ఇస్రో.. ఉద్యోగావకాశాల గని!
ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది.
వేదికపై శ్రీహరిశాస్త్రిని సత్కరిస్తున్న డాక్టర్ వి.కె.ఆత్రే, ఎం.ఆర్.సీతారామ్ తదితరులు
ఈనాడు, బెంగళూరు : ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తున్న భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నేడు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని విజయాలు సాధిస్తోంది. బీఈ, ఆర్కిటెక్చర్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ..ఇలా అన్ని సబ్జెక్టుల్లో పట్టభద్రులకు ఉపాధి కల్పించే వేదికగా మారిందని ఇస్రో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ విభాగం మాజీ సంచాలకుడు పి.శ్రీహరిశాస్త్రి వివరించారు. బెంగళూరులోని రామయ్య సాంకేతిక విద్యాసంస్థ (ఆర్ఐటీ) బీఈ, బీటెక్, ఎంబీఏ తదితర కోర్సుల పట్టభద్రుల వీడ్కోలు సమావేశంలో ఆయన శనివారం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంజినీరింగ్, సాంకేతిక కోర్సులు నేడు సంప్రదాయ పరిధిలు దాటి విస్తృత అవకాశాలు అందించే స్థాయికి చేరుకున్నాయని వివరించారు. కృత్రిమమేధ, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక కోర్సులను ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి కోర్సులతో పాటు నేర్చుకునే వెసులుబాటు అన్ని విద్యా సంస్థల్లో ఉందన్నారు. ఈ బహుముఖ కోర్సుల విధానం ఇస్రో, డీఆర్డీఓ, హెచ్ఏఎల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఉపాధి అందించేవిగా మారాయన్నారు. రానున్న ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా వంద మిలియన్ల మెకానికల్ పోస్టులు ఖాళీ అవుతుండగా, అందులో 30 శాతం భారత్లోనే ఉన్నాయన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలోనూ ఈ స్థాయిలో ఉపాధి అవకాశాలున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణశాఖ మాజీ సలహాదారుడు డాక్టర్ వి.కె.ఆత్రే మాట్లాడుతూ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికత కలిగిన దేశంగా మారే భారత్కు ప్రస్తుత విద్యార్థుల సహకారం ఎంతో కీలకమన్నారు. జీఈఎఫ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎం.ఆర్.సీతారామ్, ఆర్ఐటీ ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.ఆర్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల