నిధుల్లేక అభివృద్ధి కరవు: భాజపా
అభివృద్ధి పనులకు నిధులు కరవై ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు.
వేదికపై విజయేంద్ర, అశోక్, పీసీ మోహన్ తదితరులు
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే : అభివృద్ధి పనులకు నిధులు కరవై ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని భాజపా రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆరోపించారు. బెంగళూరులో మౌలిక సదుపాయాల కొరత, నిలిచిపోయిన అభివృద్ధి పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ నెల 28న ధర్నా చేస్తామని ప్రకటించారు. నగరంలోని సమస్యలపై విపక్ష నేత అశోక్, చట్టసభల ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, వివిధ మోర్చాల ప్రతినిధులతో శుక్రవారం చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రెండు రోజులు వరుసగా వర్షం కురిస్తే నగరంలో వాహన రద్దీ, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు, విద్యుత్తు, అంతర్జాల సేవలకు అంతరాయం తదితరాలు ఉంటాయని గుర్తు చేశారు. ఆస్తి పన్నును ఇష్టం వచ్చినట్లు పెంచిన పాలికె, మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఫొటో షూట్కు వెళ్లినట్లు నగర పర్యటన చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భావిస్తున్నారని విపక్ష నేత ఆర్ అశోక్ విమర్శించారు. ఖజానాలో నగదు లేకపోవడంతోనే గుత్తేదారులకు బిల్లులు చెల్లించడం లేదని, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. బ్రాండ్ బెంగళూరును ప్రకటించి ఏడాదైనా, ఇప్పటి వరకు దాని కోసం ఎటువంటి నిధులు విడుదల చేయలేదన్నారు. పార్టీ నాయకులు అశ్వత్థ నారాయణ, డీవీ సదానందగౌడ, గోపాలయ్య, భైరతి బసవరాజ్, పీసీ మోహన్, మునిరాజు, సీకే రామమూర్తి, లెహర్సింగ్ సిరోయ, కట్టా సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉడ్తా.. బెంగళూరు
బెంగళూరు (మల్లేశ్వరం): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రాజధానిని ‘ఉడ్తా బెంగళూరు’గా మార్చివేసిందని కర్ణాటక భాజపా దుయ్యబట్టింది. నగరాన్ని మాదక ద్రవ్యాలకు అడ్డాగా మార్చారని, రేవ్ పార్టీలు జరుగుతున్నాయని ఆరోపించింది. అనుమతి లేకుండా ఒకచోట చేరి రేవ్ పార్టీలు చేసుకునే వారి సంఖ్య ఎక్కువైందని భాజపా దుయ్యబట్టింది. శాంతిభద్రతలకు భంగం కలుగుతున్నా, ప్రభుత్వం ఉలుకు, పలుకులేకుండా ఉండిపోయిందని దుయ్యబట్టింది. సిలికాన్ సిటీని ‘ఉడ్తా బెంగళూరు’ అని పిలవడం సరికాదని హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ వ్యాఖ్యానించారు. రేవ్ పార్టీకి హాజరైన 103 మందిని పట్టుకుని ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. అందరికీ పరీక్షలు చేసి, మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు రుజువైన ప్రతి ఒక్కరికీ సీసీబీ నోటీసులు జారీ చేసిందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి