కరవే ఆందోళన తీవ్రరూపం
కర్ణాటకలో ప్రతి వ్యాపారి, సంస్థ తమ నామఫలకాలపై కనీసం 60 శాతం కన్నడ ఉండేలా చూసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికె అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘిస్తే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు.
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే : కర్ణాటకలో ప్రతి వ్యాపారి, సంస్థ తమ నామఫలకాలపై కనీసం 60 శాతం కన్నడ ఉండేలా చూసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికె అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉల్లంఘిస్తే తామే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. యలహంక నుంచి విమానాశ్రయం రోడ్డు సాదరహళ్లి గేటు వరకు వందలాది మంది కార్యకర్తలతో ఆయన ఊరేగింపు నిర్వహించారు. కొన్ని చోట్ల ఆంగ్లంలో ఉన్న ఫలకాలను ఆందోళనకారులు రాళ్లు రువ్వి పగలగొట్టారు. మరికొన్ని చోట్ల వాటిని బలవంతంగా తొలగించారు. పరిస్థితి అదుపుతప్పుతుండడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను నియంత్రించారు.
యలహంక సమీపంలో నారాయణగౌడ, ఇతర నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. తమను విడిచి పెట్టాలని ఎంజీరోడ్డు, బ్రిగేడ్ రోడ్డు వరకు ప్రదర్శన నిర్వహించాలని నారాయణగౌడ పట్టుపట్టారు. నామఫలకం వివాదానికి సంబంధించి బ్యాటరాయనపురలోని మాల్ ఆఫ్ ఆసియా ఇప్పటికే న్యాయస్థానంలో ఒక దావా వేసింది. అక్కడకు ఆందోళనకారులు రాకుండా పోలీసులు గట్టి బందోబస్తు కల్పించారు. బెంగళూరులో ఉంటున్న కన్నడిగులు మాతృభాషను మర్చిపోయే స్థితికి చేరుకున్నారని కరవే నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తాను అరెస్టయినా, కార్యకర్తలు ఆందోళన కొనసాగిస్తారని నారాయణగౌడ చెప్పారు. ఆయన అరెస్టు అనంతరం కొందరు కార్యకర్తలు యూబీ సిటీలోకి ప్రవేశించి, అక్కడి కొన్ని దుకాణాల ముందున్న ఫలకాలను పగలగొట్టారు. కన్నడకు మద్దతుగా, ఆంగ్లానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల