హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు.
కిరాయి ఇచ్చిన నిందితుడు
గదగ, న్యూస్టుడే : జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, తన సోదరుడ్ని చంపాలని ప్రకాశ్ బాకళె, సునంద పెద్ద కుమారుడు వినాయక్ బాకళెలను హత్య చేసేందుకు రూ.65 లక్షలకు కిరాయి మాట్లాడుకున్న వారి కుమారుడు వినాయక్ రూ.2 లక్షలు బయానా ఇచ్చాడు. అదే సమయంలో వారింటికి వచ్చిన సమీప బంధువులు పరశురామ్ హాదిమని (55), ఆయన భార్య లక్ష్మీ హాదిమని (47), వారి కుమార్తె ఆకాంక్ష (17), సునంద బాకళె చిన్న కుమారుడు కార్తిక్ (28)లను హంతకులు కడతేర్చి పరారయ్యారు. సునంద, ప్రకాశ్ తమ పడకగదిని బంధువులకు ఇచ్చి మరో గదిలో పడుకోవడంతో వారి ప్రాణాలు మిగిలాయి. మహారాష్ట్రకు చెందిన ఫయాజ్, అతని అనుచరులు హత్య చేశారని విచారణలో గుర్తించి, వారి కోసం గాలింపు తీవ్రం చేశారు. నగర సభ మాజీ అధ్యక్షుడు ప్రకాశ్ బాకళె, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు సునంద బాకళెకు కార్తిక్ బాకళె ఒక్కడే కుమారుడు. ప్రకాశ్ మొదటి భార్యకు వినాయక్, దత్తాత్రేయ, మరో కుమార్తె సంతానం. కుమార్తెకు వివాహమై అత్తవారింటికి వెళ్లింది. రెండో కుమారుడు దత్తాత్రేయ నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టి వంచించిన పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. గదగ, ముండరగి, బెంగళూరుతో పాటు పలు బ్యాంకులకు రూ.45 కోట్లు వంచించిన కేసులు ఉన్నాయి. తనకు చెడ్డ పేరు తెచ్చావంటూ దత్తాత్రేయను ఇంటి నుంచి దూరంగా ఉంచాడు. పోలీసులు అరెస్టు చేస్తారని దత్తాత్రేయ పరారయ్యాడు. ఇంట్లో వినాయక, కార్తిక్, తన రెండో భార్యతో కలిసి ప్రకాశ్ ఉంటున్నారు. తల్లిదండ్రులు, తన సోదరుడ్ని హత్య చేయిస్తే ఆ నేరం పరారీలో ఉన్న దత్తాత్రేయ మీదకు వెళుతుందని వినాయక్ భావించాడు. కిరాయి మాట్లాడుకుని తల్లిదండ్రులు, సోదరుడు ఉండే గది వివరాలను ఫయాజ్కు చెప్పాడు. ఏప్రిల్ 19న వేకువ జామున హంతకులు ఇంటికి చేరుకున్నారు. ప్రకాశ్, సునంద పడుకునే గదిలో బంధువులు పడుకున్నారు. ఆ దంపతులు, వారి కుమార్తెను, మరో గదిలో పడుకున్న కార్తిక్ను హత్య చేసి నిందితులు పరారయ్యారని ప్రాథమిక విచారణలో గుర్తించారు. తన మొదటి భార్య రెండో కుమారుడు దత్తాత్రేయ కానీ, అతని చేతిలో వంచనకు గురైన వారే ఈ హత్యలు చేసి ఉంటారని ప్రకాశ్ మొదట భావించారు. తాను నమ్ముకున్న పెద్ద కుమారుడు వినాయక్ హత్య చేయించాడని తెలుసుకుని నిర్ఘాంత పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం