ఐటీ శాఖ ఉన్నతాధికారినంటూ.. మాయగాడి పెళ్లినాటకం
అంతర్జాలంలో ప్రైవేట్ పెళ్లి వేదికలను వివిధ పేర్లతో నిర్వహిస్తూ, నకిలీ ఖాతాలను సృష్టించి, ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారిగా చెప్పుకొంటూ మహిళలను మోసం చేస్తున్న అంకిత్జైన్ అనే వ్యక్తిని బెంగళూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : అంతర్జాలంలో ప్రైవేట్ పెళ్లి వేదికలను వివిధ పేర్లతో నిర్వహిస్తూ, నకిలీ ఖాతాలను సృష్టించి, ఆదాయపన్ను శాఖ ఉన్నతాధికారిగా చెప్పుకొంటూ మహిళలను మోసం చేస్తున్న అంకిత్జైన్ అనే వ్యక్తిని బెంగళూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
వారందించిన సమాచారం ప్రకారం.. వితంతువులు, విడాకులు తీసుకున్న దాదాపు 250 మంది మహిళలను మోసగించాడనేది ప్రధాన ఆరోపణ. నా పేరు ‘పవన్ అగరవాల్’ అని చెప్పుకొని, ఆదాయ పన్నుశాఖ ఉన్నతాధికారిగా పరిచయం చేసుకోవడం ద్వారా అందరినీ సులువుగా మోసం చేయగలిగాడని రైల్వే పోలీస్ ఐజీపీ డాక్టర్ ఎస్.శరణప్ప వెల్లడించారు. పెళ్లి విషయాన్ని మాట్లాడాలంటూ ఇటీవల కోయంబత్తూరు నుంచి ఓ మహిళ కుటుంబాన్ని నగర రైల్వేస్టేషన్కు ఆ వ్యక్తి రప్పించాడు. వారిని ఓ హోటల్లో ఉంచి చర్చలు జరిపాడు. పనిలో పనిగా టికెట్ రిజర్వు చేసుకోవాలంటూ.. ఇంట్లో పర్సు మరచిపోయానని ఆమె నుంచి రూ.10 వేలు తీసుకున్నాడు. ఆ వ్యక్తి మాటలు నమ్మి ఆమె డబ్బు సమర్పించుకున్న కొద్ది సేపటికే బయటకు వెళ్లిన అంకిత్.. అలియాస్ ‘పవన్’ ఫోను మూగబోయింది.
అప్రమత్తమైన ఆమె రైల్వేపోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడి కోసం గాలించి పట్టుకున్నారు. ఆ వ్యక్తి అత్యంత చాకచక్యంగా పత్రికల్లో వచ్చే ప్రకటనల ఆధారంగా వితంతువులు, విడాకులు తీసుకున్న ఆడవారికి వలవేసి, ఆకర్షించేవాడని గుర్తించారు. నేనే పెళ్లి చేసుకుంటానంటూ కొందరిని నమ్మించి, కొన్నాళ్లు సహజీవనం సాగించి, వారి వద్ద మోసపూరితంగా డబ్బు లాగేసుకుని మాయమైపోయేవాడని దర్యాప్తులో గుర్తించారు. ఈ పనుల కోసమే ప్రత్యేక ఫోన్లను ఉపయోగించాడు. రాత్రిళ్లు మాత్రమే ఆడవారితో మాట్లాడేవాడట. ఈ వ్యక్తి వలలో పడిన వివిధ రాష్ట్రాల బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. రాజస్థాన్కు చెందిన 56, ఉత్తరప్రదేశ్ 32, దిల్లీ 32, కర్ణాటక 17, మధ్యప్రదేశ్ 16, మహారాష్ట్ర 13, గుజరాత్ 11, తమిళనాడు ఆరుగురు, బిహార్ ఐదుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం 250 మంది మహిళలతో ఆ వ్యక్తి చాట్ చేసిన దాఖలాలు వెలుగుచూశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు గాయానికి మందు!
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్రాల మధ్య కరవు పరిహారం కోసం కొనసాగుతున్న పోరు కొలిక్కి వచ్చింది. గత శుక్రవారం కేంద్ర సర్కారు వారం రోజుల్లో ఈ పరిహారం చెల్లిస్తామని హామీ ఇస్తూ విచారణ వాయిదా చేయాలని కోరిన విషయం తెలిసిందే. -
ఇక..ఉత్తర దిగ్విజయయాత్ర!
[ 28-04-2024]
కర్ణాటక దక్షిణ, పాతమైసూరు, కరావళి ప్రాంతాల్లో తొలివిడత ఎన్నికలను విజయవంతంగా ముగించిన పార్టీలు.. రెండో విడతపై దృష్టి సారించాయి. -
హాసనలో లైంగిక దౌర్జన్యాలపై సిట్
[ 28-04-2024]
హాసన జిల్లాలో ఓ పార్టీకి చెందిన యువ నాయకుడు యువతులు, మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. -
భాజపా తీరు ప్రమాదకరం
[ 28-04-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నాయకులతో వెనుకబడిన వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. -
తప్పుడు ప్రచారంలో ఆరితేరారు
[ 28-04-2024]
అబద్ధాలను చెప్పడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరితేరారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆరోపించారు. చెప్పిన అబద్ధాన్ని మరోసారి చెప్పకుండా, కొత్తవి నమ్మించేలా చెప్పడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. -
కారటగిలో రెండు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు
[ 28-04-2024]
ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు ఆకర్షించేందుకు కారటగి పట్టణంలోని రెండు పోలింగ్ కేంద్రాలను అధికారులు మాదిరి పోలింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దారు. -
కాంగ్రెస్ పార్టీ పేదల పక్షం
[ 28-04-2024]
పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, కూలీలు, విద్యార్థులకు అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఆశీర్వదించాలని డీసీసీ అధ్యక్షుడు అల్లం ప్రశాంత్ కోరారు. -
అమాత్యులకు పరువు.. ఆయనకు రాజకీయ మలుపు
[ 28-04-2024]
బళ్లారి లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాం గెలుపును బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, జమీర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. -
ప్రధాని ముఖంలో ఓటమి భయం
[ 28-04-2024]
అబద్ధాల సర్దార్..మౌని బాబా ప్రధాని నరేంద్ర మోదీ ముఖంలో ఓటమి భయం కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందుతారని లోక్సభ మాజీ సభ్యుడు వి.ఎస్.ఉగ్రప్ప తెలిపారు. -
కాంగ్రెస్ వారు చెంబు లీజ్కు తీసుకున్నారా?
[ 28-04-2024]
బళ్లారి నగరంలో జరిగిన బహిరంగ సమావేశంలో రాహుల్గాంధీ హస్తం గుర్తు గురించి మాట్లాడలేదు. ఖాళీ చెంబు గురించే మాట్లాడారు.
తాజా వార్తలు (Latest News)
-
నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్ దీటైన జవాబు
-
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
-
అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్చల్.. తెదేపా సానుభూతిపరులపై దాడి
-
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు.. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ అరెస్ట్
-
ఆదుకుంటానన్నావ్.. పీల్చి పిప్పి చేశావ్!!
-
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్