హావేరి జిల్లాలో ప్రమాదం.. నలుగురి దుర్మరణం
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళుతున్న సమయంలో రాణెబెన్నూరు సమీపంలోని హలగేరిబైపాస్ వద్ద శుక్రవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.
బోల్తా కొట్టి.. నుజ్జయిన వాహనం
హావేరి, న్యూస్టుడే : తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళుతున్న సమయంలో రాణెబెన్నూరు సమీపంలోని హలగేరిబైపాస్ వద్ద శుక్రవారం వేకువ జామున సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. హావేరిలోని అశ్విని కాలనీకి చెందిన సురేశ్ వీరప్ప జాడి (45), ఐశ్వరయ్య ఈరప్ప బార్కి (22), చేతనా ప్రభురాజ సమగండి (7), పవిత్రా ప్రభురాజ సమగండి (28) అనే వ్యక్తులను మృతులుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చెన్నవీరప్ప జాడి, సావిత్ర జాడి, వికాస్ హొన్నప్ప బార్కి, నీలప్ప బార్కె, ప్రభురాజ ఈరప్ప, గీతా హొన్నప్పలకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం దావణగెరెలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. వంతెన పైనుంచి కారు కిందపడడంతో ప్రమాదం సంభవించింది. రాణె బెన్నూరు గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
లారీ ఢీకొని.. మరో నలుగురు..
చిక్కమగళూరు: మూడిగెరె తాలూకా బణకల్ సమీపంలో శుక్రవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని మంగళూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ధర్మస్థల మంజునాథ స్వామి దర్శనం ముగించుకుని చిత్రదుర్గకు వెళుతున్న సమయంలో వీరి కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. మూడిగెరె గ్రామీణ ఠాణా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చెన్నపట్టణలో విషాదం
చిత్రదుర్గం: చిక్కమగళూరులో చోటుచేసుకున్న ఓ ప్రమాదం చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె తాలూకా చెన్నపట్టణలో విషాదాన్ని నింపింది. మూడిగెరె తాలూకా బణకల్ సమీపాన ఆ ప్రమాదంలో ఈ గ్రామానికి చెందిన నలుగురు చనిపోయిన వార్త కలచివేసింది. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. హంపయ్య అనే పెద్దాయన బంధువులు 16 మంది రెండు కార్లలో ధర్మస్థల యాత్రకు పయనమయ్యారు. వెనుతిరిగి వస్తున్న సమయంలో ఓ కారుకు ప్రమాదం వాటిల్లింది. హంపయ్య (65)తో పాటు మంజయ్య (60), ప్రభాకర్ (45), ప్రేమ (58) అనే వారు కన్నుమూశారని బంధువులు ధ్రువీకరించారు. రెండో కారులోని వారూ ప్రమాదాన్ని కొద్దిలో తప్పించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ