ఖరారు విషయంలో తకరారు!
‘ప్రవీణ్రెడ్డి..? రాజేందర్రావు? మరో కొత్త అభ్యర్థా..?’ ఇదే ప్రశ్న సగటు కాంగ్రెస్ కార్యకర్త మదిలో మెదులుతోంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తుండగా..కార్యకర్తల్లో ఉత్కంఠ రేగుతోంది..
కొలిక్కిరాని కాంగ్రెస్ కరీంనగర్ అభ్యర్థిత్వం
ఈనాడు, కరీంనగర్: ‘ప్రవీణ్రెడ్డి..? రాజేందర్రావు? మరో కొత్త అభ్యర్థా..?’ ఇదే ప్రశ్న సగటు కాంగ్రెస్ కార్యకర్త మదిలో మెదులుతోంది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తుండగా..కార్యకర్తల్లో ఉత్కంఠ రేగుతోంది.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి దాదాపు పక్షం రోజులు దాటినా ఇంకా ఎవరు అభ్యర్థి అనేది పార్టీ తేల్చడం లేదు.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ కీలకమైన కరీంనగర్ విషయంలో మాత్రం జాప్యం చేస్తోంది. ఏడు అసెంబ్లీ స్థానాల్లో నాలుగుచోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న ఈ స్థానంలో ఇంతటి సందిగ్ధత నెలకొన్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. మరోవైపు ఈ పార్లమెంటు ఎన్నికల్లో జోరుగా ప్రచారానికి సిద్ధమవ్వాలనుకుంటున్న నాయకులు, కార్యకర్తలు మాత్రం ఇంకా ఎన్నాళ్లీ నిరీక్షణ అనే విధంగా పార్టీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. విపరీతమైన జాప్యం చేస్తే ప్రచారానికి సమయం సరిపోదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీ వాళ్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఖరారు చేస్తారని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఎవరి బలమెంత?
ప్రజలతో ఉన్న సత్సంబంధాలతోపాటు రాజకీయ అనుభవానికి అధిష్ఠానం ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఆయా అభ్యర్థుల విషయంలో పార్టీ చేపట్టిన సర్వేలో ఎవరికి ఎంత మెరుగైన స్థానముందనే విషయాన్ని బేరీజు వేసుకుంటున్నారు. దీంతోపాటు సామాజిక సమీకరణాల ఆధారంగా క్షేత్రస్థాయిలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయనే విషయమై కూడా పార్టీ పెద్దలు లోతుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరికి ఏ ప్రాంతం అనుకూలమనే విషయమై కూడా పార్టీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఇప్పటికే లోక్సభ నియోజకవర్గ పరిధిలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జుల అభిప్రాయాలను రాష్ట్రస్థాయి నేతలతోపాటు దిల్లీ పెద్దలు సేకరించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటు ప్రవీణ్రెడ్డి, అటు వెలిచాల రాజేందర్రావులు తమకే టికెట్ ఖాయమని అనుచరులకు ధీమానిస్తున్నారు. ప్రచారానికి సన్నద్ధమవ్వాలనే సంకేతాల్నిస్తున్నారు. ఇక వీరిద్దరే కాకుండా పార్టీ మరో అభ్యర్థి వేటలో ఉందనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అందుకోసమే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తుక్కుగూడలో బహిరంగ సభ తరువాతనే కరీంనగర్ స్థానం విషయంలో పార్టీ సీరియస్గా దృష్టి పెడుతుందని జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు దిల్లీ పెద్దలు కరీంనగర్ స్థానంపై దృష్టి పెట్టిన క్రమంలోనే అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు