామీ ఇచ్చారు. పనుల్లో భాగంగా రూ.4.25 కోట్లు చెల్లించారు. మిగిలినవి అప్పటి ముఖ్య నేతల ఒత్తిడి మేరకు చకచకా చేపట్టారు. ఈ నిధులతో కూడా భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో రూ.7.75 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. టెండర్ ఆమోదం, సాంకేతిక మంజూరు రాగా ఈలోగా ప్రభుత్వాలు మారాయి. కొత్త ప్రభుత్వంలో కొందరు నాయకుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ జరుపుతోంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల సమీక్ష సమావేశంలో ఈ పనులపై విచారణకు ఆదేశించారు. దీంతో జిల్లా పాలనాధికారి నలుగురు అధికారులతో కూడిన కమిటీ వేయడం, విచారణ ప్రక్రియ సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం