తండ్రి సైనికుడు.. తనయుడు తీవ్రవాది
బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడుకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసిన అనుమానిత తీవ్రవాదులు ముసావిర్ హుసేన్ శాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలను జాతీయ తనిఖీ దళం (ఎన్ఐఏ) కోరమంగలలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచింది.
‘రామేశ్వరం కేఫ్’ కేసులో ఎన్ఐఏ విచారణ
అనుమానిత తీవ్రవాదులు. ఎవరూ గుర్తు పట్టకుండా ఇలా గుండు, తలకట్టు చేయించుకున్నారు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : బ్రూక్ఫీల్డ్ రామేశ్వరం కేఫ్లో పేలుడుకు సంబంధించి పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేసిన అనుమానిత తీవ్రవాదులు ముసావిర్ హుసేన్ శాజిబ్, అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహాలను జాతీయ తనిఖీ దళం (ఎన్ఐఏ) కోరమంగలలోని న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచింది. పది రోజులు వారిని విచారించేందుకు న్యాయమూర్తి అనుమతి మంజూరు చేశారని ఎన్ఐఏ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీరు ప్రణాళికను రూపొందించుకున్నారు. బాంబుల తయారీ, పేలుడు అనంతరం తప్పించుకోవడం, ప్రమాణించే మార్గాల పటాల రూపకల్పన తదితరాల్లో వీరిద్దరూ సిద్ధహస్తులని గుర్తించారు. నిందితులను విచారించేందుకు మడివాళలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలలో ప్రత్యేక సెల్ను సిద్ధం చేశారు. ట్రాన్సిట్ వారెంట్పై వారిని తీసుకు వచ్చారు. భద్రత నడుమ న్యాయస్థానంలో హాజరుపరిచారు. విచారణ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. చెన్నైలో విఘ్నేశ్, మహ్మద్ జునైద్ సయ్యద్, సంజయ్ అగర్వాల్, ఉదయ్ దాస్, కోల్కతాలో అన్మోల్ కులకర్ణి, యశు శహనవాజ్ పాటిల్ తదితర పేర్లు పెట్టుకుని ముసావిర్ తిరిగాడు. నకిలీ ఆధార్ కార్డును చేయించుకున్నాడు. నిందితులు కోల్కతాలో 12 రోజుల పాటు రోజుకో ప్రదేశంలో తలదాచుకుంటూ వచ్చారు. అబ్దుల్ మతీన్ ఇంజినీరింగ్ పట్టభద్రుడు. తండ్రి దేశం కోసం సైనికుడిగా సేవలందించారు. అనారోగ్యంతో గత ఏడాది ఆయన మరణించారు. మంగళూరు కుక్కర్ బాంబ్ పేలుడు, శివమొగ్గ వద్ద బాంబు పేలుడు ఘటనల వెనుక మాస్టర్ మైండ్ ఇతడేనని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల