ఎప్పటికైనా.. నేనే ముఖ్యమంత్రి
కనకపుర నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా.. నేను ముఖ్యమంత్రిని అవుతానన్న నమ్మకంతో మీరంతా ఓట్లు వేసి నన్న భారీ మెజార్టీతో గెలిపించారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
కల్లహళ్లి వెంకన్న ఆలయంలో శివకుమార్
ఈనాడు- బెంగళూరు, రామనగర- న్యూస్టుడే: కనకపుర నియోజకవర్గంలో ప్రచారం చేయకపోయినా.. నేను ముఖ్యమంత్రిని అవుతానన్న నమ్మకంతో మీరంతా ఓట్లు వేసి నన్న భారీ మెజార్టీతో గెలిపించారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అధిష్ఠానం ఆదేశాలతో ముఖ్యమంత్రి పదవిని వదిలేసి.. ఉప ముఖ్యమంత్రి స్థానానికి పరిమితం కావలసి వచ్చిందని వివరించారు. రానున్న రోజులలో ఏఐసీసీ తనను ముఖ్యమంత్రిగా నియమిస్తుందన్న నమ్మకం ఉందని ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంతూరు.. కనకపుర నియోజవర్గానికి ఆయన మొదటిసారిగా శనివారం విచ్చేశారు. కల్లహళ్లి వెంకటరమణ స్వామి, కబ్బాళమ్మ ఆలయాల్లో పూజలు చేశారు. హారోహళ్లిలో నియోజకవర్గం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదంటూ భాజపా, జనతాదళ్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీనే ప్రజలు ఆశీర్వదిస్తారన్న నమ్మకం తనకు ఉందని మొదటి నుంచి విశ్వసిస్తూ వచ్చానని చెప్పారు. హారోహళ్లి అనంతరం శివనహళ్లి, సాతనూరు, దొడ్డఆలహళ్లి, కోడిహళ్లి గ్రామాలలో రోడ్షో నిర్వహించి ఓటర్లు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
పేదలకు మరింత సాయం
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : వంట గ్యాస్ సిలిండర్ల ధర పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో పేద, దిగువ మధ్యతరగతి వర్గాల కుటుంబాల కోసం గృహజ్యోతి, గృహలక్షీ పథకాలు అమలులోకి తెస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ఆయన శనివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడారు. అద్దె ఇంట్లో ఉండే కుటుంబాలకూ గృహజ్యోతి పథకం వర్తిస్తుందన్నారు. విద్యుత్తు మీటరు ఎవరి పేరు మీదున్నా దాఖలాలను అధికారులకు అందజేసి ఆ పథకాన్ని సద్వినియ్వోగం చేసుకోవచ్చన్నారు. రెండువందల యూనిట్లు ఉపయోగించే వారందరికీ పథకం వర్తిస్తుందన్నారు. కొందరు స్వయం ప్రేరితంగా గృహజ్యోతి పథకాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆ పథకాన్ని మాకు వర్తింపజేయవద్దని ప్రభుత్వ ఉన్నతాధికారులు, కొందరు ప్రైవేట్ ఉద్యోగులు ప్రభుత్వానికి లేఖలు రాశారని వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నెలకు 150 యూనిట్లు వినియోగిస్తున్నా ‘గృహజ్యోతి’ పథకం వినియోగించుకొనేది లేదంటూ స్వయం ప్రేరితంగా లేఖ రాశారని హర్షం వ్యక్తం చేశారు. ఏ పథకాన్నైనా విమర్శించడమే ప్రతిపక్షాల ప్రధాన లక్ష్యమన్నారు. దానికి మేమేమీ అభ్యంతరం చెప్పబోమన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమా చేస్తామంటూ భాజపా చేసిన వాగ్దానం ఏమైందని నిలదీశారు.
స్థానికులకు నమస్కరించుకుంటూ వెళుతున్న డీకే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల