సీఎం, గవర్నర్ సంతకాల ఫోర్జరీ
కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యత్వాన్ని ఇప్పిస్తామని వంచనకు పాల్పడిన నలుగురు నిందితులను బెంగళూరు కేంద్ర నేరనియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
బెంగళూరు (మల్లేశ్వరం): కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యత్వాన్ని ఇప్పిస్తామని వంచనకు పాల్పడిన నలుగురు నిందితులను బెంగళూరు కేంద్ర నేరనియంత్రణ దళం (సీసీబీ) పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి, గవర్నర్ పేరిట నకిలీ సంతకాలు చేసి, నియామక పత్రాలను వీరు సృష్టించి రూ.4.10 కోట్ల నగదు వంచనలకు పాల్పడ్డారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. తావరకెరె భువనప్ప లేఅవుట్ నివాసి రిజాయ్ అహ్మద్ (41), మల్లేశ్వరం నివాసి యూసుఫ్ సుద్ధికట్టె (47), మూడిగెరె నివాసి సి.చంద్రప్ప (44) కనకపుర తాలూకా ఉయ్యంబళ్లి నివాసి రుద్రేశ్ (35)ను నిందితులుగా గుర్తించారు. చేతన్ శంకర్, హర్షవర్ధన్, మహేశ్ అనే సహచరులతో కలిసి వీరు వంచనలకు పాల్పడ్డారు. కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దాడులు నిర్వహించి వీరిని అరెస్టు చేశామని నగర పోలీసు కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు తీవ్రం చేశామన్నారు.
ఎన్నికల అధికారి ఆత్మహత్యాయత్నం
మంగళూరు: ఎన్నికల విధుల్లో ఉన్న శ్రీధర్ హెగ్డే అనే అధికారి దక్షిణ కన్నడ జిల్లాధికారి కార్యాలయం ఆవరణలో బలవన్మరణానికి ప్రయత్నించారు. వ్యక్తిగత కారణాలతో ఆయన విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారని గుర్తించారు. బాధితుడ్ని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఆయన భార్య జయంతి స్టాఫ్ నర్సు. నగర ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బ్రాండ్ బెంగళూరుకు శ్రీకారం!
[ 27-07-2024]
బ్రాండ్ బెంగళూరు విస్తరణ పనులు చకచకా పూర్తి చేసేందుకు సర్కారు ఆసక్తి చూపుతోంది. -
ఎడతెగని జలజడి
[ 27-07-2024]
రాష్ట్రాన్ని వానలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. -
వీర సైనికుల సేవలే చరిత్ర
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయానికి రాత్రింబగళ్లూ శ్రమించిన సైనికుల సేవలను కన్నడిగులు శుక్రవారం స్మరించుకున్నారు. -
మాదకద్రవ్యాల ‘గుట్ట’ రట్టు
[ 27-07-2024]
వ్యాపారం చేసుకునేందుకు వీసా తీసుకుని బెంగళూరుకు వచ్చి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న నైజీరియాకు చెందిన చకుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రూ.6 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను ఎలక్ట్రానిక్ సిటీ ఠాణా పరిధిలో పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. -
విపక్ష నేతలకు సత్కారం
[ 27-07-2024]
విధానపరిషత్తులో భాజపా సభా నాయకునిగా బాధ్యతలు చేపట్టిన చలవాది నారాయణ స్వామి విధానసౌధలో తనకు కేటాయించిన కార్యాలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. -
గంగావళి రుద్రరూపం
[ 27-07-2024]
ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకా శిరూరు సమీపాన జాతీయ రహదారిపై కొండచరియలు కూలిన ఘటనలో ఇప్పటికే ఎనిమిది మృతదేహాలు వెలికితీయగా.. అక్కడ ప్రమాదంలో చిక్కుకుని మరణించినట్లు అనుమానిస్తున్న మరో ముగ్గురి కోసం గాలింపు ప్రక్రియకు సమీప గంగావళి నదీ ప్రవాహం అడ్డుగా నిలిచింది. -
హస్తిన వేదికగా నిరసనాస్త్రం
[ 27-07-2024]
మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా), వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాలపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలంటూ కర్ణాటక నుంచి ఎంపికైన భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే