గనుల సంరక్షణకు చర్యలు
ముడి ఇనుము ఉత్పత్తిలో కర్ణాటకలో దేశంలోనే మొదటి స్థానం సాధిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.
సమావేశంలో ప్రహ్లాద్ జోషి, బొమ్మై, హలప్ప ఆచార్ తదితరులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ముడి ఇనుము ఉత్పత్తిలో కర్ణాటకలో దేశంలోనే మొదటి స్థానం సాధిస్తుందని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు. బెంగళూరులో ‘గనుల రంగంలో అవకాశాలు- వేలం- పెట్టుబడులు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించి ప్రసంగించారు. బళ్లారి జిల్లాలో లభించే ముడి ఇనుము ఎంతో విలువైనదని వివరించారు. న్యాయస్థానం సూచనలతో గనుల తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ గనుల ప్రగతిలో ప్రస్తుతం ఒడిశా ముందు వరుసలో ఉందన్నారు. ప్రకృతి సంపదను మానవాళి అభివృద్ధికి వినియోగించాలన్నారు. అది దుర్వినియోగం కాకూడదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ దూరదృష్టి కలిగిన నాయకుడని, ప్రకృతి సంపద రక్షణపై ఎక్కువ దృష్టి సారించారని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ దేశంలో విద్యుత్తుకు డిమాండ్ పెరుగుతోందని, 2040 నాటికి అవసరాలు రెట్టింపు అవుతాయన్నారు. కొరత నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళిక అవసరమన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టిసారిస్తే సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. అన్నింటికీ బొగ్గుపై ఆధారపడితే నిల్వలు హరించుకు పోతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో మంత్రి హలప్ప ఆచార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం