ఆధునిక వైద్యం.. అత్యుత్తమ సేవలు
ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాలంటే రోగులు భయపడేవారు. సరైన వైద్య సేవలు అందని పరిస్థితే ఇందుకు కారణం. అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి రావడం రోగులకు వరంగా మారింది.
వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి ఏటా పురస్కారాలు
సేవలకు గుర్తింపుగా వచ్చిన అవార్డులు
న్యూస్టుడే, వేములవాడ: ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లాలంటే రోగులు భయపడేవారు. సరైన వైద్య సేవలు అందని పరిస్థితే ఇందుకు కారణం. అలాంటిది ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతన పరికరాలతో వైద్య సేవలు అందుబాటులోకి రావడం రోగులకు వరంగా మారింది. వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటులో ఖరీదైన వైద్యం పొందలేని వారికి ప్రభుత్వ ఆసుపత్రి కొండంత అండగా నిలుస్తోంది. ఆసుపత్రిలో సేవలకు గుర్తింపుగా ఏటా అవార్డులు అందుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్నారు వేములవాడలోని ప్రాంతీయ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది. ఆసుపత్రి ప్రారంభించిన అనతి కాలంలోనే గ్రామీణ ప్రాంత రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకుంది. వీటితోపాటు వచ్చిన నిధుల్లో 25 శాతం వైద్య సిబ్బందికి, మిగతా 75 శాతం ఆసుపత్రి అభివృద్ధికి వినియోగిస్తున్నారు.
సేవలు ఇవీ...
వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రికి వేములవాడ పట్టణంతో పాటు వేములవాడ, వేములవాడ గ్రామీణం, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, బోయినపల్లి మండలాల నుంచి నిత్యం రోగులు వస్తుంటారు. అన్ని సౌకర్యాలతో ఆధునిక హంగులతో ఆసుపత్రిని నిర్మించారు. నెలకు దాదాపు పది వేల మంది రోగులు వస్తుంటారు. ఇందులో దాదాపు 18 మంది వైద్య నిపుణులు, మహిళా వైద్యులు, మరో 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మోకీళ్ల మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు. సాధారణ కాన్పులు ఎక్కువ సంఖ్యలో అయ్యే విధంగా గర్భిణులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ప్రత్యేక వ్యాయామం చేయించి ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ మాతాశిశు సంరక్షణ కేంద్రం ద్వారా గర్భిణులకు సేవలందిసున్నారు. స్కానింగ్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, సీటీస్కాన్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. డయాలసిస్ కేంద్రం చుట్టు పక్కల మండలాల రోగులకు ఎంతో ఉపయోగపడుతుంది.
సమష్టి కృషితోనే...
- ఆర్.మహేశ్రావు, ప్రాంతీయ ఆసుపత్రి, సూపరింటెండెంట్, వేములవాడ
ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అంతా సమష్టిగా పని చేయడంతోనే ఆసుపత్రికి అవార్డులు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మొదట ప్రాధాన్యం ఇస్తున్నాం. అవార్డులు రావడంతో ఆసుపత్రి వైద్యులు, సిబ్బందిపై మరింత బాధ్యత పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్