నేలకొరిగిన అర్జునుడు
మైసూరు దసరా ఉత్సవాల్లో ఎనిమిదిసార్లు అంబారీ మోసిన అర్జున సోమవారం కన్నుమూసింది. నాలుగు అడవి ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అది మరణించిందని అధికారులు తెలిపారు.
ఏనుగుల దాడిలో విషాదాంతం
హాసన, న్యూస్టుడే : మైసూరు దసరా ఉత్సవాల్లో ఎనిమిదిసార్లు అంబారీ మోసిన అర్జున సోమవారం కన్నుమూసింది. నాలుగు అడవి ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి అది మరణించిందని అధికారులు తెలిపారు. సకలేశపుర యసళూరు బాళెకెరె అటవీ విభాగంలో మదగజాలను బంధించేందుకు అర్జున, మరో మూడు ఏనుగులతో సిబ్బంది వేటకు కదిలారు. ఏనుగులకు రేడియో కాలర్ల ఏర్పాటు, బంధించేందుకు తీసుకుంటున్న చర్యలకు ‘అర్జున’ నేతృత్వం వహిస్తోంది.
ఒక మదగజానికి మత్తు సూది ఇచ్చే సమయంలో దానితో పాటు మరో నాలుగు ఏనుగులు అర్జునపై దాడి చేశాయి. తమ దంతాలతో పొట్ట భాగం వద్ద చీల్చడంతో తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే మరణించింది. మైసూరు దసరా ఉత్సవాల్లో 2012 నుంచి 2019 వరకు వరుసగా అంబారీతో ఇది నడిచింది. మొత్తం 22 సార్లు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఘనత దీని సొంతం. కాకనకూట అటవీ విభాగంలో 1968లో అర్జునను బంధించారు. నాగరహొళ జాతీయ ఉద్యానం పరిధిలోని శిబిరంలో ఇది శిక్షణ పొందింది. పులులు, మదగజాల వేటలో కెప్టెన్ అర్జున పాత్ర కీలకం అని అధికారులు తెలిపారు. అర్జున తమ కళ్లముందే మరణించడంతో మావటీలు కన్నీరుమున్నీరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?