సర్కారు స్థలాల పరిస్థితేంటి?
కరీంనగర్లో భూ కబ్జాలకు పాల్పడిన కొందరు కటకటాల పాలవుతుండటంతో దందాల్లో పాలు పంచుకున్నవారిలో కలవరం మొదలైంది.. ప్రైవేటు స్థలాలను ఆక్రమించిన వారిపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు..
ఇష్టారాజ్యంగా కబ్జాలు
కరీంనగర్ శివారు బొమ్మకల్ వద్ద ప్రభుత్వ జాగాలో హెచ్చరిక బోర్డు
ఈనాడు, కరీంనగర్: కరీంనగర్లో భూ కబ్జాలకు పాల్పడిన కొందరు కటకటాల పాలవుతుండటంతో దందాల్లో పాలు పంచుకున్నవారిలో కలవరం మొదలైంది.. ప్రైవేటు స్థలాలను ఆక్రమించిన వారిపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు.. అమాయక ప్రజలను బెదిరించిన.. మోసగించిన వారి భరతం పడుతున్నారు.. ఈ క్రమంలో కొందరు కబ్జాదారులు తాము ఆక్రమించిన భూములను వెనక్కి ఇస్తామని బాధితులను బుజ్జగిస్తున్నారు.. ఈ సమయంలో కరీంనగర్తోపాటు చుట్టుపక్కల కొన్నేళ్లుగా కబ్జా కోరల్లో చిక్కుకున్న ప్రభుత్వ భూముల పరిస్థితేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.. కరీంనగర్ కమిషనరేట్కు అందుతున్న దరఖాస్తుల్లో ఎక్కువగా ప్రైవేటు భూముల వ్యవహారంలో దళారుల దందాలు, ఆగడాలపైనే ఫిర్యాదులున్నాయి. కొన్ని మాత్రమే ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు ప్రథమ ప్రాధాన్యంగా భూమి సొంతదారులకు ఎదురైన కష్టాలను గుర్తిస్తూ వారికి న్యాయం చేయడంపై దృష్టి పెట్టారు. గట్టి ఆధారాలను సేకరిస్తూ కబ్జారాయుళ్లను కటకటాల్లోకి పంపుతున్నారు. ఇదే విధంగా ప్రభుత్వ భూముల కబ్జాలపైనా పోలీసు, రెవెన్యూ అధికారులు దృష్టిపెడితే విలువైన సర్కారు స్థలాలు కబ్జా కోరల నుంచి బయటపడే అవకాశముంది.
అందినకాడికి ఫలహారంలా...
కరీంనగర్ చుట్టూ ఉన్న బొమ్మకల్, సీతారాంపూర్, తీగలగుట్టపల్లి, రేకుర్తి, చింతకుంట, మల్కాపూర్, ఆరెపల్లి, లక్ష్మీపూర్ గ్రామాల పరిధిలో ప్రభుత్వ భూములు, అసైన్డ్, చెరువు శిఖం భూముల్లో చాలావరకు కబ్జారాయుళ్లు పాగా వేశారు. ఉన్నతాధికారుల ఉదాసీనత వారికి కలిసి వచ్చింది. ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూములు. రికార్డుల పరంగా పదిలంగానే కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం వాటి రూపురేఖలు ఊహించని విధంగా మారిపోయాయి. రెవెన్యూ శాఖలోని కొంతమంది అధికారులు, సిబ్బందితో చేతులు కలిపి నాయకులు ఆ భూములను ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. 8 గ్రామాల్లో ఇరవై ఏళ్ల కింద రికార్డుల పరంగా దాదాపుగా 1804.26 ఎకరాల భూమి ఉన్నట్లు గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు సహ చట్టం ద్వారా వివరాలు సేకరించగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందులో పావు వంతు భూమి కూడా సర్కారు అధీనంలో లేనట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల పరిధిలోని ఆయా సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి కనీసం చూద్దామన్నా.. కనిపించని పరిస్థితి నెలకొంది. అయిదారు గ్రామాల్లోని కొన్ని సర్వే నంబర్లలో గుంటల విస్తీర్ణంలో ఉన్న భూములు చాలాచోట్ల మాయమయినట్లు గతంలోనే రెవెన్యూ అధికారులు గుర్తించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి సమన్వయంతో సాగి.. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాటిని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వ భూమి రికార్డుల్లో మాత్రమే చూపించాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే