బడి దూరంగా.. బాట భారంగా..!
గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు లేక విద్యార్థులు పక్క ఊళ్లకు బడి బాట పడుతున్నారు. సైకిళ్లపై, కాలినడకన, ఇతర వాహనాల్లో కి.మీ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు.
గ్రామాల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు లేక విద్యార్థులు పక్క ఊళ్లకు బడి బాట పడుతున్నారు. సైకిళ్లపై, కాలినడకన, ఇతర వాహనాల్లో కి.మీ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. బడికి సమయానికి చేరుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవికాలం కావడంతో విద్యార్థులు ఎండదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. కనీసం ఆర్టీసీ బస్సు సదుపాయమైనా కల్పించాలని వేడుకుంటున్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా అందించాల్సిన రూ.6 వేల రవాణా భత్యాన్ని ప్రభుత్వం ప్రస్తుతం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల రవాణా కష్టాలపై ‘న్యూస్టుడే’ పరిశీలన కథనం.
న్యూస్టుడే, గంగాధర, కరీంనగర్ పట్టణం
నడకే శరణ్యం
మానకొండూర్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ముంజంపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్నగర్, సదాశివపల్లి, జాలగుట్ట గ్రామాల విద్యార్థినిలు దాదాపు 100 మందికి పైగా చదువుకుంటున్నారు. ఈ గ్రామాలకు ఆర్టీసీ బస్సు వెళ్లకపోవడంతో వీరంతా పాఠశాలకు ప్రైవేటు వాహనాల్లో, సైకిళ్లపై, కాలినడకన వస్తుంటారు. వర్షాకాలంలో అయితే వానలు పడి పాఠశాలకు డుమ్మా కొట్టే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వేసవికాలంలో ఎండకు బడికి వెళ్లి వచ్చేసరికి అలసిపోతున్నారు.
న్యూస్టుడే, మానకొండూర్
సైకిళ్లపై సర్కారు బడికి..
సర్కారు బడులను ఒంటిపూట నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్సు సౌకర్యం, ఇతర వాహనాల సదుపాయం లేని దారుల్లో విద్యార్థులు పాఠశాలకు కాలినడకన, సైకిళ్లపై వెళ్తున్నారు. మధ్యాహ్నం బడి పూర్తయ్యాక ఇళ్లకు చేరే క్రమంలో ఎండతో అల్లాడుతున్నారు. గంగాధర మండలం న్యాలకొండపల్లి నుంచి కురిక్యాల ప్రభుత్వ పాఠశాలకు, నారాయణపూర్, లక్ష్మీదేవిపల్లి నుంచి గంగాధర ఉన్నత పాఠశాలకు పదుల సంఖ్యలో విద్యార్థులు సైకిళ్లపై వస్తున్నారు.
న్యూస్టుడే, గంగాధర
2 కి.మీ.లు నడిచి.. 5 కి.మీ.లు బస్కెక్కి
మండలంలోని లంబాడిపల్లికి చెందిన 20 మంది విద్యార్థులు 2 కి.మీ మండల కేంద్రానికి నడిచి.. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులో 5 కి.మీ ముల్కనూరులోని ఆదర్శ పాఠశాలకు వెళ్తున్నారు. ఇంకో పది మంది విద్యార్థులు చిగురుమామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఆదర్శ పాఠశాలకు వివిధ గ్రామాల నుంచి చిగురుమామిడి మీదుగా ఉదయం, సాయంత్రం బస్సు వెళ్తుంది. దానినే లంబాడిపల్లి వరకు బస్సు నడిపించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
న్యూస్టుడే, చిగురుమామిడి
ఆర్టీసీ బస్సు సరిపోక..
మండలంలోని రుక్మాపూర్ ఆదర్శ పాఠశాల ఊరికి 2 కి.మీ దూరంలో ఉండడంతో ఆ గ్రామ, కాట్నపల్లి విద్యార్థులు నడిచి వెళ్తున్నారు. వెదురుగట్ట, రాగంపేటలకు ఆర్టీసీ బస్సు సదుపాయం ఉన్న 500 మంది విద్యార్థులు ఉండడంతో కష్టాలు తప్పడం లేదు. ఆర్టీసీ అధికారులు మరో రెండు ట్రిప్పుల బస్సును ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
న్యూస్టుడే, చొప్పదండి
ఎండలో పడిగాపులు
చెల్పూరు జడ్పీ ఉన్నత పాఠశాలకు హుజూరాబాద్ మండలంలోని పలు గ్రామాలతో పాటు జమ్మికుంట నుంచి విద్యార్థులు వస్తుంటారు. బస్సుల కోసం ప్రయాణ ప్రాంగణం వద్ద విద్యార్థులు పడిగాపులు కాస్తున్నారు. ఎండవేడిమిని తట్టుకుంటూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. డ్రైవర్లు బస్సులు ఆపటం లేదంటూ వాపోతున్నారు.
న్యూస్టుడే, హుజూరాబాద్ గ్రామీణం
మండుటెండలో 2.5 కిలోమీటర్లు
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పోరండ్ల, మల్లాపూర్, పొగాకులపల్లి గ్రామాల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు వస్తుంటారు. పోరండ్ల నుంచి 20 మంది విద్యార్థులు ఆటోకు, 10 మంది సైకిళ్లపై, 10 మంది కాలినడకన 2.5 కి.మీ దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్తుంటారు. పొగాకులపల్లి నుంచి 5 గురు కాలినడకన చేరుకుంటారు. దాతలు ముందుకొచ్చి ప్రైవేటు వాహనం ఏర్పాటు చేసి తమ పిల్లల సమస్యను తీర్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
న్యూస్టుడే, తిమ్మాపూర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడివేళ అవస్థలు!
[ 27-07-2024]
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో.. ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
రైతు బీమా దరఖాస్తుకు వేళాయె
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా ఉంటుంది. -
‘ఇందిరా మహిళా శక్తి’తో ఆర్థిక ప్రగతి
[ 27-07-2024]
మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగంలేదని గమనించిన ప్రభుత్వం.. వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. -
నకిలీ ఏజెంట్ల వల.. అభాగ్యులు విలవిల
[ 27-07-2024]
విదేశాల్లో ఉద్యోగాల పేరిట నకిలీ ఏజెంట్ల మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఏజెంట్లు యూరప్ దేశాల్లో ఎక్కువ జీతాల పేరిట అభాగ్యులకు వల వేస్తున్నారు. -
పురాతన జలాశయాలు భద్రమేనా?
[ 27-07-2024]
జలాశయాలకు ఎగువ నుంచి వరద పోటెత్తితే దాని ఉద్ధృతిని తట్టుకునే సామర్థ్యం జిల్లాలోని పురాతన జలవనరులకు అంతంత మాత్రమే ఉంది. -
తల్లిదండ్రుల చెంతకు మానసిక దివ్యాంగులు
[ 27-07-2024]
పదేళ్ల తర్వాత ముగ్గురు మానసిక దివ్యాంగులు తల్లిదండ్రుల వద్దకు చేరారు. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం కోటప్పకొండకు చెందిన శ్రీను, నాగేంద్ర దంపతులు ఏళ్ల కిందట హైదరాబాద్ ఎల్బీనగర్కు వలస వచ్చారు. -
వాగు దారిలో వరద గండం
[ 27-07-2024]
గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ఏటా వానాకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సింగరేణిలో సన్నాహక సవ్వడేదీ!
[ 27-07-2024]
సింగరేణిలో క్రీడలపై యాజమాన్యం ఆసక్తి చూపడం లేదు. ఉత్సాహంగా పాల్గొనే క్రీడాకారులున్నా వారి ఎంపిక ప్రక్రియలో ప్రతీసారి హడావిడి తప్పడం లేదు. -
బదిలీల్లో భర్తీ కాని ఖాళీలు
[ 27-07-2024]
రాష్ట్ర వైద్య శాఖలో చేపట్టిన బదిలీలతోనైనా రామగుండంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆచార్యుల కొరత తీరుతుందనే ఆశలు అడియాసలయ్యాయి. -
సామర్థ్యాల సాధనకు సన్నద్ధం
[ 27-07-2024]
విద్యార్థుల్లో కనీస సామర్థ్యాల పెంపు లక్ష్యంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. -
సాగు వివరాలు.. ఆన్లైన్లో నమోదు
[ 27-07-2024]
జిల్లాలో వానాకాలం పంటల సాగు వివరాలను వ్యవసాయాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్ర సర్వే ద్వారా తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
ఆలయ ఉద్యోగుల బదిలీకి రంగం సిద్ధం
[ 27-07-2024]
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు ఉద్యోగులను బదిలీ చేయడానికి దేవాదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆలయ ఈవో జాబితాను రూపొందించి ఇటీవలే దేవాదాయశాఖ కమిషనర్కు పంపించారు. -
ఇంటింటా జ్వర సర్వే
[ 27-07-2024]
జిల్లాలో సీజనల్ వ్యాధుల కట్టడికి వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమాయత్తమయ్యారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట