తల్లుల చెంత.. తరాల పులకింత..!
వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది.
వన దేవతలకు తీరొక్క మొక్కులు
న్యూస్టుడే, మేడారం (డోర్నకల్)
వనదేవతల సన్నిధిలో భక్తజనం పులకిస్తోంది.. ఆధ్యాత్మిక లోకంలో తేలియాడుతోంది.. బాలలకు రంగుల ప్రపంచం ముచ్చట గొల్పుతోంది.. యువతలో భక్తిభావం వెల్లువెత్తుతోంది. తల్లుల చెంత కొంత సమయం గడిపేందుకు వృద్ధుల్లో చైతన్యం ఉరకలేస్తోంది.. వయసుతో సంబంధం లేకుండా పసికందు మొదలు వృద్ధుల వరకు అమ్మల దర్శనంతో తన్మయత్వం చెందుతున్నారు. మేడారంలో ఎవరిని చూసినా సమ్మక్క, సారలమ్మల నామస్మరణే.. ఆధ్యాత్మిక చింతనే..
వన దేవతల దర్శనానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానం చేసి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులకు తీరొక్క మొక్కులు చెల్లిస్తున్నారు. ఆలయ ప్రాంగణం, జంపన్న వాగు వద్ద ముడుపులు కడుతున్నారు. సంతానం కోసం ఊయల, సుమంగళిగా వర్ధిల్లాలని గాజులు మొక్కుగా సమర్పిస్తున్నారు. ఎదురుకోడి, కోడె, చిల్లర నాణేలు, గంట, ఎత్తుబెల్లం(బంగారం), ఒడిబియ్యం, తలనీలాలు, తదితర మొక్కులు చెల్లిస్తున్నారు.
జాతర ప్రత్యేకతలు
- గురువారం మేడారంలోని చిలుకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని గద్దెకు చేర్చారు. ఈ మహాఘట్టాన్ని చూసేందుకు చిలుకలగుట్ట నుంచి గద్దెల వరకు భక్తులు బారులు తీరారు.
- మేడారంలోని గిరిజన మ్యూజియం ఆవరణలో కోయ గిరిజనుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపు 30కి పైగా ఇలవేల్పులను ఆయా వంశస్థులు ఒకే చోటుకు చేర్చారు. పగిడలతో ఆదివాసీ నృత్యాలు చేశారు. ఇలవేల్పులకు పూజలు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు.
- జంపన్నవాగులో ఒక్కరోజే దాదాపు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసినట్లు అంచనా.
- వనదేవతలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి దర్శించుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో పాటు ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్ అమ్మవార్లకు మొక్కులు చెల్లించారు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
అమ్మల జ్ఞాపిక.. ఆసక్తికరం
న్యూస్టుడే, మేడారం (కాజీపేట): మేడారం జాతర గుర్తుగా ప్రముఖులకు అందించే జ్ఞాపికను ఈసారి రాష్ట్ర ప్రభుత్వం విభిన్నంగా రూపొందించింది. గాజుగ్లాస్ ఫ్రేములో సమ్మక్క, సారలమ్మ గద్దెలు, వాటి మీద చెట్టు మొదళ్లకు కట్టిన చీరలతో కూడిన రూపాన్ని తయారు చేశారు. గురువారం సమ్మక్క దర్శనం కోసం వచ్చిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి మంత్రి సీతక్క దీన్ని బహూకరించారు.
హెలికాప్టర్లో వెళ్లొద్దామా..
న్యూస్టుడే, కాజీపేట టౌన్: మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర చూసి, తల్లులను దర్శించుకోవడానికి కాజీపేట సెయింట్ గాబ్రియల్ పాఠశాల నుంచి గురువారం హెలికాప్టర్ ద్వారా భక్తులు తరలి వెళ్లారు. హైదరాబాద్ నుంచి కాజీపేటకు చేరుకున్న హెలికాప్టర్ అప్పటికే ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకున్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందినవారిని మేడారానికి తీసుకెళ్లింది. గాలిలోకి ఎగిరిన అనంతరం 15 నిమిషాల్లో మేడారానికి చేరుకున్నట్లు భక్తులు తెలిపారు. ఒక్కొక్కరికి ప్రయాణ ఛార్జీ రూ.28,999. మేడారం అందాలను వీక్షించడానికి రూ.4,800 టికెట్ నిర్ణయించారు. హెలికాప్టర్ రోజుకు కేవలం మూడు నుంచి నాలుగు ట్రిప్పులు మాత్రమే మేడారానికి వెళ్లగలదని తుంబే ఏవియేషన్ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల