ప్రజ్వల్ తప్పించుకోలేడు
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు.
వేంకటేశ్వరాలయంలో ధ్యానముద్రలో దేవేగౌడ
ఈనాడు, బెంగళూరు : మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ప్రధాని హెచ్.డి.దేవేగౌడ అభిప్రాయపడ్డారు. ఆయన శనివారం తన 92 పుట్టిన రోజు సందర్భంగా దేవస్థానానికి వెళ్లి వస్తూ విలేకరులతో మాట్లాడారు. ‘నెల రోజులుగా ఈ కేసు విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నా. తప్పుచేసినట్లు తేలితే.. ప్రజ్వల్ రేవణ్ణపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదు. నా కుమారుడు హెచ్.డి.రేవణ్ణపై ఎలాంటి కేసులు వేశారో ప్రజలు గమనిస్తున్నారు. ఆయనకు ఓ కేసులో బెయిల్ రాగా ఇంకో కేసు విచారణలో ఉంది. మా కుటుంబం తరఫున న్యాయ, రాజకీయ వ్యవహారాలన్నీ మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చూసుకుంటున్నారు. ఈ కేసుల వెనుక ఎవరెవరున్నారో నాకు తెలుసు. వారి పేర్లు ఇప్పుడే బయటపెట్టను’ అంటూ వ్యాఖ్యానించారు. బాధిత మహిళలకు పరిహారం చెల్లించాలని ఇప్పటికే కుమారస్వామి డిమాండు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కేసు వెనుక ఎవరున్నా కుమారస్వామి వారిని విడిచిపెట్టడంటూ హెచ్చరించారు. ఓ భాజపా నేత ఈ కేసు వెనుక ఎవరున్నారో స్పష్టం చేశారని గుర్తుచేశారు. నెల రోజులుగా మా ఇంటి ముందు కెమెరాలతో వేచి ఉన్నా మీకు ఏం దొరికిందంటూ ఆయన మాధ్యమ ప్రతినిధులను ప్రశ్నించారు.
మరోవైపు.. భారత్కు రాకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) నిఘా పెంచింది. ఇప్పటికే మూడు సార్లు భారత్ వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకుని వాటిని రద్దు చేసుకున్న ప్రజ్వల్ను మరింత కట్టడి చేసేందుకు ఆయన బ్యాంక్ ఖాతాలపై అధికారులు దృష్టి సారించారు.
ప్రజ్వల్
లండన్లో ప్రత్యక్షం
బెంగళూరు (సదాశివనగర) : హాసన లోక్సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ అధికారులు అరెస్టు వారెంటు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ద్వారా వారెంటు జారీ చేశారు. మూడు వారాలుగా పరారీలో ఉన్న ఆయన జర్మనీ నుంచి లండన్కు రైల్లో వెళ్లాడని గుర్తించారు. ఆయన ఎంతకీ విచారణకు హాజరు కాకపోవడంతో అధికారులు చివరికి అరెస్టు వారెంటు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల