మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యం
ఇంటర్మీడియట్ పరీక్షలు 28 నుంచి మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు,
జిల్లా ఇంటర్ విద్యాధికారి నారాయణ
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు, జగిత్యాల పట్టణం
ఇంటర్మీడియట్ పరీక్షలు 28 నుంచి మార్చి 16 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సారి ఇంటర్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు, జిల్లాలో పరీక్షల ఏర్పాట్లు, కేంద్రాల్లో సౌకర్యాలు తదితర అంశాలపై జిల్లా ఇంటర్ విద్యాధికారి నారాయణ ‘న్యూస్టుడే’ మాట్లాడారు. ఆ వివరాలు.
ప్రశ్న: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.?
జవాబు: ఇంటర్ ప్రయోగ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 28 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండడంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశాము. జిల్లాలో 15 ప్రభుత్వ, 13 ప్రైవేటు, మోడల్స్కూల్తో కలిపి మొత్తం 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాము. పరీక్షలకు మొత్తం 14,542 మంది విద్యార్థులు హాజరవ్వనుండగా ఇందులో జనరల్ 12,400, ఒకేషనల్ విద్యార్థులు 2,142 మంది ఉన్నారు.
ప్ర: మాస్కాపీయింగ్ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు.?
జ: ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు ప్రభుత్వ కళాశాలల వాళ్లే ఉంటారు. జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. వీరితోపాటు డీఈసీ బృందం, పరీక్షల కన్వీనర్ ప్రతిరోజూ పరీక్షల నిర్వహణను పరిశీలిస్తూ ఎలాంటి మాస్కాపీయింగ్ జరగకుండా చూస్తారు. ప్రైవేటు కళాశాలలపై ప్రత్యేక నిఘా ఉంటుంది, అనుమానమున్న ప్రతి కేంద్రాన్ని ప్రత్యేకంగా తనిఖీచేస్తాము. ఇన్విజిలేటర్లుగా విద్యాశాఖవారినే తీసుకుంటాము, వారికి సంబంధంలేనిచోటనే విధులను కేటాయిస్తాము. కాపీయింగ్ను ప్రోత్సహించినవారిపై కఠిన చర్యలుంటాయి.
ప్ర: పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు.?
జ: వార్షిక పరీక్షలపై అన్నిరకాల విధులు నిర్వర్తించేవారితో సమావేశాన్ని జరిపి ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూస్తాము. విద్యార్థులకు సరిపడా డ్యూయల్ డెస్క్లు, తాగునీటి సౌకర్యం, వైద్యసహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాము. ఒక నిమిషం లేటైనా అనుమతి లేదు కాబట్టి విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 45 నిమిషాల ముందుగానే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. దూరప్రాంతాల నుంచి సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరడానికి టీఎస్ఆర్టీసీ సహకారంతో ఆయా రూట్లలో బస్సు సమయాలు రీషెడ్యూల్ చేయబడ్డాయి. ఇంటర్బోర్డు అందుబాటులోకి తెచ్చిన సెంటర్ లొకేట్ మొబైల్ యాప్లో పరీక్షకేంద్రం కోడ్ను ఎంటర్చేసి సెర్చ్చేస్తే పరీక్షకేంద్రం రూట్మ్యాప్ చూపిస్తుంది.
ప్ర: విద్యార్థులు, తల్లిదండ్రులకు మీరిచ్చే సూచనలు.?
జ: విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి భయానికి లోనుకావద్దు. తల్లిదండ్రులు విద్యార్థులకు భరోసా కల్పించాలి. విద్యార్థుల్లో భయం తొలగించేందుకు 14416 లేదా 1800914416 టోల్ఫ్రీ నంబర్లకు ఫోన్చేస్తే నిపుణులు మానసిక ప్రశాంతతను కలిగిస్తారు. హాల్టికెట్లను అంతర్జాలం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్ సంతకం కూడా అవసరంలేదు. ప్రైవేటు కళాశాలలకు చెందినవారు హాల్టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది కలిగిస్తే పరీక్షల కన్వీనర్ 79979 94356 కు ఫోన్ చేయవచ్చు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, ప్రింటెడ్ మెటీరియల్ను వెంట తీసుకురావద్దు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.