కలగానే కల్లాల నిర్మాణం
యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటే రైతులకు కల్లాల కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల్లో కోతలు ముమ్మరం కానుండటంతో ఇప్పటినుంచే ధాన్యం ఆరబోతకు పడరాని పాట్లు పడుతున్నారు.
హుజూరాబాద్- కాట్రపల్లి రోడ్డు పక్కన చదును చేసిన దృశ్యం
న్యూస్టుడే, హుజూరాబాద్: యాసంగి వరికోతలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటే రైతులకు కల్లాల కష్టాలు మొదలయ్యాయి. పది రోజుల్లో కోతలు ముమ్మరం కానుండటంతో ఇప్పటినుంచే ధాన్యం ఆరబోతకు పడరాని పాట్లు పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇలా..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగిలో 19 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చే అవకాశముండగా ధాన్యం ఆరబెట్టుకునేందుకు సదుపాయాలు లేకపోవడంతో రహదారుల పక్కన స్థలాలు తమవే అనిపించుకునేందుకు రైతులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హుజూరాబాద్లోని కేసీ క్యాంపు నుంచి కాట్రపల్లి వరకు రహదారికి ఇరువైపులా కల్లాల కోసం ఆయా గ్రామాల రైతులు ఖాళీ సంచులు, పాలిథిన్ కవర్లు వేసి ఆ స్థలం తమదే అనిపించుకుంటున్నారు. కోతలు ప్రారంభమైతే అనేక ప్రాంతాల్లో రహదారులే కల్లాలుగా మారుతున్నాయి. వరికోతలు ముమ్మరమైతే కల్లాలకు స్థలాలు దొరకవనే ఆందోళనతో ఇలా చేయక తప్పడం లేదని రైతులు చెబుతున్నారు.
అన్నదాతకు అవస్థలు
ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ క్షేత్రాల వద్ద కల్లాలు నిర్మించాలని అయిదారేళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఆచరణలో అమలుకు నోచుకోలేదు. కరీంనగర్ జిల్లాలో 2,600, పెద్దపల్లిలో 1,930, జగిత్యాలలో 3,029, రాజన్న సిరిసిల్లలో 1,652 కల్లాలను నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. మొత్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9,211 కల్లాలు మంజూరవగా నిధులు కూడా విడుదలయ్యాయి. కల్లాల (సిమెంటు గచ్చు) నిర్మాణానికి 50 చదరపు అడుగులకు రూ.56 వేలు, 60 చదరపు అడుగులకు రూ.68 వేలు, 75 చదరపు అడుగులకు రూ.85 వేలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, మిగిలిన వారికి 90 శాతం రాయితీ కల్పించింది కానీ.. పది శాతానికి మించి పూర్తి కాలేదు. మిగిలిన ప్రాంతాల్లో అసలు పనులే ప్రారంభం కాలేదు. ఫలితంగా కల్లాలు కలగానే మిగిలిపోవడంతో ప్రతీ సీజన్లో ధాన్యం ఆరబోతకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. వరి కోతలకు ముందే రహదారుల పక్కన ఖాళీ సంచులు వేసి ఆ స్థలం తమదే అనిపించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థలాలు అందుబాటులో లేకపోవడం, వ్యవసాయ క్షేత్రాల వద్ద సరిపోను సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలతో రహదారులపైనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు అంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.