లఖ్పతి దీదీలు 20 శాతం
జీవనోపాధుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా ప్రతి మహిళ రూ.లక్ష ఆదాయం ఆర్జించేలా అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం అందించడంతోపాటు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తోంది.
1,15,496 మంది మహిళలకు రూ.లక్షకు పైగా సంపాదన
జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ సర్వేలో వెల్లడి
న్యూస్టుడే, హుజూరాబాద్
డెయిరీ యూనిట్తో ఏటా రూ.లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న సైదాపూర్ మండలం దుద్దెనపల్లికి చెందిన తాటిపల్లి పద్మ
జీవనోపాధుల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం) ద్వారా ప్రతి మహిళ రూ.లక్ష ఆదాయం ఆర్జించేలా అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం అందించడంతోపాటు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తోంది. పొదుపు సంఘాల్లోని సభ్యులు తీసుకున్న రుణాలు.. వారు ఎదుగుతున్న తీరు తెలుసుకోవడానికి ఇటీవల క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన ఎన్ఆర్ఎల్ఎం ఉమ్మడి జిల్లాలోని రుణ గ్రహీతల్లో 20 శాతానికి పైగా మహిళలు ఖర్చులు పోనూ ఏడాదికి రూ.లక్షకు పైగా ఆర్జిస్తున్నట్లు లఖ్పతి దీదీల లెక్క తేల్చింది.
5.69 లక్షల మంది మహిళలపై సర్వే
నాలుగు జిల్లాల్లో మొత్తం 5,69,912 మంది స్వయం సహాయక సంఘాల మహిళలుండగా.. ఇందులో 5,59,130 (98 శాతం)మందిని సర్వే చేశారు. ఇందులో ఏటా రూ.25వేల లోపు ఆదాయం ఉన్న మహిళలు 29,244 (5 శాతం) మంది, రూ.26 వేల నుంచి రూ.60వేల లోపు ఆదాయం పొందుతున్న మహిళలు 1,92,341 (34 శాతం) మంది, రూ.61వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్న మహిళలు 2,22,049 (39 శాతం) మంది ఉన్నారు. ఇక రూ.లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్న మహిళలు 1,15,496 (20 శాతం) మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. రూ.లక్షకు పైగా ఆదాయం కలిగిన వారిలో అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 43,343 మంది ఉండగా తక్కువగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 21,426 మంది ఉన్నారు. ఆర్థిక క్రమశిక్షణతో లఖ్పత్లుగా ఎదిగిన పొదుపు సంఘాలను గుర్తించి రుణ సదుపాయాన్ని మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇక రూ.25వేల లోపు, రూ.26-60 వేల వార్షిక ఆదాయం మాత్రమే ఉన్న మహిళలు ఎందుకు వెనుకబడ్డారు, వారి ఆలోచన ధోరణి, ఆర్థిక ప్రణాళికలు ఏమిటి అనే అంశాలను పరిశీలించనున్నట్లు తెలిసింది. వారు ఆర్థికంగా ఎదిగేలా కచ్చితమైన ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిసింది. మహిళల ఆర్థిక అభ్యున్నతికి భవిష్యత్తులో అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సర్వే గణాంకాలు ఎంతో దోహదపడతాయని అధికారులు చెబుతున్నారు.
పొదుపు రుణాలతో స్వయం ఉపాధి
నాలుగు జిల్లాల్లో పొదుపు సంఘాల మహిళలకు ఏటా బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి తదితర పథకాల కింద రూ.కోట్ల రుణాలు అందజేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2019-20లో రూ.699.45 కోట్లు, 2020-21 రూ.1,397.88 కోట్ల రుణాలిచ్చారు. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరంలో రుణాల కేటాయింపు పెంచుతూ వచ్చారు. 2021-22లో రూ.1,626.22 కోట్లు, 2022-23లో రూ.2,455.07 కోట్లు, 2023-24లో రూ.2,116.87 కోట్ల రుణాలివ్వగా మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేస్తున్నారు. ఈ రుణాలతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారా? లేదా? అనే విషయమై క్షేత్రస్థాయిలో ఎన్ఆర్ఎల్ఎం సర్వే నిర్వహించింది. 2011 నుంచి ఇప్పటి వరకు పొదుపు సంఘాల్లో చేరి రుణాలు తీసుకుంటున్న మహిళల ఆర్థిక ఎదుగుదల, నిధుల వినియోగం, స్వయం ఉపాధి తదితర వివరాలను సేకరించారు. పొదుపు సంఘాల్లో చేరకముందు, చేరిన తర్వాత వచ్చిన మార్పులు, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటున్న తీరు, ఏటా వారి సంపాదన తదితర వివరాలను సేకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి