రూ. కోట్ల వ్యయం.. నిర్వహణ అస్తవ్యస్తం
రామగుండం నగరపాలక ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగానే ఉంది. రహదారులపై చెత్త, కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతునే ఉన్నారు.
నిరుపయోగంగా చెత్త నిర్వహణ కేంద్రం
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం: రామగుండం నగరపాలక ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా సుమారు రూ.20 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ నిర్వహణ అస్తవ్యస్తంగానే ఉంది. రహదారులపై చెత్త, కాలువల్లో మురుగు పేరుకుపోవడంతో దుర్గంధంతో ప్రజలు ఇబ్బంది పడుతునే ఉన్నారు. ఇంటింటా చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగకపోవడంతో ఆయా ప్రాంత ప్రజలు చెత్తను రహదారులపైనే పడేయాల్సి వస్తుంది. తడి, పొడి చెత్త నిర్వహణ అటకెక్కింది. మురుగునీటి నిర్వహణ వ్యవస్థ లేకపోవడంతో నగరంలోంచి వెలువడే వ్యర్థాలు నేరుగా గోదావరినదిలో కలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు గోదావరి ఒడ్డున సమ్మక్క జాతర స్థలాన్ని డంపింగ్ యార్డుగా వినియోగించారు. నగర విస్తీర్ణానికి సరిపడేలా పారిశుద్ధ్య కార్మికులు, పర్యవేక్షకులున్నప్పటికీ ఆశించిన మేరకు పారిశుద్ధ్య నిర్వహణ మెరుగు పడడం లేదు. ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల్లో గతంలోకంటే వెనకబడిపోవడమే ఇందుకు నిదర్శనం.
పర్యవేక్షణ లోపమే ప్రధానం
పారిశుద్ధ్య నిర్వహణలో బల్దియా విఫలమవుతోంది. పారిశుద్ద్య పనులను పర్యవేక్షించేందుకు ముగ్గురు పర్యవేక్షకులు, మరో 16 మంది సహాయ పర్యవేక్షకులు, వీరికి సహాయకులుగా మరో 12 మంది ఉన్నప్పటికీ పారిశుద్ధ్య నిర్వహణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. పారిశుద్ధ్య విభాగంలో 40 మందికి పైగా పర్మినెంటు కార్మికులుండగా స్వీపర్ నుంచి మొదలుకొని సహాయ పర్యవేక్షకుల వరకు మొత్తం 448 ఒప్పంద కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేయాల్సిన సుమారు 40 మంది కార్మికులు నగరపాలక కార్యాలయంలో, కొందరు ప్రజాప్రతినిధులు, అధికారుల ఇళ్లల్లో పనిచేస్తుండటం గమనార్హం. దోమల నివారణలో కీలకమైన ఫాగింగ్ కార్మికులు నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నారు. నిరంతరంగా మురుగు కాలువలను శుభ్రం చేయాల్సిన డ్రెయిన్ క్లీనర్లు ఆయా పనులను విస్మరించి ఇతర పనులు చేస్తున్నారు. భూగర్భ, ఉపరితల మురుగు కాలువలను శుభ్రం చేసేందుకు 59 మంది డ్రెయిన్ క్లీనర్లు ఉండగా అదనంగా మరో 84 మందిని డ్రెయిన్ క్లీనర్లుగా నియమించినా భూగర్భ, ఉపరితల మురుగు కాలువల నిర్వహణే సక్రమంగా లేదు.
ఖర్చు పెరుగుతున్నా....
పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో ఏటా సుమారుగా రూ.20 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నా ఆశించిన మేరకు పురోగతి కనిపించడం లేదు. ఆయా విభాగాల్లోని కొందరు చేతివాటంతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జనవరి మాసాంతం వరకు పారిశుద్ధ్య విభాగంలో రూ.14.74 కోట్లు ఖర్చు చేసినట్లుగా నివేదికలు చెబుతుండగా మార్చి మాసాంతం వరకు మరో రూ.4 కోట్లకు పైగా వ్యయం కానుంది. వినియోగంలో లేని చెత్త తరలింపు, కేంద్రాల నిర్వహణకు గత ఆర్థిక సంవత్సరం రూ.29.52 లక్షలు ఖర్చు చేయగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.24.39 లక్షలు ఖర్చు చేశారట. బ్లీచింగ్ పౌడర్, చీపుర్లు, రసాయనాలు, డీజిల్ కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 కోట్లు డీజిల్ బిల్లులు చెల్లించగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.1.8 కోట్లు చెల్లించారు. వాహనాల మరమ్మతులకు మరో రూ.34.36 కోట్లు ఖర్చు చేశారు. చెత్త తరలింపులో కీలకమైన వాహనాల నిర్వహణ గాడి తప్పడంతో తరచూ మొరాయిస్తూనే ఉన్నాయి. రూ.కోట్లు వెచ్చించి చెత్త నిర్వహణలో అత్యాధునికమైన వాహనాలను కొనుగోలు చేసిన నగరపాలిక వినియోగాన్ని విస్మరించింది.
రామగుండం నగరపాలిక స్వరూపం
డివిజన్లు: 50
విస్తీర్ణం: 93.87 చదరపు కిలోమీటర్లు
జనాభా(2011 ప్రకారంగా): 2,29,644
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం