శభాష్.. గౌరీశ్..!
ఓ బస్టాపు సమీపాన నిలిచి ఉన్న బీఎంటీసీ బస్సును వెనకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని పెను ముప్పును సృష్టించింది. ఈ సంఘటన బెంగళూరు శివారు బ్యాటరాయనపుర (ఉత్తర) పోలీసుఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : ఓ బస్టాపు సమీపాన నిలిచి ఉన్న బీఎంటీసీ బస్సును వెనకనుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొని పెను ముప్పును సృష్టించింది. ఈ సంఘటన బెంగళూరు శివారు బ్యాటరాయనపుర (ఉత్తర) పోలీసుఠాణా పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. యశ్వంతపుర నుంచి బనశంకరి వైపు వెళుతున్న ఆ బస్సును కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొనటంతో ఒక్కసారిగా మంటలు ఎగసి.. బస్సునూ చుట్టుముట్టాయి. ఢీకొన్న ఉత్తర క్షణమే కారులోంచి లోకేశ్ అనే వ్యక్తి భార్య, కుమారుడుతో అందులోంచి తప్పించుకున్నారు.
మంటలు గుర్తించిన బస్సు డ్రైవర్, కండక్టర్ గౌరీశ్, గిరిధర్ వేగంగా స్పందించి అందులోని 35 మంది ప్రయాణికులను వేగంగా కిందకు దింపారు. బస్సు కాలిపోతుందనే విషయాన్ని పసిగట్టిన గౌరీశ్ వేగంగా ఆ బస్సును ముందుకు నడిపినా.. కారు విడివడలేదు. చివరికి కండక్టర్ గిరిధర్ సహకారంతో చాకచక్యంగా ఓ డివైడర్పైకి బస్సును దూకించడంతో కారు విడిపోయి.. ఆగిపోయింది. బస్సుకు పాక్షికంగానే నష్టం వాటిల్లింది. బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తిని ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు. సంస్థ ఆస్తి రక్షణకు తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు, అగ్నిమాపక అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే