రాజకీయాలకతీతంగా రామగుండం అభివృద్ధి
రాజకీయాలకు అతీతంగా రామగుండం నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కోరారు. నగరపాలక సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నగరపాలకవర్గ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్యే మక్కాన్సింగ్
పాలకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మక్కాన్సింగ్, కమిషనర్ శ్రీకాంత్, మేయర్ అనిల్కుమార్, కార్పొరేటర్లు
గోదావరిఖని పట్టణం, న్యూస్టుడే: రాజకీయాలకు అతీతంగా రామగుండం నగర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కోరారు. నగరపాలక సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన నగరపాలకవర్గ బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగుండం ప్రాంతంలో గత కొంత కాలంగా ఉపరితల బొగ్గుగనులు, మూతపడిన భూగర్భ బొగ్గుగనులు, మూతపడ్డ పరిశ్రమలతో ఉద్యోగ అవకాశాలు లేక యువత వలసబాట పట్టడంతో జనాభా తగ్గుతుందన్నారు. ఎన్టీపీసీలో మరో ప్లాంట్, జెన్కో ప్లాంటు పునరుద్ధరణతో ఈ ప్రాంతానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో రామగుండం ప్రాంతంలోని పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చానని ఆయన వివరించారు. స్థానిక ప్రభుత్వరంగ సంస్థల సీఎస్సార్ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా రామగుండం అభివృద్ధికే కేటాయించేలా చర్యలు తీసుకుంటామన్నారు. డి.ఎం.ఎఫ్.టి. నిధులు రూ.10 కోట్లతో లక్ష్మీనగర్ ప్రాంతాభివృధ్ది, మరో రూ.29 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. టి.యు.ఎఫ్.ఐ.డి.సి నుంచి రూ.100 కోట్లు, అమృత్ నుంచి రూ.250 కోట్లతో నగరంలో రహదారులు, మురుగు కాలువలు, మురుగు జలాల శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టనున్నామన్నారు. బడ్జెట్లో, పాలకవర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్ కోరారు. వ్యయానికి తగినట్లుగా ఆదాయం లేకపోవడంతో ఆదాయ వనరులను పెంచుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. అందరి సహకారంతో కార్పొరేషన్ తమవంతు కృషి చేస్తామని కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ అన్నారు. కాగా కుక్కలు, కోతుల బెడద నివారణలో నగరపాలిక తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్పొరేటర్ పెద్దెల్లి తేజస్విని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి చర్యలు తీసుకోవాలన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలకు ఏకగ్రీవ ఆమోదం
రూ.211.22 కోట్ల అంచనా ఆదాయంతో పాలకవర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్ను పాలకవర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. అంచనా వ్యయం రూ.196.42 కోట్లు కాగా రూ.14.79 కోట్ల మిగులును ప్రతిపాదనలకు పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్రావు, కార్యదర్శి రాజు, ఎస్ఈ చిన్నారావు, ఈఈ సుచరణ్, అసిస్టెంట్ కమిషనర్ రాజలింగు, సూపరింటెండెంట్ మనోహర్, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట