ఆవిష్కరణలకు గుర్తింపు
ఇన్స్పైర్ మనక్-2022-23లో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. జగిత్యాల జిల్లాలోని 218 పాఠశాలలకు చెందిన 530 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలతో దరఖాస్తు చేయగా ఇందులో 79 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి.
రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్కు అయిదుగురి ఎంపిక
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు, జగిత్యాల పట్టణం
ఇన్స్పైర్ మనక్-2022-23లో జిల్లా విద్యార్థులు తమ ప్రతిభ కనబరిచారు. జగిత్యాల జిల్లాలోని 218 పాఠశాలలకు చెందిన 530 మంది విద్యార్థులు తమ ఆవిష్కరణలతో దరఖాస్తు చేయగా ఇందులో 79 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. అనంతరం జిల్లా స్థాయిలో ఇద్దరు ఇంటర్నల్ జ్యూరీ సభ్యులు, ఒక ఎక్స్టర్నల్ జ్యూరీ సభ్యుడు కలిపి ఆన్లైన్ ద్వారా అయిదుగురు విద్యార్థుల ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. వీరిని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి బాజోజి శ్రీనివాస్, సైన్స్పోరం ప్రతినిధులు, గైడ్టీచర్లు, హెచ్ఎంలు అభినందించారు.
ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్
ఇబ్రహీంపట్నం జడ్పీ హైస్కూలుకు చెందిన బండి రుత్విక్ ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ను రూపొండించాడు. మైక్రో ఎలక్ట్రో మెకానికల్ సిస్టం అనే సూత్రంపై ఆధారపడి ఆల్కహాల్ బ్రీత్ అనలైజర్ పనిచేస్తుంది. ఇందులో ఆల్కహాల్ నిర్దిష్ఠ అవధి ఉంటుంది. ఈ యంత్రాన్ని వాహనాలకు అమర్చినపుడు డ్రైవర్ ఆల్కహాల్ సేవించి వాహనం నడపాలని ప్రయత్నించినపుడు సెన్సార్ గుర్తించి ఇంజిన్ స్టార్ట్ కాకుండా హెచ్చరిస్తుంది. దీంతో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్నపుడు జరిగే ప్రమాదాలను నివారించవచ్చు.
అడ్జెస్ట్మెంట్ పోడియం
ఇబ్రహీంపట్నం మండలం గోధూరు జడ్పీహైస్కూలుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని బండి నవ్యశ్రీ అడ్జెస్ట్మెంట్ పోడియంను రూపొందించారు. పాఠశాలల్లో అన్నిరకాల కార్యక్రమాల్లో 6-10 తరగతుల విద్యార్థులు పాల్గొంటారు. విద్యార్థులు రకరకాల ఎత్తులో ఉండటంవల్ల పొడియంపైనుంచి మాట్లాడటం ఇబ్బందిగా ఉంటుంది. దీనికిగాను అన్నిరకాల ఎత్తున్న విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా అడ్జెస్ట్మెంట్ పోడియంను రూపొందించారు. తమ ఎత్తుకు అనువైన పోడియం ఉండటంతో విద్యార్థులు ఉత్సాహంగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే వీలుంది.
ఎరువుల పంపిణీ యంత్రం
కొడిమ్యాల మండలం రాంసాగర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థి లైసెట్టి విజయ్ ఎరువుల పంపిణీ పరికరాన్ని రూపొందించారు. చేతితో ఎరువులు చల్లితే ఒకచోట ఎక్కువ, మరోచోట తక్కువగా పడి మొక్కల ఎదుగుదలలో హెచ్చుతగ్గులుంటాయి. విజయ్ రూపొందించిన పరికరం ద్వారా ఎరువులను చల్లినపుడు అంతటా ఏకరీతిన పడతాయి. జీపీఎస్, గైడెడ్ సిస్టంద్వారానూ పనిచేసే ఈ పరికరంతో గుళికలు, పొడి, ద్రవరూప ఎరువులను కూడా చల్లవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణంలో చల్లబడే ఈ యంత్రం వాడకంతో ఎరువుల సమతుల్యత కాపాడి దిగుబడులు కూడా పెరిగే అవకాశముంది.
మామిడికాయలు తెంపే పరికరం
ఎక్కువ ఎత్తున్న మామిడి చెట్లపైనుంచి కాయలను తెంపటం రైతులకు ఇబ్బందిగా, శ్రమతో కూడుకున్నదిగా ఉంటుంది. దీనికిగాను లాంగ్పైప్స్టిక్, జాలీ, కట్టర్ తదితరాల సాయంతో మామిడి కాయలను తెంపే పరికరాన్ని రూపొందించాడు కోరుట్లలోని బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన బొడ్డు హర్షవర్ధన్. బ్యాటరీసాయంతో నడిచే ఈ పరికరంతో చెట్టెక్కే అవసరం లేకుండానే కిందనుంచే చిటారు కొమ్మనగల కాయలను కూడా సుళువుగా తెంపవచ్చు. కాయలను కిందపడకుండా తెంపటంతో పగలకుండా నాణ్యతతో కూడిఉండి మంచి ధర పలుకుతాయి.
సీనియర్ సిటిజన్స్ డైనింగ్ టేబుల్
పెగడపల్లి మండలం సుద్దపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కట్ల దినేశ్ సీనియర్ సిటిజన్స్ ఫ్రెండ్లీ మల్టీపర్పస్ డైనింగ్ టేబుల్ను రూపొందించాడు. నొప్పులతో దూరం నడవలేని వారు, నిరంతరం సేవలకు సహాయకులు అందుబాటులో లేనివారికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. స్టాండుపై కూర్చునే వీలుండటం, వాకర్ మాదిరిగా పట్టుకుని నడవటం, ఆహారం, మందులు, మంచినీటి వంటివి ఈ స్టాండుపైనే అమర్చుకునే వీలుండటం, భోజనం చేసేందుకు అనువుగా ఉండటంతో వృద్ధులు, నడవలేని వారికి ఈ డైనింగ్ టేబుల్ ఉపకరించే వీలుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?